-
రొమాంటిక్ లవ్ స్టోరీగా 'జస్ట్ ఏ మినిట్'.. లిరికల్ సాంగ్ రిలీజ్!
అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం "జస్ట్ ఎ మినిట్". ఈ సినిమాను రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్, ప్రకాష్ ధర్మపురి నిర్మించారు. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నువ్వంటే ఇష్టం అనే లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పూర్ణాస్ యశ్వంత్ మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్, టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ.. డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ను కూడా రిలీజ్ చేయబోతున్నాం.'మని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. 'ఫస్ట్ లుక్, టీజర్కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ ఏ మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని అన్నారు. ఈ చిత్రంలో ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మకంగా ‘జస్ట్ ఏ మినిట్’
అభిషేక్ పచ్చిపాల, నాజియాఖాన్, వినీషా, ఇషిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంతో కలిసి డా.ధర్మపురి ప్రకాష్ నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ పనుల్లో ఉంది. ఇటీవల ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందించారు. త్వరలో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేసు నమోదు) దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన అభిషేక్ పచ్చిపాల ఇందులో హీరోగా చక్కని నటన కనబర్చారు. ఆయన సినిమా సినిమాకు డిఫరెంట్ జానర్ కథలు ఎంచుకుంటున్నారు. ‘ఏడు చేపల కథ’తో ఎంటర్టైన్మెంట్, ‘వైఫై’ చిత్రంతో ఫ్యామిలీ డ్రామాతో అలరించారు. ఇప్పుడీ చిత్రంతో కామెడీ, లవ్ ఎంటర్టైనర్తో అలరించనున్నారు. జబర్దస్త్ ఫణి కామెడీ హైలైట్గా ఉంటుంది. టీజర్కు చక్కని స్పందన వస్తోంది. ‘బుల్లెట్ బండి’తో పాపులర్ అయిన ఎస్.కె.బాజీ ఈ చిత్రానికి చక్కని బాణీలు అందించారు. పదహారేళ్ళ రేయాన్ మహ్మద్ ఈ చిత్రం టైటిల్ ట్రాక్ చేయడం విశేషం. ఇందులో ఉన్న నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. -
‘జస్ట్ ఏ మినిట్’ అంటున్న అభిషేక్
‘ఏడుచాపల కథ’ ఫేమ్ అభిషేక్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘జస్ట్ ఏ మినిట్‘. క్లీన్ కామెడీ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కార్తీక్ ధర్మపురి సహకారంతో ‘పూర్ణస్ యస్వంత్’ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాజియా, జబర్దస్త్ ఫణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘బులెట్ బండి’ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఎస్ కే బాజీ’ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి టైటిల్ మ్యూజిక్ 17 ఏళ్ల రేయాన్ అనే బాలుడు మ్యూజిక్ ఇవ్వటం విశేషం. ఇప్పటికే, విడుదలైన మోషన్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశ లో ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్ రీలిజ్ చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement