-
1500 టికెట్లే అమ్ముడుపోయాయి!
ప్రపంచవ్యాప్తంగా ఏవో కొన్ని ప్రతిష్టాత్మక వేదికల్లో మినహా టెస్టు క్రికెట్కు అంతగా ఆదరణ దక్కడం లేదు. క్రికెట్ను చిన్న నగరాలకు కూడా చేర్చే ప్రయత్నంలో బీసీసీఐ ఇలాంటి వేదికల్లో టెస్టులు నిర్వహిస్తోంది. అయితే ఏం చేసినా వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతంత మాత్రమే. తాజాగా రాంచీ టెస్టులో ఇది మళ్లీ నిరూపితమైంది. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా... ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్కు 1500 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్సీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాగే ఉంటే ఇకపై టెస్టుకు ఆతిథ్యం ఇవ్వడంపై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని జేఎస్సీఏ అధ్యక్షుడు నఫీస్ ఖాన్ అన్నారు. గ్యాలరీలు ఖాళీగా కనిపించకుండా పెద్ద మొత్తంలో కాంప్లిమెంటరీ పాస్లు పంపించినా అమ్ముడుపోయిన టికెట్ల విషయంలో మాత్రం తాము తీవ్రంగా నిరాశ చెందామని ఆయన చెప్పారు. సీఆర్పీఎఫ్కు 5వేలు, పాఠశాల విద్యార్థుల కోసం మరో 10 వేలు టికెట్లు ఉచితంగా అందిస్తున్నారు. -
'కోహ్లి ఏమీ చెప్పలేదే'
రాంచీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు సంబంధించి ఫలాన పిచ్ కావాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అడిగాడంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్(జేఎస్సీఏ) స్టేడియం క్యూరేటర్ ఎస్ బీ సింగ్ స్పష్టం చేశారు. మూడో టెస్టు మ్యాచ్ పిచ్ కు సంబంధించి విరాట్ కోహ్లి తమతో కలిసినట్లు ఆస్ట్రేలియన్ దినపత్రిక ప్రచురించిన వార్తల్లో నిజం లేదన్నారు. మరొకవైపు పిచ్ రూపకల్పనపై విరాట్ పాత్ర లేదనే విషయాన్ని జేఎస్సీఏ జాయింట్ సెక్రటరీ దేబాశిస్ చక్రబొర్తి సైతం ఖండించారు. 'ఎస్ బీ సింగ్ చెప్పింది ముమ్మాటికీ నిజం. రాంచీలో జరిగే టెస్టు మ్యాచ్ నిర్వహణకు మూడు పిచ్ లను తయారు చేసిన మాట వాస్తవం. ఆ విషయాన్నేచెప్పాం. అంతేకానీ పిచ్ రూపకల్పనలో విరాట్ పాత్ర ఉన్న విషయాన్ని క్యూరేటర్ ఎక్కడా చెప్పలేదు. ఆ పిచ్ తయారీపై కోహ్లి కూడా క్యూరేటర్లకు ఏమీ చెప్పలేదే. మరి అటువంటప్పుడు ఆ కథనాల్ని ఎలా ప్రచురిస్తారు. ఇక్కడ 4,5,7 నంబర్లు గల పిచ్ లను తయారు చేసి ఉంచాం. మ్యాచ్ నిర్వహణ అధికారులు వచ్చి ఫలాన పిచ్ ను సిద్ధం చేయమని చెప్పిన తరువాత మాత్రమే ఆ రకంగా ముందుకు వెళతాం. అప్పటివరకూ కొన్ని పిచ్ లను తయారు చేసి పక్కకు పెడతాం. భారత జట్టుకు అనుకూలంగా పిచ్ ను తయారు చేయమన్నారని కోహ్లి చెప్పినట్లు వచ్చిన వార్తలు నిజం కాదు'అని దేబాశిస్ చక్రబొర్తి తెలిపారు. మార్చి 16వ తేదీన ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రాంచీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement