-
దేశానికి సేవ చేశాం.. పింఛన్ రాక అడుక్కుంటున్నాం..
సాక్షి, కడప : ఈమె పేరు పార్వతమ్మ.. కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివాసముంటోంది. ఈమె భర్త మాజీ సైనికుడు. దాదాపు పదేళ్ల నుంచి మిలిటరీ పింఛన్ పెట్టించండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. నడవడానికి కూడా ఆస్కారం లేని ఈ పండుటాకును మనవరాలు శారద మూడు చక్రాల సైకిల్లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వస్తోంది. పింఛన్ రాకపోవడంతో బిచ్చం ఎత్తుకుని బతుకుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్కు చేరుకుని తన కష్టాన్ని ఏకరువు పెట్టుకుంది. . -
సీమాంధ్ర సత్తా చాటుదాం
కడప కార్పొరేషన్, న్యూస్లైన్: సీమాంధ్రవాసులు ఉద్యమాలను తీవ్రతరం చేసి తమ సత్తా ఏమిటో చూపాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.యానాదయ్య పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన డప్పు వాయిద్యాలతో ఐటీఐ సర్కిల్ నుంచి ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా కలెక్టరేట్కు చేరింది. దీక్షలు చేస్తున్న వారికి నాయీ బ్రాహ్మణులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యానాదయ్య మాట్లాడుతూ సీమాంధ్రులు తమ బలాన్ని చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. హైదరాబాద్లో సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణావాదులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, చంద్రబాబు, ఎంపీలు, మంత్రులు రాజీనామా చేసి రావాలని, లేకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. సీమాంధ్రులు దంచుడు మొదలుపెడితే తెలంగాణా వాదులు తట్టుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు నాగరాజు, చంద్రశేఖర్, మల్లేశ్వరయ్య, జి.సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, బాషా, శివ, మల్లికార్జున పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement