-
బీహారీలకు ‘బిగ్’ న్యూస్ చెప్పిన సీఎం నితీష్
Nitish Kumar Announcement.. బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత నితీష్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం నితీష్ కుమార్.. బీహార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తమ సంకీర్ణ ప్రభుత్వ హామీల మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, సీఎం నితీష్ వ్యాఖ్యల మేరకు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. @NitishKumar ने गांधी मैदान से अपने भाषण में दस लाख लोगों को नौकरी के साथ बीस लाख लोगों को रोज़गार देने की महत्वपूर्ण घोषणा की@ndtvindia @Anurag_Dwary pic.twitter.com/8GfkRLEY0B — manish (@manishndtv) August 15, 2022 ఇదిలా ఉండగా.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జేడీ కనుక అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. కానీ, ఆర్జేడీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఇక, తాజాగా జేడీయూతో కలిసి ఆర్జేడీ అధికారంలోకి రావడంతో అప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేలా సీఎం నితీష్.. నేడు ఇలా గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. अभिभावक आदरणीय मुख्यमंत्री श्री नीतीश कुमार जी का 76वें स्वतंत्रता दिवस के अवसर पर पटना के गाँधी मैदान से ऐतिहासिक ऐलान:- 10 लाख नौकरियों के बाद 10 लाख अतिरिक्त नौकरियां दूसरी अन्य व्यवस्थाओं से भी दी जाएगी। जज़्बा है बिहारी जुनून है बिहार उत्तम बिहार का सपना करना है साकार — Tejashwi Yadav (@yadavtejashwi) August 15, 2022 ఇది కూడా చదవండి: మీ రాజకీయాల కోసం.. చరిత్రను వక్రీకరించకండి: సోనియా ఫైర్ -
ఎస్సై పరీక్ష.. హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్టికెట్ను ప్రింట్ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్ తీసుకున్న హాల్టికెట్ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్టికెట్తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు. 11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్’ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్సీపీగేట్–2022 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు. గెస్ట్ లెక్చరర్ల వేతనం పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్ రోస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు. గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్ కన్వీనర్ రోనాల్డ్రాస్ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు. 31న సబ్ ఇంజనీర్ పోస్టులకు పరీక్ష సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో 201 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్టికెట్లు పంపిణీ చేశామని, హాల్టికెట్లు అందని వారు సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నేడు, రేపు అగ్రి ఎంసెట్ సాక్షి, హైదరాబాద్: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్ ఎంసెట్ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్ తెలిపారు. నేడు ఇంజనీరింగ్ ఎంసెట్ ‘కీ’విడుదల ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్ ఎంసెట్ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. -
జాబ్ న్యూస్
హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కొలువులు ఖాళీలు: 671 (పార్ట్టైమ్ మెడికల్ ఆఫీసర్–85, ఏఎన్ఎం ఫిమేల్–176, స్టాఫ్ నర్స్– 160, ల్యాబ్ టెక్నీషియన్–80, ఫార్మసిస్ట్–85, అకౌంటెంట్ కమ్ క్లర్క్–85) విద్యార్హత: పోస్టును బట్టి ఎంబీబీఎస్/ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్)/జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్/ఇంటర్, డీఎంఎల్టీ, బీఎస్సీ(ఎల్టీ)/ఇంటర్, డీఫార్మసీ, బీఫార్మసీ, బీకాం. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 2 వెబ్సైట్:www.hyderabad.telangana.gov.in రాష్ట్రపతి సచివాలయంలో ‘మాలి’ ఉద్యోగాలు ఖాళీలు: 66 (జనరల్–8, ఎస్టీ–15, ఓబీసీ–43) విద్యార్హత: పదో తరగతి, ఎన్ఎస్క్యూఎఫ్(నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్) లెవల్–4 సర్టిఫికెట్/గార్డెనింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్, రెండేళ్ల అనుభవం. ∙ వయసు: 18–30 ఏళ్లు. దరఖాస్తుకు చివరి తేది: జనవరి 30 వెబ్సైట్: rashtrapatisachivalaya.gov.in ఎయిమ్స్ రిషికేష్లో సీనియర్ రెసిడెంట్లు ఖాళీలు: 89 (ఓసీ–44, ఓబీసీ–30, ఎస్సీ–11, ఎస్టీ–4) విద్యార్హత: మెడికల్ అభ్యర్థులకు సంబంధిత డిసిప్లెయిన్లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ; నాన్ మెడికల్ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ, పీహెచ్డీ; డెంటిస్ట్రీ విభాగానికి ఎండీఎస్. వయోపరిమితి: 2017 ఫిబ్రవరి 20 నాటికి 33 ఏళ్లు. దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 20 వెబ్సైట్: www.aiimsrishikesh.edu.in డీఎఫ్సీసీఐఎల్లో వివిధ ఉద్యోగాలు ఖాళీలు: 36 (వర్క్స్ ఇంజనీర్–28, ఫైనాన్స్ ఆఫీసర్–4, జూని యర్ ఫైనాన్స్ ఆఫీసర్–3, లీగల్ కన్సల్టెంట్–1) విద్యార్హత: వర్క్స్ ఇంజనీర్కి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ, మూడేళ్ల అనుభవం; ఫైనాన్స్ ఆఫీసర్కు సీఏ/ఐసీడబ్ల్యూఏ; జూనియర్ ఫైనాన్స్ ఆఫీసర్కు ఎంబీఏ(ఫైనాన్స్); లీగల్ కన్సల్టెంట్కు న్యాయశాస్త్రంలో డిగ్రీ, కనీసం ఐదేళ్ల అనుభవం. ముఖ్య తేదీలు: లీగల్ కన్సల్టెంట్ పోస్టుకు చివరి తేది: ఫిబ్రవరి 20; వర్క్స్ ఇంజనీర్ పోస్టుకు ఇంటర్వూ్య: జనవరి 21, 28, ఫిబ్రవరి 4; ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వూ్య: జనవరి 21 వెబ్సైట్: dfccil.gov.in
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement