-
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులతో టెక్నాలజీ కంపెనీలకు మానవ వనరుల కొరత తీరనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. -
10న విశాఖలో ఏఐ, క్లౌడ్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కీలక వేదికగా నిలిచిన విశాఖ మరో ముఖ్యమైన సదస్సుకు ముస్తాబవుతోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్కు సంబంధించిన విప్లవాత్మక మార్పులపై ఫిబ్రవరి 10న ఏఐ క్లౌడ్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీప్టెక్ సమ్మిట్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సదస్సు జరుగనుంది. పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, ఐటీ నిపుణులు, ప్రొఫెసర్లు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ టెండర్ నిపుణులు పాల్గొననున్నారు. -
భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్ తీసుకున్నంటున్న సంచలన నిర్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (అదిగదిగో గ్రీన్ కార్డు) కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్రకటనలో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో ఇమ్మిగ్రెంట్స్పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్లాగ్ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్లాగ్”, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు. -
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుభవార్త అందించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాలు రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురానున్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని బైడెన్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతోపాటు, ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పరిశీలనకు కమిటీలకు పంపించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల లాటరీ విధానానికి బైడెన్ స్వస్తి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాన్ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్1బీ వీసా జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పి వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్లలో..పీహెచ్డీ చేసిన వారికి గ్రీన్కార్డు ఇచ్చే యోచనలో కూడా బైడెన్ ఉన్నారు. జనవరి 20 న పదవీ స్వీకారం తరువాత ఏం చేస్తారన్న ప్రశ్నలకు బైడెన్ స్పందించారు. అలాగే కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్ను అర్థిస్తానని కూడా బైడెన్ తెలిపారు. అధ్యక్ష పదవినిచేపట్టిన మొదటి రోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతామని కూడా బైడెన్ తెలిపారు. కాగా ట్రంప్ తీసుకొచ్చిన "క్రూరమైన" ఇమ్మిగ్రేషన్ విధానాలను రద్దుచేస్తామనేది బైడెన్ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. (అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం) -
హెచ్1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని ఈ మార్పులు కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్ సర్కార్కు అందకుముందే ఈ ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ట్రంప్ ఓటమి, జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది. బైడెన్ వాగ్దానం ప్రకారం హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం సవరించే అవకాశం ఉందని అంచనా.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బహుమఖ ప్రజ్ఞాశాలి ప్రభుదాన్ భొత్ర
నిర్భయంగా ఓటేయండి
10లోపు ఉచిత సీట్లలో చేరాలి
మళ్లీ బీజేడీదే అధికారం
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
కాంగ్రెస్లోకి బీజేపీ నాయకుడు దాస్ భొత్ర
విద్యుత్ ఏఈ, అకౌంట్స్ అధికారి సస్పెన్షన్
నకిలీ అభ్యర్థి అరెస్ట్
పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్
No Headline
తప్పక చదవండి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- Telangana: మరో రెండు రోజులు వానలు
Advertisement