-
బిజీగా కోహ్లీ.. జట్టుతో కలిసి జీపు ప్రయాణం
-
బిజీగా కోహ్లీ.. జట్టుతో కలిసి జీపు ప్రయాణం
రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి మైదానంలో అయితే దిగలేదు గానీ.. జట్టు జెర్సీ వేసుకుని బిజీగానే గడిపేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో భుజానికి గాయం కావడంతో అప్పటినుంచి క్రికెట్ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నా, జట్టుతో కలిసి ఫొటోషూట్లు, ప్రకటనలలో బిజీగానే ఉంటున్నాడు. తాజాగా తన ట్విట్టర్ పేజీలో కోహ్లీ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో తన జట్టు సభ్యులను కొంతమందిని ఒక వింటేజ్ జీపులో ఎక్కించుకుని అలా కొంతదూరం తిప్పడం కనిపిస్తుంది. ఫ్రంట్ సీట్లో కోహ్లీ పక్కనే క్రిస్ గేల్ కూర్చోగా.. వెనకాల ఎస్ అరవింద్, షేన్ వాట్సన్, ఏబీ డివీలియర్స్ ముగ్గురూ ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఓపెన్ టాప్ జీపును స్వయంగా కెప్టెన్ కోహ్లీయే డ్రైవ్ చేయడం గమనార్హం. రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా ఒక బౌండరీని ఆపే సందర్భంలో కోహ్లీ భుజానికి గాయమైంది. దాంతో ధర్మశాల టెస్టుకు కూడా అతడు దూరం కాగా, అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించి బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోహ్లీతో పాటు మరో స్టార్ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కూడా దూరం కావడంతో షేన్ వాట్సన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఆర్సీబీ జట్టులో ఈ కీలక ఆటగాళ్లిద్దరితో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆడట్లేదు. ఇక కేఎల్ రాహుల్ మొత్తం టోర్నమెంటుకే దూరమయ్యాడు. గాయాలపాలైన వీళ్లంతా అసలు ఈ సీజన్లో ఆడతారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. తొలి మ్యాచ్లో కోహ్లీ, డివీలియర్స్ ఇద్దరూ లేకపోవడంతో సన్రైజర్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే. Shoot time. Driving the boys around.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement