-
నేపథ్య గాయనిగా సీఎం సతీమణి
ఆమె స్వయానా ఓ ముఖ్యమంత్రి భార్య. పేరు అమృతా ఫడ్నవీస్. ఇప్పుడు ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'జై గంగాజల్' అనే సినిమాలో నేపథ్య గాయని అవతారం ఎత్తారు. అవును.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఈ సినిమాలో ఓ పాట పాడారు. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ భక్తి పాట పాడారు. అయితే, దీనికి గానీ.. మరే ఇతర గాన కార్యక్రమాలకు గానీ తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, వాళ్లు ఇస్తామన్నా అంగీకరించలేదని అమృత చెప్పారు. సలీమ్ సులేమాన్ అందించిన స్వరాలు, మనోజ్ ముంతాషిర్ రాసిన పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, అవి పాడుతున్నంత సేపూ తాను మైమరచిపోయానని అమృత తన అనుభవాన్ని వివరించారు. ఈ ఆఫర్ వచ్చేసరికి తాను మరో సినిమాలో పాట పాడుతున్నానని, తాను ఆ పాట పాడుతుండగా విన్న ప్రకాష్ ఝా.. ఆయన సినిమాలో పాటకు తన గొంతు సరిపోతుందని భావించి అడిగారని తెలిపారు. ఒకటిన్నర రోజులో రికార్డింగు పూర్తయింది. తన భర్త, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తన పాటను ఎంతగానో మెచ్చుకున్నారని.. జై గంగాజల్ సినిమా మహిళా కేంద్రీకృతంగా ఉంటుందని ఆమె అన్నారు. అమృత స్వతహాగా బ్యాంకర్. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాగానే ఆమె తన కుమార్తె దివిజతో కలిసి ముంబైకి మారిపోయారు. -
ప్రియాంక ప్రొడక్షన్లో అనుష్క
బాలీవుడ్లో సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారు హీరోయిన్లు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ. నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా తమ సొంత నిర్మాణ సంస్థల్లో ఇతర హీరోయిన్లను ఎంపిక చేయడానికి బాలీవుడ్ భామలు అస్సలు అంగీకరించరు. ఆ సాంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. నటిగా బాలీవుడ్తో పాటు హాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. పర్పల్ ఫెబల్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఈ బ్యూటీ ఒకేసారి మూడు సినిమాలను నిర్మిస్తోంది. ఇందులో భాగం తెరకెక్కనున్న ఓ సినిమాకు అనుష్క శర్మను హీరోయిన్గా ఎంపిక చేసుకుంది ప్రియాంక. ముందుగా ఈ పాత్రలో తానే నటించాలని భావించినా.., తాను ప్రస్తుతం ప్రకాష్ జా దర్శకత్వంలో నటిస్తున్న జై గంగాజల్ సినిమాతో క్లాష్ రావటంతో ఆ పాత్రకు అనుష్క శర్మను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా ప్రియాంక నిర్మాణంలో అనుష్క సినిమా ఉంటుందన్న టాక్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement