-
‘గుర్తు’పెట్టుకోండి.. పన్నీర్సెల్వంకు ‘పనస’
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రామనాథపురం నుంచి పోటీ చేస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వంకు ఎన్నికల అధికారులు 'పనస కాయ' గుర్తును కేటాయించారు. రామనాథపురంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన లాటరీ ద్వారా గుర్తును కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్సెల్వం.. తిరువాడనైలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పనసకాయతో ఫోజులిచ్చి గుర్తు కేటాయింపును అధికారికంగా ప్రకటించారు. రామనాథపురంలో అదే పేరుతో ఉన్న మరో నలుగురు అభ్యర్థులతో ఈ మాజీ సీఎం తలపడనున్నారు. పన్నీర్సెల్వం బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఏఐఏడీఎంకే జెండాను, లెటర్హెడ్ను నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నించారు. అయితే మద్రాస్ హైకోర్టులో ఓడిపోయిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తమిళనాడులో 39 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. -
బడ్డింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
పనస పండుతో పాఠోలి స్వీట్, టేస్ట్ అదిరిపోద్ది
పనస పాఠోలి తయారీకి కావల్సినవి: బియ్యం – కప్పు; పనసపండు తురుము – ఒకటిన్నర కప్పులు (తొనలను సన్నగా తురమాలి); పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; అరటి ఆకులు – పాఠోలీకి సరిపడా. స్టఫింగ్ కోసం: పచ్చికొబ్బరి తురుము – కప్పు; బెల్లం – ముప్పావు కప్పు; యాలుకలు పొడి – అరటీస్పూను. పనసపండుతో పాఠోలి.. తయారీ విధానమిలా: ►బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.మందపాటి బాణలిలో బెల్లం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేసి మరిగించాలి. ► బెల్లం కరిగి నురగలాంటి బుడగలు వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి తురుము వేయాలి. పాకంలో గరిట పెట్టి కలియతిప్పుతూ మిశ్రమం దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి. ► నీరంతా ఇంకిపోయినప్పుడు అర టీస్పూను యాలకుల పొడి కలిపి చల్లారనివ్వాలి. ► ఇప్పుడు నానిన బియ్యంలో నీళ్లు తీసేసి బ్లెండర్లో వేయాలి ∙దీనిలోనే పనసపండు తురుము, కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకోవాలి ∙ఇప్పుడు అరటి ఆకులను శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకోవాలి. ► రుబ్బుకున్న బియ్యం పేస్టుని అరటి ఆకులపైన మందపాటి పొరలాగా వేసుకోవాలి. పొర మరీ మందంగా, మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండాలి ► చల్లారిన బెల్లం కొబ్బరి తురుముని పొరపైన మధ్యలో వేయాలి ∙ఇప్పుడు అరటి ఆకుని నిలువుగా మడిచి ఆవిరి పాత్రలో పెట్టుకోవాలి ∙ఈ ఆకులను ముఫ్పై నిమిషాల పాటు ఆవిరిమీద ఉడికిస్తే పనస పాఠోలీ రెడీ. -
పనసకాయ.. షుగర్ ఆటకట్టు!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ చికిత్సలో ప్రభావవంతమైన వైద్య పోషకాహార చికిత్సగా పచ్చి పనసపొట్టు పిండి పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓ అధ్యయనం నిరూపించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థలో జరిగిన ఈ అధ్యయనంలో పచ్చి పనసపొట్టు పిండి ప్రయోజనాలను గుర్తించారు. పచ్చి పనసపొట్టు పిండికి మధుమేహ రోగుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించే శక్తి ఉందని నిర్ధారించారు. ఈ అధ్యయన ఫలితాలను ‘జాక్ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పలువురు వైద్య నిపుణులతో కలసి శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిత్యం తగిన మోతాదులో పచ్చి పనసపొట్టు పిండిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటున్నట్లు వైద్య బృందం సైతం నిర్ధారించిందన్నారు. రోజుకు 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే.. ‘జాక్ఫ్రూట్365’ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ జోసెఫ్ పేర్కొన్న వివరాల ప్రకారం... ఈ అధ్యయనం కోసం షుగర్ మాత్రలు వాడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మొత్తం 40 మంది టైప్–2 మధుమేహ రోగులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్లోని రోగులకు మూడు టేబుల్స్పూన్లకు సమానమైన 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలపాటు అందించారు. అలాగే మరో గ్రూప్లోని రోగులకు అంతే పరిమాణంలో పిండి తరహా పదార్థాన్ని అందించారు. ఈ అధ్యయన కాలంలో మధుమేహ రోగుల్లోని హెచ్బీఏ1సీ స్థాయిల్లో మార్పులతోపాటు ఫాస్టింగ్ ప్లాస్మా, గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ ప్లాస్మా గ్లూకోజ్ (పీపీజీ), లిపిడ్ ప్రొఫైల్, శరీర బరువును పరీక్షించారు. అలాగే గ్రీన్ జాక్ఫ్రూట్ ఫ్లోర్ను రోగుల రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించారు. వాటి ఫలితాల ప్రకారం పచ్చి పనసపొట్టు పిండి తీసుకున్న రోగుల్లో హెచ్బీఏ1సీ, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ (పీపీజీ)లో గణనీయంగా క్షీణత కనిపించింది. అధ్యయన ఫలితాలు ప్రోత్సాహకరం: వైద్య నిపుణులు ఈ అధ్యయనాన్ని మధుమేహ రోగులకు ప్రోత్సాహకరమైన వార్తగా ఫెర్నాండేజ్ ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ లతా శశి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివర్ణించారు. అహ్మదాబాద్కు చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ వినోద్ అభిచందానీ వర్చువల్ పద్ధతిలో మాట్లాడుతూ పచ్చి పనసపొట్టు పిండిని తన రోగులు వినియోగించడం ద్వారా వారు ఆరోగ్య ప్రయోజాలను పొందారన్నారు. ఇదే తరహా సూచనలను అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ సైతం చేసిందన్నారు. పచ్చి పనసపొట్టు పిండిలో పీచు పదార్థాలు అధికంగా లభిస్తాయని, దీనివల్ల తీసుకొనే కేలరీలు తగ్గడంతోపాటు గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉంటుందన్నారు. జాక్ఫ్రూట్365 సంస్థ అందించే గ్రీన్ జాక్ఫ్రూట్ ఫ్లోర్ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో ప్రతిరోజూ భోజన సమయంలో వినియోగించడం వల్ల కార్బోహైడ్రేట్లు, కేలరీల స్వీకరణ తగ్గుతుందన్నారు. మెడికల్ న్యూట్రిషన్ థెరఫీలో పచ్చి పనసపొట్టు పిండి సామర్ధ్యంపై క్లినికల్ అధ్యయనం చేసేందుకు శ్రీకాకుళం మెడికల్ కాలేజీని తాము ఎంచుకున్నట్లు డాక్టర్ అంతర్యామి మహారాణా చెప్పారు. -
పనసకాయ కోసం ఎన్ని తిప్పలు పడిందో ఈ ఏనుగు: వీడియో వైరల్
ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు చూశాం. జంతువులు తమ ఆహారాన్ని తినే ఫన్నీ వీడియోలు కూడా చూశాం. ఐతే ఇక్కడొక ఏనుగు తనకి ఇష్టమైన పనకాయ కోసం ఎంతలా ప్రయత్నించిందో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా ఆ చెట్టు ఆ ఏనుగుకి అందనంతా ఎత్తులో ఉంది. అయినా సరే ఎలాగోలా ఆ పనసకాయను కోసేందుకు తెగ ట్రై చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగు పనసకాయ కోసేందుకు దాని ముందరి కాళ్లను పైకి ఎత్తి చెట్టుకి తొక్కిపెట్టి మరీ కోసేందుకు ప్రయత్నిస్తోంది. ఆఖరికి తొండాన్ని ఎలాగోలా బాగా పైకి ఎత్తి ఆ పనసకాయను కోసేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Jackfruit is to Elephants what Mangoes are to humans.. and the applause by humans at the successful effort of this determined elephant to get to Jackfruits is absolutely heartwarming 😝 video- shared pic.twitter.com/Gx83TST8kV — Supriya Sahu IAS (@supriyasahuias) August 1, 2022 (చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement