-
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
Omicron Variant: అలసత్వం వద్దు... అప్రమత్తత ముద్దు
మొదటి, రెండో కరోనా వేవ్ నుంచి బయటపడ్డామని ఊరటగా ఉంటున్న సమయంలో మూడో వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరి యంట్తో కరోనా విజృంభించడం, అక్కడ నుండి వివిధ దేశాలకు విచ్చేసిన ప్రయాణికుల ద్వారా విస్తరిస్తుండటంతో ఆందోళన మొదలయింది. ఈ ప్రమాదకర వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపించే రకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పలు దేశాలలో గంటగంటకు ఆంక్షలు పెరుగుతున్నాయి. పలు దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్ మనదేశంలోనూ అడుగుపెట్టింది. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాలనుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రులకు తరలిస్తారు, నెగిటివ్ వచ్చిన వారిని కూడా వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్కు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైంది. ప్రజలందరూ తప్పకుండా రెండు డోసులు టీకా వేసుకోవాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. (చదవండి: విద్యార్థులు బలిపశువులు కారాదు!) తెలంగాణలో అర్హులైన వారిలో 90 శాతానికి పైగా మొదటి డోసు టీకా వేసుకున్నారని 47 శాతం మందికి పైగా రెండు డోసులు వేసుకున్నారని, ఇంకా 80 లక్షలకు పైగా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. 100% వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కానీ ప్రజలలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా బయట తిరగడం, మాస్కులు ధరించకుండా, కనీసం భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ల వాడకం కూడా పూర్తిగా తగ్గించి వేశారు. 85 శాతం నుంచి 90 శాతం వరకు మాస్కులు ధరించకుండా, శానిటైజర్లు వాడకుండా తిరుగుతున్నారు. షాపింగ్ మాల్స్లో, సినిమాహాల్లో, మార్కెట్లలో, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు వంటి జన సమర్థం అధికంగా ఉండే బహిరంగ ప్రదేశాలలో కూడా మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. (BR Ambedkar: అంబేడ్కర్ బాటలో తెలంగాణ) అన్ని రకాల విద్యాసంస్థలు ప్రారంభమవడం, గురుకుల పాఠశాలలో కూడా భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంతో అక్కడ అక్కడ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం మొదలయింది. ఖమ్మం జిల్లా వైరా గురుకులంలో 29 మందికి, రంగారెడ్డి జిల్లా ముత్తంగి లోని బాలికల గురుకులంలో 47 మంది విద్యార్థినిలకు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకింది. ఇలా జగిత్యాల జిల్లా తాటి పెళ్లి గురుకుల పాఠశాలలో తొమ్మిది మందికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు లోని కస్తూరిబా గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ శివారులోని టెక్ మహీంద్రా వర్సిటీలో 25 మంది విద్యార్థులకు వైరస్ అంటుకున్నది. బాలలు జాతి సంపద, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వారికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించి పరిరక్షించవలసిన తరుణంలో, మౌలిక వసతుల కల్పన, కోవిడ్ నిబంధనలు పాటించకుండా గురుకులాలు ప్రారంభించడంతో విద్యార్థులు వైరస్ బారిన పడుతుండడం బాధాకరం. కరోనా సమసిపోయింది అన్న ఆనందం క్షణాల్లోనే ఆవిరైపోతుంది. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇంత జరుగుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సంగతిని పట్టించుకోవడం లేదు. మాస్కులు, శానిటైజర్ల కొనుగోలు తగ్గిపోయిందని, వ్యాపార వర్గాల ప్రయోజనాల కోసం మళ్లీ మూడవ దఫా వైరస్ విస్తరిస్తున్నదని, కార్పొరేటు పెత్తందార్లు, పెట్టుబడిదారుల లాబీయింగ్ వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ప్రచారం జరుగుతున్నదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో నిజానిజాలు ఎలా ఉన్నా మాస్కుల వాడకం, శానిటైజర్లను ఉపయోగించడం తప్పకుండా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలందరూ ఒక దగ్గరికి చేరకూడదు. కనీస రక్షణ చర్యలు పాటించకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే రాబోయే 1, 2 నెలలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉన్నది. అందుకని విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్లు ఉపయోగించి, భౌతిక దూరం పాటించడం చాలా కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ నుండి మానవాళిని కాపాడడానికి తక్షణమే కనీస రక్షణ చర్యలు అవలంబించాలి. ప్రభుత్వాలు, పౌర సమాజం సంబంధిత కార్యనిర్వాహక శాఖలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది... - తండ సదానందం వ్యాసకర్త టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మహబూబాబాద్ -
ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..
జూలూరుపాడు: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనుకతండా గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. నీళ్ల కోసం ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండా గ్రామంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. రెండు వారాల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాములునాయక్కు వివరించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు కూడా పని చేయడంలేదని, బిందె నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హుజురాబాద్లో టీఆర్ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది) చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల -
భద్రాద్రి జిల్లాలో ఏడు శతాబ్దాల నాటి బావి
అద్భుత కట్టడాలకు ఆలవాలం కాకతీయుల కాలం.. వారి శిల్పకళ ప్రతిభ అనిర్వచనీయం.. నిర్మించి శతాబ్దాలు దాటినా చెక్కుచెదరని నైపుణ్యం వారి సొంతం.. ఆ కోవలోకే వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఉన్న కాకతీయులు నిర్మించిన రాజా బావి.. 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి పాలనలో ఇక్కడి సామంతరాజులు నిర్మించిన ఆ బావి ఇంకా పదిలంగానే ఉంది. కానీ నేటి పాలకులు, అధికారులు పట్టించుకోక పోవడంతో చారిత్రక కట్టడం నిరాదరణకు గురవుతోంది. జూలూరుపాడు, భద్రాద్రి జిల్లా : శత్రుదేశాల సైన్యాల నుంచి రక్షించుకోవడానికి నాటి సామంతరాజులు ఒక రహస్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అప్పట్లో దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడును అనువైన ప్రాంతాంగా ఎంచుకున్నారు. అక్కడ నీటి అవసరాలకోసం సువిశాలమైన అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో రాతి కట్టడంతో రాజా బావిని నిర్మించారు. రాజా బావి పైభాగాన చుట్టూ 10గదులను నిర్మించారు. బావిలోకి మెట్లు 30 అడుగుల లోతు వరకు ఉంటాయి. ఈ బావికి చుట్టూ ఉన్న గదుల పై కప్పు 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ఒకే రాయి ఉన్నట్లు కనిపిస్తుంది. కొన్నేళ్లు పూడిక తీయకపోవడంతో బావి లోతు ఎంత అనేది ఎవరికీ తెలియదు. ఆ రోజుల్లో ఈ బావిని డంగు సున్నం, రాళ్లతో కట్టడంతో నేటికీ ధృడంగా ఉంది. వరంగల్ వరకు సొరంగం..! సాధారణంగా రాజులు తమ రహస్య స్థావరాలకు సొరంగ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ విధంగానే ఈ బావికి కూడా సొరంగ మార్గం ఇటు వరంగల్ కోట వరకు.. అటు ఖమ్మం ఖిల్లా వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో ఉంచారని స్థానికంగా ప్రచారంలో ఉంది. దీంతో బావిలో గుప్త నిధులు ఉన్నాయని భావించిన కొందరు యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బావి కొంతవరకు ధ్వంసమైంది. పట్టించుకుంటే మంచి వనరు.. రాజా బావిలోని నీటిని గతంలో గ్రామ ప్రజలతో పాటు, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా తాగేందుకు ఉపయోగించేవారు. ప్రస్తుతం బావి చుట్టూ ముళ్ల పొదలు పెరిగిపోవడంతోపాటు పూడికతో నిండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో నీళ్లు సాధారణంగా అయిపోవని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్నో గ్రామాలకు తాగునీటిని అందించిన ఈ బావికి అధికారులు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావిని అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బావిని మంచినీటి వనరుగా చేసేకుంటే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఆ దిశగా పాలకులు, అధికారులు ఆలోచించాలి. -
తాగునీటికి రోడ్డెక్కిన మహిళలు
జూలూరుపాడు : తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు గుండెపుడి గ్రామంలో ఆందోళనకు దిగారు. గుండెపుడితండా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం పబ్లిక్ ట్యాప్ను ఓ వ్యక్తి పగలగొట్టి తీసివేయడంతో మూడు రోజుల నుంచి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో తండా ప్రజలకు తాగడానికి బిందెడు నీళ్లు దొరకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు భీష్మించుకొని కూర్చున్నారు. ఈఓపీఆర్డీ జగదీశ్వరరావు, ఏఎస్సై కృష్ణారావు, పోలీసు సిబ్బంది వచ్చి ఆందోళన విరమించాలని కోరినా మహిళలు అంగీకరించలేదు. సర్పంచ్ రావాలి, తాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండుటెండను సైతం మహిళలు లెక్క చేయకుండా రోడ్డుపై ధర్నా కొనసాగించారు. సమస్యను పరిష్కరిస్తానని సర్పంచ్ విజయనిర్మల హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. రాస్తారోకో సుమారు గంటకు పైగా జరగడంతో జూలూరుపాడు–చండ్రుగొండ మధ్య వాహనాల రాకపోకలు నిలిచి పోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పాల్వంచలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయింపు పాల్వంచ : పట్టణంలోని తెలంగాణనగర్ కాలనీలో మంచినీరు రావడం లేదని, తక్షణం అధికారులు స్పందించి తాగునీరు అందించాలని కాలనీ మహిళలు ఆందోళన చేశారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ వేసవికాలంలో తాగునీరు లేక అల్లాడి పోతున్నామని, మున్సిపాలిటీ నుంచి పంపించే ట్యాంకర్లు ఒకరోజు వస్తే మరొక రోజు రావడం లేదన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం మంచినీటి పైపులైన్ల జాయింట్లు తొలగించారని, వీటిని నాలుగు నెలలుగా అమర్చక పోవడంతో మంచి ఎద్దడి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో కొంగ ఉమ, ఉస్సేన్బీ, రాధ, వెంకటరమణ, శకుంతల, మల్లిక పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్కుమార్పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement