-
ఐఆర్బీ ఇన్ఫ్రా- సౌత్ బ్యాంక్.. స్పీడ్
ఇటీవల తమ ప్రాజెక్టులలో ట్రాఫిక్.. కోవిడ్కు ముందున్న స్థాయిలో 80 శాతానికి చేరినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ చైర్మన్ డీఎం వీరేంద్ర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లాక్డవున్ నిబంధనల్లో వెసులుబాటు కారణంగా ఇకపై టోల్ కలెక్షన్లు పుంజుకోనున్నట్లు అభిప్రాయపడ్డారు. మొత్తం 9 ప్రాజెక్టులలో 5 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 4 ఈ ఏడాదికల్లా పూర్తికాగలవని అంచనా వేస్తున్నారు. తద్వారా టారిఫ్లు 45 శాతం పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. కంపెనీ గతేడాది(2019-20) ఫలితాలపై వెలువరించిన వార్షిక నివేదికలో ఈ అంశాలను పొందుపరిచినట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో రానున్న కాలంలో కంపెనీ పనితీరు మెరుగుపడగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఐఆర్బీ ఇన్ఫ్రా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపు 9 శాతం జంప్చేసింది. రూ. 128ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 84 శాతం దూసుకెళ్లడం విశేషం! సౌత్ ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 82 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 5 శాతం పుంజుకుని రూ. 2172 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.98 శాతం నుంచి 4.93 శాతానికి, నికర ఎన్పీఏలు 3.34 శాతం నుంచి 3.09 శాతానికి వెనకడుగు వేశాయి. అయితే ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం పెరిగి రూ. 293 కోట్లను తాకాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 8.30 వద్ద ఫ్రీజయ్యింది. -
ఐఆర్బీ ఇన్ఫ్రా లాభం 16 శాతం అప్
న్యూఢిల్లీ: ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 16 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17)లో రూ.207 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.240 కోట్లకు పెరిగిందని ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,656 కోట్ల నుంచి 14 శాతం పతనమై రూ.1,432 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎమ్డీ వీరేంద్ర డి. మహిస్కర్ పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2016–17లో రూ.715 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.920 కోట్లకు పెరిగిందని తెలిపారు. మొత్తం ఆదాయం 2 శాతం వృద్ధితో రూ.5,863 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. క్యూ4లోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలో కూడా మంచి పనితీరు సాధించామన్నారు. -
టోల్ వసూలుపై ఆగ్రహ జ్వాల!
సాక్షి ముంబై: టోల్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొల్హాపూర్లో గతవారం ప్రారంభించిన ‘కరో యా మరో’ ఆందోళన ఆదివారం హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టోల్ వసూలును నిలిపివేసిన ఐడియల్ రోడ్ బిల్డర్(ఐఆర్బీ) కంపెనీ శనివారం రాత్రి మళ్లీ వసూళ్లను పునఃప్రారంభించడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుభికింది. ఫులేవాడి, శిరోలీ టోల్నాకాలపై వందలమంది ఆందోళనకారులు దాడికి దిగారు. రెండు క్యాబిన్లకు నిప్పుపెట్టడంతోపాటు అందులోని కంప్యూటర్లను, సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ‘కరో యా మరో’ ఆందోళన ఆరు రోజులుగా శాంతియుతంగానే కొనసాగుతున్నా ఐఆర్బీ వైఖరితోనే ఆందోళనకారులు ఆగ్రహానికి గురయ్యారని సామాజిక కార్యకర్త ఎన్డీ పాటిల్ తెలిపారు. శనివారం ఆందోళనలో ఆయన కూడా పాల్గొన్నారు. పైకి టోల్ వసూలు చేయవద్దని చెబుతూనే లోలోపల వసూలు చేసుకోవాల్సిందిగా కంపెనీని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన ఆరోపించారు. కార్మికశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్, హోంశాఖ సహాయమంత్రి సతేజ్ పాటిల్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు మంత్రులు టోల్ వసూలును నిలిపివేయాలని ఐఆర్బీని ఆదేశించారు. టోల్ డబ్బును కార్పొరేషన్ చెల్లిస్తుందని కూడా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి సదరు కంపెనీ టోల్ వసూలును నిలిపివేసింది. దీంతో కొల్హాపూర్ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అయితే అదే రోజు రాత్రి నుంచి కంపెనీ టోల్ వసూలు చేయడం పున:ప్రారంభించింది. ఈ విషయం తెలియగానే ఆదివారం ఉదయం ఫులేవాడి, శిరోలి టోల్నాకాలపై ఆందోళనకారులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులు టోల్ నాకాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అక్కడున్న సీసీవీటీ కెమెరాలు, భద్రతా యంత్రాలు, క్యాబిన్లు, ఇతర వస్తువులన్నంటినీ ధ్వంసం చేసి తీవ్ర నిరసన తెలిపారు. శిరోలిటోల్ నాకాను ధ్వంసం చేసిన తర్వాత నిప్పంటించారు. మంటల్లో అక్కడున్న భారీ జనరేటర్ దగ్ధమైంది. ఈ ఘటనతో ఐఆర్బీకి తీవ్ర నష్టం వాటిల్లింది. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కానీ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆందోళనకారులను నియంత్రించలేకపోయారు. పోలీసులు వారిస్తున్నా ఆందోళనకారులు ధ్వంసకాండను ఆపలేదు. లాఠీచార్జీకి దిగితే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. బంద్కు పిలుపునిచ్చిన శివసేన.. రాష్ట్ర ప్రభుత్వం టోల్ నాకాను మూసి వేసే విషయంపై కొల్హాపూర్ వాసులను మోసం చేసిందని స్థానిక శివసేన నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా టోల్ నాకాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులకు శివసైనికులు మద్దతు తెలిపారు. ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తూ సోమవారం కొల్హాపూర్ బంద్కు పిలుపునిచ్చారు. రూ.220 కోట్లు ఖర్చుచేసిన ఐఆర్బీ కొల్హాపూర్ మీదుగా ఐడియల్ రోడ్ బిల్డర్ కంపెనీ 52 కిలోమీటర్ల రోడ్డు నిర్మించింది. ఇందు కోసం రూ.220 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చును 30 సంవత్సరాలు టోల్ వసూలు చేయడం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement