-
పిడుగుపాటుకు జెర్సీ ఆవుల మృతి
చిత్తూరు జిల్లా పెద్ద తిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలో పిడుగు పాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి రైతు నారాయణ ఇంటి సమీపంలో పిడుగు పడడంతో పాకలో ఉన్న ఆవులు మృత్యువాత పడ్డాయి. కాగా, రెండు ఆవుల విలువ రూ.1.30 లక్షలు ఉంటుందని రైతు నారాయణ తెలిపాడు. -
పశువుల జాతర
మణికొండ: విభిన్న జాతులకు చెందిన పశువులు సందడి చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక గేదెలు ఆకర్షణగా నిలిచాయి. నార్సింగ్లో శుక్రవారం నిర్వహించిన పశుసంక్రాంతిలో బర్రెలు, ఆవులు 300 వరకు రాగా.. వాటిలో 152 వరకు అమ్ముడుపోయాయి. హర్యానాకు చెందిన ముర్రా జాతి రూ. లక్ష ధర పలికింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లారెడ్డి అనేవ్యక్తి రూ. లక్షకు ముర్రాజాతి బర్రెను కొనుగోలు చే శారని మార్కెట్ కమిటీ కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. సాయంత్రం వరకు అధికారికంగా రూ. 60 లక్షల వ్యాపారం జరిగిందని ఆమె పేర్కొన్నారు. జెర్సీ ఆవులు రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు అమ్ముడుపోయాయి. రోజుకు 20 లీటర్లు.. గుజరాత్కు చెందిన దులియా జాతి బర్రె రూ. 2.10 లక్షలకు ఒకటి చొప్పున రెండు రూ. 4.20 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. వీటిని మహేశ్వరంకు చెందిన పాలవ్యాపారి రవియాదవ్ కొనుగోలు చేశారు. అధికారికంగా మాత్రం తక్కువ ధరకు కొన్నట్టు మార్కెట్యార్డు రిసిప్టు తీసుకున్నట్టు తెలిసింది. ఉదయం, సాయంత్రం కలసి రోజుకు 20 లీటర్ల పాలు ఇవ్వటం వీటి ప్రత్యేకత. -
పశు క్రాంతి
లీటర్లకొద్దీ పాలిచ్చే గేదెలు.. ట్రాక్టర్కు తీసిపోకుండా నాగలి దున్నగలిగే దున్నపోతులు.. కళ్లు తిప్పుకోనివ్వని జెర్సీ ఆవుల అందాలు! ఇవన్నీ ఎక్కడో కాదు... నగరం నడిబొడ్డునే. నగరంలోని నార్సింగికి పల్లె కదిలొచ్చింది. పండుగ కళ తెచ్చింది... ప్రతి ఏటా సంక్రాంతి తర్వాతి రెండో శుక్రవారం లంగర్హౌస్ సమీపంలోని నార్సింగ్ మార్కెట్ కమిటీలో జరిగే పశువుల సంతలో పండుగ కళ కనబడుతోంది. పంటలు చేతికొచ్చి, డబ్బులు సమకూరాక రైతులు పశువులు కొనడం అనవాయితీగా వస్తోంది. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న ఈ అంగడిలో హర్యానాకు చెందిన ముర్రా, మహారాష్ట్రలోని ఘోడేగావ్, గుజరాత్లోని ధుళియా, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా గుజ్జరి గేదెలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈఏడు సంతలో నేపాల్ పశువులు కూడా అడుగిడుతున్నాయి. సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన పశువులు కొనుగోలు చేసే ఈ సంతలో ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ముర్రానా మాజాకా... నల్లటి రంగు. భారీ దేహం. చెక్కినట్టుగా మెలితిరిగిన కొమ్ములు, జిగేల్మనిపించే పెద్ద కళ్లు.. ముర్రా జాతి బర్రెలు చూడగానే కట్టిపడేస్తున్నాయి. రోజుకు బకెట్ల కొద్దీ పాలు ఇచ్చే ఈ బర్రెల ధర లక్ష నుంచి రెండు లక్షలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యాపారులు. హర్యానా, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఈ పశువులకు డిమాండ్ ఎక్కువ ఉందని హర్యానా వాసి ఉమాశంకర్ చెబుతున్నాడు. ఆవాల నూనె, బెల్లం, చక్కెరలను నీటిలో కలిపి ఈ బర్రెలకు ఇవ్వడం వల్ల కాల్షియం మోతాదు పెరిగి పాలు ఎక్కువగా ఇస్తాయని తెలిపారు. భళా ధుళియా... గుజరాత్ పోరుబందర్ నుంచి తీసుకొచ్చిన ధుళియా జాతి బర్రెలు కూడా ముర్రా, మిన్ని జాతి కంటే ఏమాత్రం తీసిపోవడం లేదు. మంచి దేహ దారుఢ్యం కలిగిన ఈ బర్రెలను జాఫ్రి ధుళియా అని కూడా పిలుస్తుంటారు. ఇవి రోజు పొద్దున, సాయంత్రం కలిసి 20 లీటర్ల పాలు ఇస్తాయని పశువుల విక్రేత డి.నవీన్ కుమార్ తెలిపారు. పత్తి పిండి, కంది పొట్టు, వరిగడ్డి, పచ్చిగడ్డి, గోధుమ, కంది, శనగ పొట్టులను కలిపి ఈ ధుళియాలకు పెడతామంటున్నారు. కరిష్మా కేక... బర్రెలంటే మాకు ప్రాణం. పశువులను దేవతతో సమానంగా చూస్తాం. నాకు నచ్చిన ధుళియా జాతికి చెందిన ఈ బర్రెకు కరిష్మా అని పేరు పెట్టుకున్నా. 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరిష్మాను అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటున్నారు అబ్దుల్ అజ్మద్. హర్యానా నుంచి తీసుకొచ్చిన జెర్సీ ఆవుల అందాలు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ‘ఇవి 50వేల వరకు పలకొచ్చు. రోజుకు పది లీటర్ల పాలు ఇస్తాయ’ని రైతు లతికా శర్మ తెలిపారు. - వాంకె శ్రీనివాస్
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement