-
విదేశీ ఉద్యోగాల పేరుతో టోకరా
♦ మోసపోయిన ఆంజనేయపురానికి చెందిన 8 మంది యువకులు ♦ రూ. 80 వేలు చొప్పున అర్పించిన వైనం ♦ పోలీసులకు ఫిర్యాదు టెక్కలి రూరల్: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురు యువకుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠా చేతిలో మోసపోయామని ఆంజనేయపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు టెక్కలి ఎస్ఐ జి.రాజేష్ వద్ద వాపోయారు. ఈ మేరకు బాధితులు ముడిదాన గిరిరాజు, రాము స్థానిక పోలీసు స్టేషన్కు ఆదివారం వచ్చి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం... క్యూనెట్ అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని గ్రామానికి చెందిన కొందరు యువకులను ఆ సంస్థ ప్రతినిధులు నమ్మించారు. సభ్యత్వం కావాలంటే ముందుగా రూ. 80 వేలు సదరు సమస్థ ప్రతినిధులకు అప్పజెబితే వారు సభ్యత్వం కింద ఒక వాచీ ఇస్తారు. వాచీ అందుకున్న సదరు యువకుడు మరో ముగ్గురిని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల చొప్పున వసూలు జరిగిన తర్వాత చైన్ లింక్ పద్ధతి ప్రకారం ఒక్కొక్కరు ముగ్గురిని చొప్పున జాయిన్ చేసుకోవాలని ఇలా చేరిన వారికి విశాఖపట్నంలో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తామని అనంతరం హాంకాంగ్, మలేషియా వంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని సదరు సంస్థ ప్రతినిధులు యువకులను నమ్మించారు. దీంతో ఆంజనేయపురం గ్రామానికి చెందిన సుమారు 8 మంది వ్యక్తులు రూ. 80 వేల చొప్పున చెల్లించారు. ముందుగా హైదరాబాద్ చేరుకున్న వీరికి నెల రోజుల తర్వాత విశాఖపట్నం పంపారు. అక్కడ ఒక చిన్న గదిలో కంప్యూటర్పై అవగాహన అని చెప్పి కొద్దిరోజులు గడిపిన తర్వాత వీరి నుంచి మరికొంతమంది మిత్రులు, బంధువుల ఫోన్ నంబర్లను సేకరించారు. వారిని కూడా సభ్యులుగా చేర్చమని ఒత్తిడి తెచ్చేవారని బాధిత యువకులు తెలిపారు. సంస్థ తీరుపై అనుమానం వచ్చి తాము మోసపోయినట్టు గ్రహించామని బాధితులు ఎస్ఐకి చెప్పారు. దీనిపై స్పందించిన ఎస్ఐ మాట్లాడుతూ ఆన్లైన్లో పలు బోగస్ సంస్థలు ఉన్నాయన్నారు. వాటిని నమ్మి యువత మోసపోవడం తగదని చెప్పారు. క్యూనెట్ అనే అంతర్జాతీయ సంస్థ, ఆ సంస్థ ప్రతినిధుల ఆచూకీకి కృషి చేస్తామని ఎస్ఐ తెలిపినట్టు బాధితులు పేర్కొన్నారు. -
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం
ఖమ్మం అర్బన్ : '92 దేశాల్లోని 142 ప్రముఖ కంపెనీల్లో పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం కల్పిస్తాం' అని బోర్డు పెట్టి 4 నెలల కిందట ఖమ్మంలో ఓ వ్యక్తి సంస్థను నెలకొల్పాడు. చాలామందిని నమ్మబలికి లక్షలు వసూలు చేసి, ఇంటి అద్దె కూడా చెల్లించకుండా ఉడాయించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నకిలీ కన్సల్టెంట్ సంస్థ నిర్వాకం వెలుగుచూసింది. ఎక్సాల్ట్సాస్ట్ సొల్యూషన్స్ పేరుతో తిరుపతి సమీపంలోని నారాయణపురానికి చెందిన డి.విశ్యప్రసాద్ ఎండీ అండ్ చైర్మన్ గా నాలుగు నెలలు కిందట సంస్థను ప్రారంభించారు. మమత వైద్యశాల రోడ్డులోని వైపీరెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లోని 5వ అంతస్తులో కార్యాలయం (నెలకు రూ.8 వేల అద్దె) ప్రారంభించారు. కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ప్రకటన ఇచ్చాడు. నిరుద్యోగులు అతడి మాటలు నమ్మి రూ.లక్షలు చెల్లించారు. విద్యార్హతను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించాడు. ఉద్యోగం అడిగితే నేడు, రేపు అంటూ కాలం గడిపాడు. 10 రోజుల కిందట ఇంటికి, కార్యాలయానికి తాళం వేసి తెరవకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగేంద్రచారి, ఎస్సై మెగిలి సోమవారం కార్యాలయం నిర్వహించిన గది, నివాసం ఉన్న ఇంటిని పరిశీలించారు. కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 మంది వద్ద రూ.కోటి పైగానే వసూలు చేసినట్లు తెలిసింది. తమకు కూడా 2 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని కార్యాలయ సిబ్బంది వాపోయారు. కాగా కార్యాలయంలోని రికార్డులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నాగేంద్రచారి తెలిపారు. -
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్
జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు. ఏటా 8 లక్షల మంది.. ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. 2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. కువైట్ నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్మెంట్, హౌస్కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఖతార్ ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది. సౌదీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి. యూఏఈ నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి. అర్హతను బట్టి ఉద్యోగాలు ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్గా పేర్కొంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..) ఔత్సాహికులకు భరోసా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం. వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది. అంతా ఆన్లైన్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది. కఫాలా.. తప్పనిసరి గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లు ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్. గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. - కె.భవాని, జీఎం-హెచ్ఆర్, టామ్కామ్.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement