Sakshi News home page

బిజీగా కోహ్లీ.. జట్టుతో కలిసి జీపు ప్రయాణం

Published Fri, Apr 7 2017 2:22 PM

రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతానికి మైదానంలో అయితే దిగలేదు గానీ.. జట్టు జెర్సీ వేసుకుని బిజీగానే గడిపేస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భుజానికి గాయం కావడంతో అప్పటినుంచి క్రికెట్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నా, జట్టుతో కలిసి ఫొటోషూట్లు, ప్రకటనలలో బిజీగానే ఉంటున్నాడు. తాజాగా తన ట్విట్టర్ పేజీలో కోహ్లీ ఒక వీడియో షేర్ చేశాడు. అందులో తన జట్టు సభ్యులను కొంతమందిని ఒక వింటేజ్ జీపులో ఎక్కించుకుని అలా కొంతదూరం తిప్పడం కనిపిస్తుంది. ఫ్రంట్ సీట్లో కోహ్లీ పక్కనే క్రిస్ గేల్ కూర్చోగా.. వెనకాల ఎస్ అరవింద్, షేన్ వాట్సన్, ఏబీ డివీలియర్స్ ముగ్గురూ ఉన్నారు. రెండో ప్రపంచయుద్ధం నాటి ఈ ఓపెన్ టాప్ జీపును స్వయంగా కెప్టెన్ కోహ్లీయే డ్రైవ్ చేయడం గమనార్హం.