-
‘మూన్ లైటింగ్’ జాక్పాట్.. ఏడాదికి రూ.2 కోట్లు సంపాదించిన ఐటీ ఉద్యోగి!
మూన్ లైటింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే సమయంలో ఒకటికి మూడు ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదించిన ఉద్యోగి భాగోతం వెలుగులోకి వచ్చింది. 2021 నుంచి మూన్లైటింగ్కు పాల్పడ్డ ఉద్యోగి ఏడాదికి రూ.2.5 కోట్లు సంపాదించాడు. పైగా మూడో ఉద్యోగం సైతం చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? మూడు ఉద్యోగాలు ఎలా చేశాడు? మూన్లైటింగ్! టెక్నాలజీ రంగానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాయి. దీన్ని ఆసరగా చేసుకున్న ఉద్యోగులు పగలు ఒక సంస్థలో రాత్రి మరో సంస్థలో పనిచేస్తూ రెండు చేతులా సంపాదించారు. దీంతో ప్రొడక్టివిటీ తగ్గడం, ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లు లావాదేవీలు భారీ స్థాయిలో జరగడంతో కంపెనీలు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించాయి. భారీ ఎత్తున లేఆఫ్స్ ప్రకటించాయి. నాటి నుంచి నియమాకాల విషయంలో హెచ్ ఆర్ విభాగం నిపుణులు కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఉద్యోగి నికోలస్ ఫ్లెమ్మింగ్ తాను మూన్లైటింగ్కు పాల్పడ్డట్లు బిజినెస్ ఇన్సైడర్తో తన అనుభవాల్ని పంచుకున్నాడు. 2021 నుండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న నికోలస్.. ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేసేవాడు. అది సరిపోదన్నట్లు మూడు ఉద్యోగంలో చేరాడు. కానీ మూడింటిని చేయడం కష్టమని భావించి అందులో ఒక జాబ్ను వదిలేశాడు. వారానికి 40 గంటలు పనిచేసిన నికోలస్ ఒక కంపెనీలో ఆఫీస్ వర్క్ చేస్తుంటే.. మరో వర్క్లో కేవలం జూమ్ మీటింగ్స్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల రెండు ఉద్యోగాల్ని మేనేజ్ చేయడం పెద్దగా కష్టంగా అనిపించలేదు. అయితే తాను మూన్ లైటింగ్ చేసేందుకు చేసేందుకు తన మాజీ బాస్ ప్రోత్సహించడాని, అతని ద్వారానే మరో సంస్థలో ఉద్యోగం సంపాదించుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. అదే సమయంతో తాను మూన్లైటింగ్కు పాల్పడ్డుతునట్లు తన రెండో బాస్ గుర్తించాడు. కానీ నేను సంస్థకు కావాల్సినట్లుగా పనిచేసినంత కాలం ఆ విషయం (మూన్లైటింగ్) గురించి పెద్దగా మాట్లాడడు. డెడ్లైన్లోపే పని పూర్తి చేస్తున్నా. నా వల్ల సంస్థకు లాభం.. నాకూ లాభం. అందులో తప్పేం లేదు కదా. పైగా మూన్ లైటింగ్ వల్ల వృత్తి నైపుణ్యాలలో కొత్త కొత్త మెళుకువలు నేర్చుకోవచ్చు. దాన్ని నేను తప్పపట్టను. ఇక్కడ గమించాల్సిన మరో విషయం ఏంటంటే? రెండు మూడేసి ఉద్యోగాలు చేస్తున్నా మనజీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. పని చేస్తాం. ఖర్చు చేస్తాం. డబ్బులు పెరిగే కొద్ది ఖర్చులు సైతం అదే స్థాయిలో పెడుతుంటాం. అలాంటప్పుడు దాని వల్ల లాభం ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని నికోలస్ తెలిపాడు. -
వర్క్ ఫ్రం హోమే బెటర్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటి నుంచే కార్యాలయ పని చక్కపెట్టేస్తాం అంటున్నారు భారతీయ మహిళలు. ఐటీ రంగానికి చెందిన మహిళల్లో 38 శాతం మంది ఇంటినుంచి పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారని ఓ సర్వేలో తేలింది. గత ఏడాది నవంబర్– డిసెంబర్ కాలంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ, ఐటీ సంస్థల్లో పనిచేసే పురుషులు, మహిళల అభిప్రాయాలు సేకరించి సర్వే చేసింది. ఆఫీస్ కంటే ఇంటి నుంచి పనిచేయడం వల్లే ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉన్నట్లు భావిస్తామని 36 శాతం మహిళలు తెలిపారు. ఇంటి నుంచి పని చేయడం వల్ల రోజువారీ ఇంటి పని విషయాలు వారు పేర్కొన్నారు. ఆఫీస్ పనిచేస్తూనే ఇంటి పనీ పూర్తి చేసుకుంటు న్నామని 33 శాతం పురుషులు, 54 శాతం మహిళలు తెలిపారు. 40 శాతం మంది పురుషులతో పోలిస్తే 54 శాతం మంది మహిళలకు పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుటుంబాన్ని చూసుకోవాల్సి రావడంతో మహిళలు పని వేళలు మార్చుకుంటున్నారు. కరోనా ప్రభావంతో వృత్తిజీవితంలో పురోగతి తగ్గిందని 76 శాతం భారతీయ మహిళలు భావిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో 19 దేశాలకు చెందిన 13 వేల మంది పాల్గొనగా 500 మంది భారతీయులు ఉన్నారు. చదవండి: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్ -
బ్రాంచ్ ఎంపికలో.. అభిరుచి
ఇంజనీరింగ్ స్పెషల్ జాతీయ స్థాయిలో ఐఐటీలు, నిట్లతోపాటు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు భారీ కసరత్తు జరుగుతోంది. జేఈఈ మెయిన్ ఫలితాలు ఇప్పటికే వెలువడగా, తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలో మే 15న ఎంసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రుల దృష్టంతా ఇంజనీరింగ్లో బ్రాంచ్ సెలక్షన్ గురించే! ఈ నేపథ్యంలో బ్రాంచ్ ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలు.. 1. తొలి ప్రాధాన్యం.. ఆసక్తి సివిల్ ఇంజనీరింగ్ నుంచి సిరామిక్ టెక్నాలజీ వరకు.. ఐటీ కొలువుకు దారిచూపే కంప్యూటర్ సైన్స్.. కోర్ బ్రాంచ్లు, అప్కమింగ్ బ్రాంచ్లు.. ఇలా పదుల సంఖ్యలో బ్రాంచ్లు! బ్రాంచ్లు ఎన్ని ఉన్నా.. విద్యార్థులు మాత్రం తమ వ్యక్తిగత అభిరుచికి తగ్గ బ్రాంచ్నే ఎంచుకోవాలన్నది నిపుణుల సూచన. తాము అప్పటివరకు అకడమిక్గా మంచి ఆసక్తి కనబర్చిన సబ్జెక్ట్లను ఇందుకు ఉపకరణాలుగా మలచుకోవాలి. ఎందుకంటే.. సబ్జెక్టుపై ఆసక్తి ఉంటేనే అకడమిక్గా రాణించడం సాధ్యమవుతుంది. మ్యాథమెటిక్స్లో అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ప్రోగ్రామింగ్లో ప్రతిభ కనబర్చగలరు. ఇలాంటి విద్యార్థులు సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ వంటి బ్రాంచ్లను ఎంపిక చేసుకోవచ్చు. డ్రాయింగ్, డిజైనింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వంటి బ్రాంచ్లు సరిపోతాయి. 2. ‘భవిష్యత్తు’ బేరీజు బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు భవిష్యత్తులో లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. కొన్ని బ్రాంచ్లకు మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మరికొన్ని బ్రాంచ్లు మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు సీఎస్ఈ ద్వారా అవకాశాలు లభించే సాఫ్ట్వేర్ రంగాన్ని పరిగణిస్తే ఈ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంది. భవిష్యత్తు అంచనాలు తెలుసుకునేందుకు అసోచామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేల నివేదికలను పరిశీలించొచ్చు. 3. ఉన్నత విద్య బ్రాంచ్ను ఎంపిక చేసుకునే ముందు.. ఆయా బ్రాంచ్ ద్వారా లభించే ఉన్నత విద్య.. వాటిని పూర్తి చేశాక లభించే కెరీర్ అవకాశాలపైనా దృష్టిపెట్టాలి. ఉదాహరణకు ఈఈఈ బ్రాంచ్ను పరిగణిస్తే బీటెక్ ఈఈఈతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో నాలెడ్జ్ లభిస్తుంది. కాని ఈఈఈకి సంబంధించి జాబ్ మార్కెట్ పరంగా అందుబాటులో ఉన్న ప్రత్యేక విభాగాల్లో జాబ్స్ కోసం ఎంటెక్ స్థాయిలో నైపుణ్యాలు పొందాలి. ఉదా: మైక్రో చిప్స్, మెమొరీ చిప్స్ తయారు చేసే పలు ఎలక్ట్రానిక్ సంస్థల్లో ఉన్నత కొలువులు పొందాలంటే నానో టెక్నాలజీ స్పెషలైజేషన్తో ఎంటెక్ పూర్తిచేయాలి. 4. ఆటిట్యూడ్ కూడా ముఖ్యమే బ్రాంచ్ ఎంపికలో ఆసక్తితోపాటు విద్యార్థి వ్యక్తిగత దృక్పథం కూడా కీలకం. బ్రాంచ్ ద్వారా ఉత్తీర్ణత లభించే ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుంటే.. కొన్ని రంగాల్లో (ఉదాహరణకు.. సివిల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ తదితర) ఓర్పు, సహనం, శ్రమించే తత్వం, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యం ఉంటుంది. మరికొన్ని రంగాల్లో (సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఐటీ సంస్థల్లో) రాణించాలంటే.. బృంద నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్తోనే సాధ్యం. విద్యార్థులు ఆయా బ్రాంచ్ల ద్వారా లభించే ఉద్యోగాల నేచర్ ఆఫ్ ది జాబ్, అందుకు తగ్గ దృక్పథం తనకు ఉందా లేదా అనేది కూడా పరిశీలించుకోవాలి. బ్రాంచ్ ఎంపికలో పరిగణించాల్సిన మరో అంశం.. నిరంతరం నేర్చుకునే తత్వం! కారణం.. నిత్యం కొత్త మార్పులు జరిగే సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో రాణించేందుకు అప్డేట్ అవడం చాలా అవసరం. 5. అనుబంధ బ్రాంచ్లపైనా విద్యార్థులు తమకు నచ్చిన బ్రాంచ్లో సీటు లభించే అవకాశాలు తక్కువగా ఉంటే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఒక బ్రాంచ్కు అనుబంధంగా ఎన్నో కొత్త బ్రాంచ్లు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు సీఎస్ఈకి అనుబంధంగా ఐటీ; ఈసీఈకి అనుబంధంగా ఈటీఎం (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికం మేనేజ్మెంట్); మెకానికల్కు అనుబంధంగా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటివి. బ్రాంచ్ ముఖ్యమా.. కాలేజ్ ప్రధానమా బ్రాంచ్ విషయంలో స్పష్టత లభించాక ఆ బ్రాంచ్కు సంబంధించి అకడమిక్గా పేరున్న కళాశాలలను అన్వేషించడం అవసరం. ఆ కాలేజ్లకు ఉన్న అకడెమిక్ రికార్డ్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, లైబ్రరీ తదితరాల ఆధారంగా కాలేజీల జాబితా రూపొందించుకోవాలి. ఆయా కళాశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించాలి. ఆ క్రమంలో కొన్నిసార్లు బ్రాంచ్కు ప్రాధాన్యమివ్వాలా? లేదా కాలేజ్ /ఇన్స్టిట్యూట్కు ప్రాధాన్యమివ్వాలా? అనే ప్రశ్న ఎదురవుతుంది. నూటికి 75 శాతం బ్రాంచ్కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సలహా. క్రేజ్ కంటే... ఇష్టానికి ప్రాధాన్యం ప్రస్తుతం విద్యార్థుల్లో అధిక శాతం మంది జాబ్ మార్కెట్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని బ్రాంచ్లు ఎంపిక చేసుకుంటున్నారు. కానీ ఇది కొంతమేరకే ఫలితం ఇస్తుంది. కాబట్టి క్రేజ్ కంటే వ్యక్తిగత ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఆసక్తి ఉంటే బ్రాంచ్ ఏదైనా భవిష్యత్తు అవకాశాలు పుష్కలం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి గల బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్కు మారాల్సి వస్తే విద్యార్థులు తమ మైండ్ సెట్ను కూడా అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. - ప్రొఫెసర్ బి.చెన్నకేశవ రావు, ప్రిన్సిపాల్, సీబీఐటీ ప్లేస్మెంట్సే ప్రధానం కాదు విద్యార్థులు బ్రాంచ్ ఎంపికలో భవిష్యత్తు ప్లేస్మెంట్స్నే ప్రధానంగా భావించకూడదు. ముందుగా నచ్చిన బ్రాంచ్ను ఎంపిక చేసుకుని దాని ద్వారా లభించే అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునే మార్గాల గురించి అన్వేషణ సాగించాలి. ప్లేస్మెంట్స్ కోణంలోనే బ్రాంచ్లను ఎంపిక చేసుకుంటే ఇబ్బందికి గురవుతారు. నచ్చిన బ్రాంచ్లో సీటు రాకపోతే అనుబంధ బ్రాంచ్లపై ముందు నుంచే దృష్టిపెట్టి వాటిల్లో చేరేందుకు కృషి చేయాలి. - ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్, నిట్-వరంగల్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement