-
సంచలన ఆవిష్కరణ: బుల్లెట్లను తట్టుకునే స్మార్ట్ఫోన్
Bulletproof iphone 13 series Price And Details: పై హెడ్డింగ్ చదివాక.. సాంకేతికత ఎంతగా వృద్ధి చెందినా.. స్మార్ట్ఫోన్ ఉండేది కేవలం వాడుకోవడానికే కదా అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇప్పుడు చెప్పబోయే ఫోన్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. చాలా ప్రత్యేకత సంతరించుకుంది మరి!. సాధారణంగా స్మార్ట్ఫోన్కి బుల్లెట్ తగిలితే.. దూసుకెళ్లి తునాతునకలు అవుతుంది. కానీ, ఈ ఫోన్లు మాత్రం తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ ‘కేవియర్’ స్టీల్త్ ఐఫోన్ పేరుతో సిరీస్ను మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. కిందటి ఏడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి అప్గ్రేడ్ వెర్షన్గా స్టీల్త్ 2.0 ఐఫోన్ 13 సిరీస్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత ఏంటంటే.. బుల్లెట్లను సైతం తట్టుకోగలుగుతుంది. స్టీల్త్ వెర్షన్ 2.0 ఐఫోన్లు.. బీఆర్-2 క్లాస్2కి చెందిన బుల్లెట్ప్రూఫ్ కవచంతో తయారు చేయించింది. బుల్లెట్ప్రూఫ్ కవచాలతో ఆయుధ వాహనాల్ని, యుద్ధ విమానాల్ని రూపొందించే ఎన్పీవో టీసీఐటీ సహకారంతో కేవియర్ ఈ ఐఫోన్ను పైప్యానెల్ను ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు పిస్టోల్స్ ఈ ఫోన్లను కాల్చి మరీ డెమోలను చూపించింది కంపెనీ. అదే టైంలో ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ ప్రజలకు సూచించింది కూడా. సాధారణ ఫోన్లకు గనుక బుల్లెట్ తగిలితే.. అది ఫోన్ పై ప్యానెల్ గుండా ఫోన్ బాడీలోకి చీల్చుకుపోతుంది. ఫోన్ను పనికి రాకుండా డ్యామేజ్ చేస్తుంది. కానీ, ఈ ఫోన్ మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని పైన ప్యానెల్ను పగలగొట్టి సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. బుల్లెట్ తగిలాక కూడా ఆ ఫోన్ కండిషన్తో పని చేయడం. బుల్లెట్ప్రూఫ్ ఫోన్లుగా ఇప్పటికే కొన్ని మార్కెట్లో చెలామణి అవుతుండగా.. వాటన్నింటికంటే ఇది స్టాండర్డ్గా తేలడం విశేషం. ఇక కేవియర్ ఇలాంటి ఫోన్లను కేవలం 99 యూనిట్లు(పీసులను) మాత్రమే తయారు చేయించింది. ప్రారంభ ధర 6, 370 డాలర్లుగా(మన కరెన్సీలో 4, 86 వేల రూపాయలకు పైనే) ఉంటుంది. గరిష్టంగా ఈ తరహా బుల్లెట్ ఐఫోన్ను(ఐఫోన్ ప్రో మ్యాక్స్.. 1 టీబీ స్టోరేజ్) 7, 980 డాలర్లకు అందించనుంది. కాబట్టి, బాగా డబ్బున్నోళ్ల కోసం, సెక్యూరిటీ భయం ఉన్నవాళ్ల కోసం ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది కదా!. 2010 నుంచి ఇటాలియన్ నగల వ్యాపారి ఇలియా గియకోమెట్టి ఆధ్వర్యంలో ‘కేవియర్’(1861 నుంచి వ్యాపారంలో ఉంది).. ఫ్లోరెన్స్(ఇటలీ) వేదికగా లగ్జరీ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తోంది. ఐఫోన్, శాంసంగ్లతో పాటు పలు రకాల బ్రాండ్లకు విలాసవంతమైన సొగసులు అద్ది(బంగారం, వజ్రాలు ఇతరత్రాలు) లిమిటెడ్ యూనిట్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఓ బ్రాండ్గా ముద్రను సంపాదించుకుంది. చదవండి: వారం పాటు బ్యాటరీ వచ్చే స్మార్ట్ఫోన్! ఏదంటే.. -
ఎందు కాలిడినా.. ప్యూర్ నీరు!
స్వచ్ఛమైన నీళ్లుంటే.. బోలెడన్ని రోగాలను అడ్డుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దురదృష్టం కొద్దీ స్వచ్ఛమైన నీళ్లు దొరకకనే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మరణిస్తున్నారు కూడా. ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్న పల్లెటూళ్లలో నీటి శుద్ధికి అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఇకపై ఈ సమస్య అస్సలు ఉండదంటోంది ‘ద ఆఫ్ గ్రిడ్ బాక్స్’. ఈ ఇటలీ కంపెనీ తయారు చేసిన మంచినీళ్ల యంత్రమే మీకు ఫొటోలో కనిపిస్తున్నది. దీంతో ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీళ్లను తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా.. కరెంటూ ఉత్పత్తి చేసుకోవచ్చు మరి! ఆరు అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పెట్టె లోపలి భాగంలో నీళ్లను శుద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఉంటే, బయట ఆ యంత్రాలను నడిపేందుకు, కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సోలార్ప్యానెల్స్ ఉన్నాయి. సోలార్ప్యానెల్స్కు దిగువన శుద్ధి చేయాల్సిన నీటిని వేడి చేసేందుకు సోలార్హీటింగ్ యంత్రాలూ ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా విద్యుత్తులైన్లు వేసుకోవాల్సిన పనిలేకుండా ఏ మారుమూల ప్రాంతంలోనైనా కలుషిత నీటిని శుద్ధి చేసి అందించేందుకు వీలేర్పడుతుంది. యంత్రాలు వాడుకోగా మిగిలిన విద్యుత్తును ఆయా ప్రాంతాల్లో బల్బులు వెలిగించేందుకైనా, ఫోన్లు చార్జ్ చేసుకునేందుకైనా వాడుకోవచ్చు. మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి కొంచెం పెద్ద పెద్ద బాక్సులు కూడా దొరుకుతాయి. బేసిక్ మోడల్లో 12 సోలార్ ప్యానెళ్లు, ఇన్వర్టర్, బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీతో దాదాపు మూడు ఎల్ఈడీ లైట్లను దాదాపు నాలుగు గంటలపాటు వెలిగించవచ్చు. 1,200 లీటర్ల నీటిని శుద్ధి చేయగల ఈ యంత్రంలో నీటిని నిల్వ చేసేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో బాక్స్ ద్వారా కనీసం 1,500 మందికి తాగునీరు అందించవచ్చు. ఆఫ్రికాలోని పేదదేశాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఇమిలియానో కొచినీ చెబుతున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ 1. మంచినీటిని శుద్ధి చేసే ‘ఆఫ్ గ్రిడ్ బాక్స్’. 2. మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement