-
ఆ సీన్ గురించి తప్పుడు ప్రచారం.. చాలా బాధ పడ్డాను: నటి శరణ్య
శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్లో విలన్ను కాలితో తన్నిన సీన్లో గానీ శరణ్య విజృంభించేసింది. శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది. 'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. -
'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్లో కేశవ ఎంట్రీ..!
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్తో పాటు కేశవగా నటించిన బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్(31) అరెస్ట్ కావడంతో పుష్ప-2 షూటింగ్పై ఎక్కువగా ప్రభావం పడింది. హైదరాబాద్లో ఒక యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైనట్లు ఆధారాలు లభించడంతో గతేడాదిలో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప పార్ట్-2 లో కేశవ పాత్ర చాలా కీలకం.. అతను జైలుకు వెళ్లడంతో చిత్ర యూనిట్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సినిమా విడుదల విషయంలో జాప్యం ఎదరౌతుందేమో అనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా జగదీష్కు బెయిల్ వచ్చిందని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. ఆయన జైలు నుంచి రాగానే వెంటనే 'పుష్ప 2' సినిమా షూటింగ్లో పాల్గొన్నాడట. జగదీష్, అల్లు అర్జున్కు సంబంధించిన కీలక సన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారట. పార్ట్-1 కంటే పుష్ప ది రూల్లోనే అల్లు అర్జున్తో జగదీష్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయట అందుకే అతన్ని రిప్లేస్ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని తెలస్తోంది. హైదరాబాద్లో ఒక భారీ సెట్లో గంగమ్మ జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. జగదీశ్కు బెయిల్ వచ్చేందకు పుష్ప చిత్ర యూనిట్ ఎక్కువగా సహకరించినట్లు టాక్. కానీ జగదీశ్ బెయిల్ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ స్పందించిన విషయం తెలిసిందే. ముందుగా అనుకున్నట్లే 2024 ఆగష్టు 15న విడుదల చేస్తామని వారు ప్రకటించారు. జగదీశ్ జైలుకు ఎందుకు వెళ్లాడు..? జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జగదీశ్ చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. పుష్ప సినిమాకు ముందు రోజుల్లో నుంచే ఒక యువతితో అతను సన్నిహితంగా ఉండేవాడు. డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన అవకాశంతో కేశవగా పాపులర్ అయ్యాడు. పుష్ప సినిమాలో కేశవ పాత్రతో గుర్తింపు వచ్చిన క్రమంలో ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు. అప్పటికే ఆమెకు వివాహమై భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఇద్దరి మధ్య పలుమార్లు వివాహ విషయమై గొడవలు జరిగాయి. ఆమె మరో వ్యక్తితో కలసి ఉండగా రహస్యంగా ఫొటోలు తీశాడు. ఇక నుంచి తనతో దూరంగా ఉండాలని కోరాడు. లేదంటే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీనంతటికి కారణం జగదీశ్నే అని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పుష్ప జగదీశ్ కేసు.. అసలు నిజం అదేనన్న నటుడు!
పుష్ప సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా). ఇటీవలే ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మరొకరితో సన్నిహితంగా మెలగడం జగదీశ్కు నచ్చక ఆమెను వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్న జగదీశ్ చెప్పినట్లు తాజా సమాచారం. తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. కాకినాడకు చెందిన యువతి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది. పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని సంగీత్నగర్లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా.. ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి.. ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ.. అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
పుష్ప-2 యూనిట్ కు బిగ్ షాక్ నటుడు జగదీష్ అరెస్ట్..
-
ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్నగర్: నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను తీసింది. డ్రైవర్తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం మండలం కందుకూర్ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూర్కు కోళ్లను తరలిస్తున్న డీసీఎం.. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగా గురువారం అర్ధరాత్రి మక్తల్ మండలం బొందల్కుంట స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం వసుదుర్గాకు చెందిన డీసీఎం డ్రైవర్ విజయ్కుమార్ (40)తో పాటు కోళ్లను లోడ్ చేసేందుకు వెళ్లిన అంబ్లే గ్రామానికి చెందిన జగదీష్ అలియాస్ మంజు (37), భద్రావతికి చెందిన షఫివుల్లా (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. డ్రైవర్ విజయ్కుమార్కు భార్య కుమార్బాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్కు (మంజు)కు భార్య గీత, ఇద్దరు పిల్లలు, షఫి ఉల్లాకు భార్య షాభానుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. Follow the Sakshi TV channel on WhatsApp:
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement