-
కుంచెడు కృతజ్ఞత
సైన్యం రెండు రకాల యుద్ధాలు చేస్తుంది. శత్రువును చొరబడనివ్వని యుద్ధం. తెగబడి వస్తే.. సంహరించే యుద్ధం. కరోనాపై ఇప్పుడు జరుగుతున్నది సంహారయుద్ధం.ఈ యుద్ధంలో ఫ్రంట్లైన్ సైనికులు.. నర్సులు.కరోనా కొమ్ముల్ని వంచుతున్నారు.‘అంటు’ కొమ్మల్ని నరికేస్తున్నారు. విరామం లేదు.. విరమణ లేదు..ఇల్లు లేదు.. వదిలేసి వెళ్లేది లేదు.‘సిస్టర్.. ఊపిరి అందట్లేదు’.. అటొక పరుగు.‘సిస్టర్.. మీ పాప వచ్చింది’.. ఇటొక పరుగు.ఎలా తీర్చుకోవాలి ఈ సైనికుల రుణం?ఎలా ఓర్చుకోవాలి ఈ కృతజ్ఞతా భారం? కరోనా నుంచి చైనాను గట్టెక్కించిన వైద్య సేవకులలో తొంభై శాతం మంది మహిళా నర్సులే. కరోనాపై పోరాటం ఎలా ఉంటుందో ప్రపంచం మొదట చూసిందీ.. మాస్కులు తొలగిన ఆ చైనా నర్సుల ముఖాల్లోనే! ఒత్తుకుపోయి, నొక్కుకుపోయి, కమిలిపోయి..! మూడు నెలల పోరాటం తర్వాత చైనా ఇప్పటికి కాస్త కుదుట పడింది. ఆ దేశ ప్రజలు నర్సులకు మాటల్లో కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నారు. మాటల్లో చెప్పలేనిది పాట అవుతుంది. నర్సులను కీర్తిస్తూ పాటలు పాడారు. సరిపోలేదు. మాటలు, పాటలు కాదని నిశ్శబ్ద, నిశ్చల చిత్రాలను గీయడం మొదలు పెట్టారు. ‘పవర్ ఉమన్’ గా నర్సులను రేఖాచిత్రాల్లోకి తెచ్చారు. ఒక యువతి.. నర్సు బాధ్యతల్ని తొడుక్కుంటోంది. ‘రూపాంతర చిత్రం’ అది. ఒక ‘సిస్టర్’ కరోనాపై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ‘సిస్టర్ వారియర్ చిత్రం’ అది. నర్సులు ఒకరికి ఒకరు ఊతం ఇచ్చుకుంటూ రోగులకు ఊపిరులు ఊదుతున్నారు. ‘నిరంతర సేవల చిత్రం’ అది. ఇంకా.. నర్సుల నిస్వార్థానికి, అంకితభావానికి ప్రతీకగా అనేక చిత్రాలు.. గీశారు, గీస్తున్నారు చైనా పౌరులు. ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఏమిచ్చినా తక్కువే అనిపిస్తున్నప్పుడు.. ‘ఆర్ట్’తో భారాన్ని దించుకోవచ్చు. అయితే ‘ఆర్ట్ ఎప్పటికీ పూర్తి కాదు. వదిలేసి వెళ్తామంతే’ అనే మాట వినే ఉంటారు. ఆ మాట అన్నది ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్చీ. ఇవాళ ఆయన జన్మదినం. యేటా ఈరోజు ‘వరల్డ్ ఆర్ట్ డే’ జరుపుకుంటున్నాం. నర్సుల త్యాగనిరతిని, క్రియాశీలత్వాన్ని స్తుతించడానికి చేతుల్లోకి మనం ఎన్ని కుంచెలు, ఎన్ని రంగులు తీసుకున్నా.. ఆ చిత్రాలు ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటాయి. తలవడమే తప్ప కొలవలేం. -
సాహితీ సౌరభం
• హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్కు ఏర్పాట్లు పూర్తి • నేటి నుంచి జాతీయ, అంతర్జాతీయ కళల ఉత్సవాలు సాక్షి, హైదరాబాద్: సాహితీ సౌరభానికి భాగ్యనగరి ముస్తాబైంది. హైదరాబాద్ సాహి త్యోత్సవానికి బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా యి. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ (హెచ్ఎల్ఎఫ్)–2017లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారు. జాతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక, సమకాలీన అంశాలపై ఈ ఉత్సవంలో సమగ్రమైన చర్చలు జరుగనున్నాయి. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక రంగాలపై సదస్సులు, వర్క్షాపులు, సాంస్కృతిక అంశాలు, ఇష్టాగోష్టులు, చిత్రప్రదర్శనలు వంటి అనేక కార్యక్రమాలతో ఏటా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది 7వ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ అతిథి దేశంగానూ, తమిళం ప్రధాన భాషగానూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరుగనున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో సమాచార కేంద్రానికి ‘కార్వీ ప్లాజా’గా నామకరణం చేశారు. మూడు వేదికల్లో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి వేదికకు ‘హేపెనింగ్ హైదరాబాద్ పెవిలియన్’గా నామకరణం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు ఈ వేదికను ఏర్పాటు చేశాయి. రెండో వేదిక ‘ఎస్బీహెచ్ ఎన్విరాన్’, మూడో వేదిక ‘గోయిథె గ్యాలరీ’ల్లో సమాంతరంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. శుక్రవారం(27న) ప్రధాన కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి. ⇔ ఉదయం 9.30కు ‘హేపెనింగ్ హైదరా బాద్ పెవిలియన్’వేదికపై ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ హిందీ కవి అశోక్ వాజ్ పేయి ముఖ్యఅతిథిగా.. ఫిలిప్పీన్స్ రాయ బారి మా తెరిసిటా సి డాజా, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొంటారు. అశోక్ వాజ్పేయి ‘లిటరేచర్ అండ్ అవర్ టైమ్స్’అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. ⇔ ఉదయం 11 గంటలకు తెలంగాణ సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘తెలంగాణ విలేజ్’ను ఆవిష్కరిస్తారు. తెలంగాణ పల్లె జీవితాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వేడుకల 3 రోజులు ఈ విలేజ్ ప్రదర్శన ఉంటుంది. ⇔ ఇదే సమయంలో గోయిథె గ్యాలరీలో దివ్య దిశ ఆధ్వర్యంలో ‘చైల్డ్హుడ్ ఇన్ మై సిటీ’ ప్రదర్శన ఉంటుంది. ది చిల్డ్రన్స్ ఫైన్ ఆర్ట్ గ్యాలరీలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. ⇔ తెలంగాణలో మరుగున పడిపోతున్న వాద్యాల ప్రదర్శన ‘తెలంగాణ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్’ 3 రోజులు కొనసాగు తుంది. వివిధ రకాల తెలంగాణ జానపద, కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ⇔ సాయంత్రం 4 నుంచి 4.50 వరకు ‘జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, బర్మాలో మానవ హక్కుల ఉల్లంఘనపై’ప్రముఖ హక్కుల ఉద్యమ నేత నందితా హక్సర్ ప్రసంగిస్తారు. కల్పనా కన్నబీరన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. ⇔ సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు మహాశ్వేతాదేవికి నివాళిగా ‘స్తనదాయిని’ కథను ‘చోళీ కే పీచే క్యాహై’పేరుతో ప్రద ర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు ‘కార్మిక్ హార్వెస్ట్’ అనే ఫిలిప్పీన్స్ కళాకారుల ప్రదర్శన ఉంటుంది. బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్ –2017 కోసం చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement