-
శుద్ధజలం.. అబద్ధం
జిల్లాలో అనధికారికంగా వాటర్ ప్లాంట్లు వెలిశాయని, ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా నీటిని అమ్ముతున్నారని, ఈ నీరు తాగడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదముందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) అధికారులు 2016లో అప్పటి కలెక్టర్ కోన శశిధర్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్, సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఉన్న మూడు వేల వాటర్ప్లాంట్లలో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ అనుమతి ఉందని అధికారులు తేల్చారు. గుంటూరులో కలుషిత నీరు తాగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. మినరల్ వాటర్ పేరుతో వేలాది వాటర్ ప్లాంట్ నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బీఐఎస్ అనుమతుల ప్రకారం ప్రతి ప్లాంటులో అధునాత ప్రయోగశాల ఉండాలి. శుద్ధి చేసిన నీటిలోని పీహెచ్, టీడీఎస్ ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించాలి. కానీ ఇటువంటి ప్రమాణాలేవీ పాటించకుండానే వాటర్ ప్లాంట్లు అక్రమంగా నడుపుతున్నట్లు ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. అనంతపురం న్యూసిటీ: జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ పేరుతో అక్రమ దందా చేస్తున్నారు. వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలో నీటి సరఫరా అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం...ఇదే అదునుగా వాటర్ప్లాంట్ నిర్వాహకులు మినరల్ వాటర్ పేరిట గరలాన్ని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గుర్తింపు లేకుండా జిల్లాలో మూడు వేలకు పైగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 ప్లాంట్లకు మాత్రమే ఐఎస్ఐ గుర్తింపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ 10 నుంచి 15 లక్షల మంది మినరల్ నీటిని తాగుతూ అనారోగ్యం తెచ్చుకునే పరిస్థితి నెలకొనింది. తాగునీటి నాణ్యతను పరిశీలించాల్సిన రెవెన్యూ, పుడ్కంట్రోల్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ప్రమాణాలేవీ? వాస్తవంగా బీఐఎస్ 60 రకాల నాణ్యత ప్రమాణాల పాటించాలని దిశానిర్ధేశం చేస్తోంది. కానీ నీటి శుద్ధి ప్లాంట్లు ప్రమాణాలను గాలికొదిలేసి అందులో పట్టుమని బేసిక్ ప్రమాణాలు కూడా పాటించడం లేదు. బీఐఎస్ మార్గదర్శకాల ప్రకారం ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మొతాదు లీటరు నీటికి 100–150 మి.గ్రా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధన పాటించడం లేదు. లీటరు నీటిలో క్యాల్షియం 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు ఉండాలి. అయితే ఇక్కడి ప్లాంట్లలో వివిధ రసాయనాలు కలిపి ఇచ్చేస్తున్నారు. ఫ్లోరైడ్ మోతాదు ఒక మిల్లి గ్రామ్ మించకూడదు. ఐరన్మోతాదు 0.3 మి.గ్రా ఉండాలి. నిద్రమత్తులో అధికారులు వాటర్ ప్లాంట్ల నిర్వాహకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, పుడ్ సేఫ్టీ అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అనధికారికంగా ప్లాంట్ నిర్వాహకులు యథేచ్ఛగా నీటి వ్యాపారం చేస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక ఆహార కల్తీ నిరోధకశాఖలో ఐదుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లకు గాను ఒకరు మాత్రమే ఉన్నారు. ఆయన కూడా నెల క్రితం ట్రైనింగ్కు వెళ్లారు. ఇక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పూర్తిస్థాయిలో రెవెన్యూ అధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రూ. కోట్లలో వ్యాపారం తాగునీటి వ్యాపారం రూ.కోట్లలో జరుగుతోంది. జిల్లాలో దాదాపుగా 43 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో సగం మంది మినరల్ వాటర్కు అలవాటు పడ్డారు. బిందె రూ 6 నుంచి 10, క్యాన్ రూ 20తో వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఇలా రోజూ రూ కోటికిపైగా జలవ్యాపారం జరుగుతోంది. అనంతపురం నగరపాలక సంస్థ, మిగితా 11 మునిసిపాలిటీల్లో నీరు పూర్తీ స్థాయిలో సరఫరా చేయడం లేదు. కేటాయించిన ఎంఎల్డీ కంటే తక్కువే పదుల సంఖ్యలో మునిసిపాలిటీలకు నీరు సరఫరా అవుతోంది. అసలే వేసవికాలం కావడంతో నీరు సరిగా వస్తుందో లేదోనని ముందస్తుగా ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, గుత్తి, పామిడి, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర, రాయదుర్గం, కదిరి తదితర ప్రాంతాల్లోని లక్షలాది మంది మినరల్ గరళాన్ని తాగుతున్నారు. ఇన్స్పెక్టర్ల కొరత ఉంది అనధికారికంగా వాటర్ ప్లాంట్ నిర్వహించే వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లే కేసులు పెట్టాలి. ప్రస్తుతం ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. అయినా నగరంలోని చాలా ప్లాంట్లపై కేసులు నమోదు చేసి, ఫైన్లు వేశాం. -నాగేశ్వరరావు, పుడ్,సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ రోగాలు వస్తున్నాయి గతంలో మున్సిపల్ అధికారులు సీజ్ చేసిన వాటర్ప్లాంట్లను సైతం ఇప్పుడు నడుపుతున్నారు. వాళ్లు సరఫరా చేసే మినరల్వాటర్ ఉప్పునీళ్ల మాదిరి ఉంటున్నాయి. అవి తాగినవారు గొంతు సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. -బాబ్జాన్, విద్యార్థి, కదిరి దుష్పరిణామాలు తప్పవు ప్రమాణాలు లేని నీటిని తీసుకోవడం ద్వారా దుష్పరిణామాలు తప్పదు. నీటిలో రుచి కోసం రసాయనాలు కలపడం ద్వారా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కండరాలు, కీళ్ల నొప్పులు, యముకల్లో పటుత్వం కోల్పోయే అవకాశం ఉంది. బీఐఎస్, ఐఎస్ఓ సర్టిఫైడ్ చేసిన నీటిని తీసుకోవాలి. -డాక్టర్ కృష్ణకాంత్రెడ్డి, న్యూరాలజిస్టు, సర్వజనాస్పత్రి శుద్ధి జలాన్ని అందిస్తున్నాం బీఐఎస్ ప్రమాణాలతో ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి జలాన్ని అందిస్తున్నాం. కెమెస్ట్రీ, మైక్రోబయాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి ప్రజలకు నీరందిస్తున్నాం. జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. గతంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అధికారులు తనిఖీ చేసి అనధికార ప్లాంట్లను గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్వాహకులపై ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రజలు నీటిని కొనేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి. -పురుషోత్తంరెడ్డి, లెజెండ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు విధిలేక కొంటున్నాం మినరల్ వాటర్ పేరుతో ఆటోల్లో, వాటర్ ప్లాంట్లలో ఒక్కో క్యాన్కు రూ.10 నుండి రూ.20 వరకు విక్రయిస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం బాగుండటం లేదు. గత్యంతరం లేక ఆ నీటిని తాగుతున్నాం. అధికారులు స్పందించి నాణ్యమైన నీటిని అందించేలా ప్రతి వాటర్ ప్లాంటూ ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి. -మహేష్, ధర్మవరం -
మాయాజలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రజల పాలిట శాపంగా మారాయి. వినియోగదారులను రోగాల బారిన పడేస్తున్నాయి. అధికారుల నియంత్రణ కరువవడం.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తున్నారు. భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ) నిబంధనలు విస్మరించిన నిర్వాహకులు.. అధికారులతో కుమ్మక్కై వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం ఇలా కాలాలతో సంబంధం లేకుండా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్తోపాటు జిల్లాలో మంచినీళ్ల వ్యాపారం సాగుతోంది. 200 వరకు ప్లాంట్లు ఉన్నా కేవలం ఏడింటికే బీఎస్ఐ అనుమతి ఉంది. ఈ ప్లాంట్లలో మాత్రమే ఐఎస్ఐ ప్రమాణాలు పాటిస్తుండగా, నిబంధనలు విస్మరించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాలు ఇవే.. మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహించాలంటే ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. బీఎస్ఐ అనుమతి తీసుకోవాలి. వాటర్ ప్లాంట్లో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు ఉండాలి. వీరు శుద్ధి చేసిన ప్రతి బ్యాచ్కు చెందిన నీటిలోని పీహెచ్ను పరీక్షిస్తూ ఉండాలి. పీహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సమస్యలు వస్తాయని బీఎస్ఐ, వైద్యులు పేర్కొంటున్నారు. * నీటిలో పూర్తిగా కరిగి ఉండే లవణాలు(టీడీఎస్) కూడా పరీక్షించాలి. * కొత్తగా ఒక వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే కనీసం పది గదులు ఉండేలా చూడాలి. ఇందులోనే నీటి పరీక్ష చేసే ల్యాబ్, పరికరాల కోసం రెండు గదులు కేటాయించాలి. * ఫిల్లింగ్ సెక్షన్, ఆర్వో పద్ధతిలో 3 వేల లీటర్ల కెపాసిటీ డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసేందుకు 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన డ్రమ్ములు వాడాలి. శుద్ధి చేసిన నీటిని ఓజోనైజేషన్ చేయాలి. *మినరల్ వాటర్ను క్యానులోకి పట్టే ముందు అల్ట్రావైరస్ రేస్తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్లోకి పట్టిన తర్వాత రెండు రోజులపాటు భద్రపరిచి, మార్కెట్లోకి పంపాలని బీఎస్ఐ నిబంధనలు సూచిస్తున్నాయి. * నీటిని సరఫరా చేసే క్యానులకు ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్ లేదా హైపోసొల్యూషన్తో కెమికల్ క్లీనింగ్ చేయాలి. సీలుపై నీటిని శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ ను వేయాలి. * నీటిని క్యానులలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి. * శానిటరీ అధికారులు ప్రతినెలా నీటిని తనిఖీ చేసి నివేదికను ఐఎస్ఐకి పంపాలి. {పతి ఏడాది ఐఎస్ఐ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాలి. భూగర్భ జలాలే శ్రేయస్కరం జిల్లాలో నిర్వహిస్తున్న ప్లాంట్లలో చాలామంది ప్రమాణాలు పాటించడం లేదు. అధికారులను మచ్చిక చేసుకుని చిన్నచిన్న గదుల్లో ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. నీటిని నిల్వ చేసే క్యాన్లను శుభ్రం చేయకుండానే సరఫరా చేస్తున్నారు. అనుమతి ఉన్న ఏడింటిలో మినహాయిస్తే మిగతా ప్లాంట్లలో మైక్రోబయాలజిస్టు, కెమిస్టులు అందుబాటులో ఉండటం లేదు. పీహెచ్, టీడీఎస్ పరీక్షలు జరగడం లేదు. శానిటరీ అధికారులు మామూళ్లకు రుచిమరిగి తనిఖీలు చేయడం లేదు. కొన్ని సంస్థలకు ఐఎస్ఐ సర్టిఫికెట్లు ఉన్నా ఏటా రెన్యూవల్ చేయించుకోవడం లేదు. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు కచ్చితంగా భూగర్భజలాలు ఉపయోగించాలి. అయితే కొందరు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా వుండగా ఒక లీటరు శుద్ధ జలం తయారీకి మూడు లీటర్ల నీరు వృథా అవుతోంది. ఈ క్రమంలో భూగర్భజలాలు విరివిగా తీయడం వల్ల ప్లాంట్లు ఉన్న ప్రాంతంలో భూగర్భ నీటినిల్వలు పడిపోతున్నాయి. ఈ విషయాన్ని చుట్టూ పక్కల ఉండే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాంట్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఏటా రూ.3 కోట్లపైనే పన్ను ఎగవేత బీఎస్ఐ అనుమతి లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు జిల్లాలో ఏటా రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వానికి పన్ను ఎగవేస్తున్నారు. మినరల్ వాటర్పై కూడా 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండగా, సేవ ముసుగులో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు పన్నులు చెల్లించడం లేదు. బీఎస్ఐ అనుమతి ఉంటే ప్లాంటు నిర్వాహకుడు ఏటా రూ.90,260 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. రూ.32,205 వాటర్ టెస్టింగ్ కోసం చెల్లించాలి. మరో రూ.27,500 వరకు ఇతర ఖర్చులు అవుతాయి. అయితే జిల్లాలో ప్రస్తుతం ఏడు ప్లాంట్లు మినహాయిస్తే ఎక్కడా ఈ పద్ధతి పాటించడం లేదు. ఏటా ప్రభుత్వానికి, ప్రజలకు పెద్దమొత్తంలో నష్టం జరుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్టయిన లేదు. ఇదిలా వుండగా నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని వాటర్ ప్లాంట్ల యజమానులు పోటాపోటీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 20 లీటర్ల నీటికి రూ.15 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.1 నుంచి రూ.2 ఖర్చవుతుంది. ట్రాన్స్పోర్టు చార్జీలు మినహా ఎలాంటి పన్నులు, ఖర్చులు లేకున్నా అధిక ధరలు వసూలు చేయడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటుండటంపై విమర్శలు వస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement