-
ఈ పదేళ్ల పాపపై ప్రపంచ దృష్టి
పుణె: పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిపై తల్లిదండ్రుల ప్రభావమే అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏం కలలు కంటుంటారో, ఏది మంచి ఏది చెడు అని చెప్తుంటారో సహజంగా అదే వారి మనసులో నాటుకుపోయి ఆ ప్రభావం వారిపై చెరిపేయలేని స్థాయిలో ఉండిపోతుంది. అది ఎంతమేరకు ప్రభావం ఉంటుందో, అలాంటి ప్రభావం వారిపై ఏ విధమైన ఒత్తిడి కలగజేస్తుందో.. అసలు వారికి ఏం కావాలో అనే విషయాన్ని పుణెకు చెందిన ఇషితా కాత్యాల్ అనే బాలిక అనర్గలంగా చెప్పింది. సాధారణంగా పెద్దపెద్దవాళ్లే వేదికపైకి ఎక్కి మాట్లాడేందుకు తటపటాయించే ఈ రోజుల్లో ఈ గడుగ్గాయి అతిరథమహారథులు పంచుకున్న వేదికపైకి ఎక్కి వారికి గుక్క తిప్పుకోలేని ప్రశ్నలు వేసింది. పిల్లల తరుపున తనొక్కతే ఒకల్తా పుచ్చుకొని వారి భావాలను బయటపెట్టింది. పుణెలో చదువుతున్న ఇషితా కాత్యాల్ అనే పదేళ్ల బాలిక ఈ ఏడాది కెనడాలో నిర్వహించిన టెక్నాలజీ, ఎంటర్ టైన్మెంట్, డిజైన్ (టీఈడీ) కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగాన్ని చేసింది. ఆమె అలా చేస్తున్నప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ మేథావులు, వ్యాపార వేత్తలు, గొప్పగొప్ప తత్వవేత్తలు ఉన్నారు. వీరంతా ఇషితా ప్రసంగం చేస్తున్న సమయంలో కిక్కురుమనకుండా కూర్చుండిపోయారు. ఆమె ప్రశ్నలు అడిగే తీరు సమాధానాలు చెబుతున్న తీరు మేథావులను కూడా ఆలోచనలో పడేసింది. 'పిల్లలు పెరిగే క్రమంలో అసలు వారు ఏంకావాలని కోరుకుంటారో మీకు తెలుసా.. మీరు కచ్చితంగా వారిని అలా అడగాలి కానీ ఎప్పుడైనా అడిగారా' అంటూ ఇషితా నిలదీసింది. 'మా కలలు తీసి పారేయకండి. మేం ఈ సమయంలో చాలా చేయగలం. మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే చాలా శక్తులు పిల్లల కలలకు వ్యతిరేకంగానే పనిచేస్తూనే ఉన్నాయి. మాకంటూ ఓ ప్రత్యేక భవిష్యత్ ఉంది. నా కల ఏమిటంటే.. పాఠశాల స్కూల్ ఫీజులు పెంచేముందు పదిసార్లు ఆలోచించాలి. మరో దేశంపైకి యుద్ధానికి పోయేముందు వందసార్లు ఆలోచించాలి. నీరు, ఆహారం వృధా చేసేముందు వెయ్యిసార్లు ఆలోచించాలి. అలాగే, తమ చిన్నారులు, వారి బాల్య జీవితం సాగుతున్న క్రమంలో వారి తల్లిదండ్రులు పదివేలసార్లు ఆలోచించాలి. ఇలా చేస్తే బాగుంటుందనేది నా కల' అని చెప్పింది. -
పిట్ట కొంచెం.. ఘనత ఘనం..
పిట్టకొంచెం కూత ఘనం అన్న మాటను నిజం చేస్తోందా చిన్నారి. కేవలం పదేళ్ళ వయసులోనే రచయిత, వక్త, రస్కిన్ బాండ్, నర్తకి, గాయకురాలుగా పలు కళల్లో ఆరితేరిపోయి.. తన ప్రత్యేకతను చాటుతోంది. ఖాళీ సమయాల్లో బాస్కెట్ బాల్ ఆడటం, మంచి పుస్తకాలను చదవడం ఆమె హాబీలు.. ఇప్పటికే సకల కళా వల్లభురాలుగా గుర్తింపు పొందిన ఆమె... ప్రస్తుతం న్యూయార్క్ లోని 'టెడ్ ఎక్స్' కాన్ఫరెన్స్ లో మాట్లాడి.. అతి చిన్న వయసులో తన కీర్తి కిరీటానికి మరో ప్రత్యేకతను జోడించింది. పూనె బలెవాడి విబ్ గ్యోర్ హై విద్యార్థి.. పదేళ్ళ ఇషితా కత్యాల్ భారత్ కు చెందిన అతి చిన్న వ్యాఖ్యాతగా పేరొందింది. టెడెక్స్ సమావేశంలోని చర్యలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సమావేశంలో అదే వయసుకు చెందిన వారిని తరచుగా అడిగే ప్రశ్నల్లో భాగంగా 'మీరు ఏమి అవుదామనుకుంటున్నారు?' (what do you want to be now?) అన్న ప్రశ్నకు విభిన్నంగా స్పందించి, అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది. నాలుగు నిమిషాల నిడివిలో ఆమె మాట్లాడిన ప్రతి మాటా వ్యవస్థకు సవాలుగా మారింది. 2013 లో టెడెక్స్ పూనెలో నిర్వహించిన తొలి సమావేశానికి హాజరవ్వడంతో ఈ యువ స్పీకర్ ఇషిత ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో ఆ కార్యక్రమం అమెను ఎంతో ఆకట్టుకోవడంతో వెంటనే నిర్వాహకులను కలిసి ఆ జట్టులో సభ్యత్వం నమోదు చేసుకుంది. తన అభిరుచితో ప్రత్యేకంగా టెడెక్స్ యూత్@బలెవాడి కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరినో ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ళ వయసులో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన అతి చిన్న వయస్కురాలుగా అప్పట్లోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. వయసుతో సంబంధం లేకుండా పిల్లలు వారి కలలను సాకారం చేసుకోవచ్చు అనేందుకు ఎంతోమంది చిన్నారుల్లో ఇషిత తాజా చర్చ ప్రేరణ కల్పించింది. అతి చిన్న వయసు నుంచే అసాధారణ ప్రతిభను చూపుతూ ఇషిత ప్రత్యేకతను సాధించుకుంటోంది. ఓ రచయితగా ఉండాలని కోరుకున్న ఆమె... ఎనిమిది సంవత్సరాల వయసులోనే 'సిమ్రాన్ డైరీ' పుస్తకాన్ని రాసి ఆకట్టుకుంది. వేసవి సెలవులను వినియోగించుకొని పిల్లల మనసులో ప్రవేశించే విషయాలను వారు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి అన్న విషయంపై రాసిన ఆమె పుస్తకం... మొదట్లో ఆమెజాన్ క్లిండ్ స్టోర్ లోనూ, అనంతరం పార్ట్ రిడ్జ్ పబ్లిషర్స్ లో ప్రచురితమైంది. ''స్కూలు హోంవర్స్ లు, టెడెక్స్ కార్యక్రమాలు, రచనలు ఇలా ప్రతిది నిర్వహించడం మొదట్లో నాకు కాస్త కష్టంగా అనిపించేది. అప్పట్లో నేను ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేదాన్ని. కొన్నిసార్లు హోంవర్క్ చేయడానికి సమయం మిగిలేది కాదు. అప్పట్లో మా నాన్నగారు అన్ని పనులూ పూర్తవ్వాలంటే ఉదయం మేల్కొనే సమయాన్ని మార్చమని సూచించారు. ఆ తర్వాత ఐదు గంటలకే లేవడం ప్రారంభించాను. లేచిన వెంటనే ఆరోజు చేయాల్సిన పనులను చెక్ లిస్ట్ చేసుకొని చేయడం ప్రారంభించాను'' అంటూ తన కార్యసాధనకు వెనుక కష్టాన్ని, పట్టుదలను వివరిస్తోంది ఇషిత. అయితే ఇషిత తాజా న్యూయార్క్ స్పీచ్ ఇంకా విడుదల కాలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
ఇంకా తగ్గని లేఆప్స్ బెడద.. నాలుగు నెలల్లో 80 వేలమంది
లోకేష్ ఎంట్రీతోనే హత్యా రాజకీయాలు: నందమూరి లక్ష్మీపార్వతి
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
ఓటీటీలో హీరామండి.. స్టార్ డైరెక్టర్ మేనకోడలిపై విమర్శలు!
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి
జల్సా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి? గుర్తుపట్టడం కష్టమే(ఫోటోలు)
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement