-
జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాలు విడుదల అయ్యాయి. శనివారం ఉదయం ఫలితాల్ని రిలీజ్ చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తన అఫీషియల్ వెబ్సైట్లో ప్రకటించింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ ఫలితల కోసం రీవాల్యూయేషన్, రీ చెకింగ్ లాంటివి ఉండవని, కాబట్టి అభ్యర్థులు సంప్రదించేందుకు ప్రయత్నించకూడదని సూచించింది ఎన్టీఏ. రిజల్ట్ చెక్ చేసుకునేందుకు.. స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు.. https://jeemain.nta.nic.in/ వీక్షించొచ్చు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష జనవరిలో జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 15 రెండో విడత జరిగాయి. మొదటి విడత పరీక్షకు 8.24 లక్షల మంది, రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ఈ రెండుసార్లు పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన అభ్యర్థుల ఉత్తమ స్కోర్ ఆధారంగానే ఎన్టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్స్లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి.. మొత్తం 2.50 లక్షల మందిని అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. ఈ నెల 30వ తేదీ నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 7వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ ఫీజును మే 8వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ 4వ తేదీన ఉంటుంది. ఉదయం 9-12గం. పేపర్ 1, మధ్యాహ్నం 2.30-5.30 మధ్య రెండో పేపర్ ఉంటుంది. -
ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశాలకు షెడ్యూలును విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. అందులో టాప్ 2.31 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులుగా ప్రకటించింది. గత నెల 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 1.64 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు. వాటి ఫలితాలను ఈనెల 10న ప్రకటించేందుకు ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. దీంతో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో ప్రవేశాలకు జోసా బుధవారం కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది. 7 దశల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. కౌన్సెలింగ్ను జూలై 19 నాటికి పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా, విద్యా సంస్థలు, బ్రాంచీల వారీగా అందుబాటులో ఉండే సీట్ల వివరాలు, బిజినెస్ రూల్స్ను తర్వాత జారీ చేస్తామని జోసా వెల్లడించింది. గతేడాది మొత్తం 37 వేల వరకు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా ఈసారి కూడా అంత మొత్తం సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది. ఐఐటీల్లో దాదాపు 11 వేలు, ఎన్ఐటీల్లో 18 వేలు, ట్రిపుల్ ఐటీల్లో 3,343 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ► జూన్ 10: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ► 15న ఉదయం 10 గంటల నుంచి: ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు రాసిన వారు జూన్ 18 తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ► జూన్ 19న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలొకేషన్–1 డిస్ప్లే (జూన్ 18న ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా). ► 24న ఉదయం 10 గంటలకు: మాక్ సీట్ అలొకేషన్ 2 డిస్ప్లే (జూన్ 23 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా). ►25న సాయంత్రం 5 గంటలకు: విద్యార్థులు రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ముగింపు. ► 26న: డేటా పరిశీలన, సీట్ అలొకేషన్ పరిశీలన. ► 27న ఉదయం 10 గంటలకు: మొదటి దశ సీట్ల కేటాయింపు. ► జూన్ 28 నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. ► జూలై 3న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయం త్రం 5 గంటలకు: రెండో దశ సీట్ల కేటాయింపు. ► 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 6న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్లు కేటాయింపు. ► 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 9న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాల ప్రకటన. సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు. ► 10, 11 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 12న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు. ► 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. ► 15న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్ల కేటాయింపు. ► 16, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. రిపోర్టింగ్ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. సీట్ల ఉపసంహరణకు ఇదే చివరి అవకాశం. ► 18న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ సీట్ల కేటాయింపు. ► 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్. కాలేజీల్లో చేరడం. -
జేఈఈ అడ్వాన్స్డ్ కు వంద మార్కుల కటాఫ్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా సీబీఎస్ఈ బుధవారం సాయంత్రం వీటి ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి జనలర్ కేటగిరీ విద్యార్థులకు వంద మార్కులు కటాఫ్ గా నిర్ణయించింది. అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఓబీసీ విద్యార్థులకు కటాఫ్ మార్కులు 70 గా నిర్ణయించగా, ఎస్సీ విద్యార్థులకు 52, ఎస్టీ విద్యార్థులకు 48 గా సీబీఎస్ఈ ఖరారు చేసింది. దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షకు 2 లక్షల మందికి (అర్హత) స్కోర్ కార్డులను ప్రకటించినట్టు తెలుస్తోంది. అర్హత సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఆన్ లైన్ లో (http://jeeadv.nic.in) రిజిస్టర్ చేసుకోవాలని సీబీఎస్ఈ కోరింది. ఇకపోతే, ఇంటర్ వెయిటేజీ మార్కులను, జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చన మార్కులను (60% : 40% నిష్పత్తిలో) కలిపి ర్యాంకులను జూన్ నెల 30 వ తేదీలోగా ప్రకటించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఐఐటీల్లో కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్ఐటీల్లోని బీఈ, బీటెక్, బీఆర్క్ వంటి కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఇంటర్ లో వచ్చిన మార్కులు, జేఈఈ మెయిన్ లో వచ్చిన మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్స్ పరీక్ష మొత్తం 360 మార్కులకు గాను గతేడాదికంటే కటాఫ్ మార్కులు ఈసారి తగ్గించారు. 2013లో 113 మార్కులు, 2014లో 115 మార్కులు , 2015 లో 105 మార్కులు కటాఫ్ గా నిర్ణయించారు. ప్రతిఏటా అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి 1.5 లక్షల విద్యార్థులను మాత్రమే ఎంపిక చేయగా, ఈసారి 2 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేయడంతో కటాఫ్ వంద మార్కులకు తగ్గించినట్టు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు కోసం..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement