-
అవగాహన పెంచుకోండి...
భావి లాయర్లకు సీజేఐ జస్టిస్ ఖేహర్ పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: సమాజాన్ని అర్థం చేసుకోలేని న్యాయవాది తన వృత్తిలో రాణించలేడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తి పొందినా, స్వాతంత్య్రం నుంచి లభించే నిజమైన కీర్తి, ప్రతిష్టలను ఇంకా చూడలేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ, పీహెచ్డీలు పూర్తిచేసిన వారికి పట్టాలు ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేసిన మొత్తం 25 బంగారు పతకాలు, 5 నగదు బహుమానాల్లో సీవీ ఆరాధన అనే విద్యార్థినికి 11 బంగారు పతకాలు దక్కాయి. అనంతరం సీజేఐ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘సమాజంలో పరిణామాలను అర్థం చేసుకోలేకపోతే న్యాయవాద వృత్తిలో రాణించలేరు. మీరు ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుండాలి’ అని అన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయం చాన్స్లర్ తదితరులు పాల్గొన్నారు. -
పరారీలోనే పదవీ విరమణ
జస్టిస్ కర్ణన్ మరో రికార్డు న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్(62) సోమవారం పదవీ విరమణ సందర్భంగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్ కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్కు పశ్చిమ బెంగాల్ డీజీపీ సోమవారం లేఖ రాశారు. ఆదినుంచీ వివాదాస్పదమే.. వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్ను గతేడాది మార్చి 11న కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ ఆదేశాల్ని కర్ణన్ ధిక్కరించడంతో ఆయనకు ఎలాంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్కు సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఈ ఏడాది మార్చి 10న బెయిలబుల్ వారంట్ జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన కర్ణన్ తన అధికారాల్ని పునరుద్ధరించాలని కోరగా కోర్టు తిరస్కరించింది. తనను జైల్లో పెట్టినా బెంచ్ ముందు హాజరుకానని కర్ణన్ స్పష్టం చేయడంతో.. అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ మే 4న కర్ణన్ లేఖ ఇవ్వడంతో పాటు సుప్రీం న్యాయమూర్తుల్ని అరెస్టు చేయాలంటూ తన ఇంటి నుంచే ఆదేశాలు జారీచేశారు. -
విశ్వసనీయత తగ్గుతోంది!
పేదలకు న్యాయసహాయం అందకపోవడం వల్లేనన్న సీజేఐ న్యూఢిల్లీ: పేదలకు, నిరక్షరాస్యులకు సకాలంలో న్యాయ సహాయం అందకపోవడం వల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఖేహర్ అన్నారు. పారా లీగల్ వాలంటీర్స్ (పీఎల్వీ) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సీజేఐ ఈ మేరకు అభిప్రాయపడ్డారు. సాధారణ, నిస్స హాయ వ్యక్తుల బాధలు తొలగించడానికి, వారికి జరిగే అన్యాయాన్ని రూపుమాపేం దుకు న్యాయ వ్యవస్థ తోడ్పడే విధంగా పీఎల్వీలు సహకరిస్తారని అన్నారు. పీఎల్వీల రెండు రోజుల జాతీయ సదస్సును సీజేఐ జస్టిస్ ఖేహర్ శనివారం ప్రారంభించి, ప్రసంగించారు. ‘న్యాయమూర్తుల పవిత్ర తీర్పు’ కంటే వలంటీర్లు పేదలకు చేసే సేవే ‘అత్యుత్తమమైనది’ అని ఆయన అన్నారు. పీఎల్వీ పథకం కింద సమర్థులైన పీఎల్వీలు గ్రామస్తులకు సహాయపడతారని అన్నారు. వారు న్యాయవాదులు కాకున్నా సమర్థులైన న్యాయనిపుణులు వారికి చట్టాలు, న్యాయవ్యవస్థపై అవగాహన కల్పిస్తారని అన్నారు. పీఎల్వీల పరిజ్ఞానానికి అందని వివాదాలుంటే వాటి పరిష్కారానికి దగ్గరలోని లోక్ అదాలత్ వంటి లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తారని పేర్కొన్నారు. -
ఎన్నికల హామీలకు మీరే జవాబుదారీ
రాజకీయ పార్టీలకు సీజేఐ జస్టిస్ ఖేహర్ హితవు న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పించడం.. ఆ తర్వాత వాటిని నెరవేర్చకపోవడం రాజకీయ పార్టీలకు పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ అన్నారు. మేనిఫెస్టోలు చిత్తు కాగితాలుగా మారుతున్నాయన్నారు. ఎన్నికల సమయాల్లో ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ‘ఎన్నికల సమస్యలు–ఆర్థిక సంస్కరణలు’ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమలు సాధ్యం కాని హామీలను గుప్పిస్తూ పార్టీలు అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కుంటిసాకులు చెబుతున్నాయని పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒకవేళ ప్రజలు మర్చిపోయినా.. రాజకీయ పార్టీలను వాటికి జవాబుదారీగా చేయాలని అన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోలు రాజ్యాంగ లక్ష్యాలకు దూరంగా ఉన్నాయని, బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా లేవని చెప్పారు. సమాజంలో గ్రూపులను పోగుచేయడం, రాజకీయం చేయడం చుట్టూనే పార్టీలు తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి కులాన్ని ఒక్కో నియోజక వర్గంలో ఒక్కోలా వాడుకుంటున్నారని ఖేహర్ అన్నారు. పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెడుతున్నందువల్ల వారు పెద్దగా ఆలోచించకుండా ఓట్లేస్తున్నారనీ, అందువల్లే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, అస్థిర ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీలు వాగ్దానాలను నెరవేర్చినా, నెరవేర్చకపోయినా తర్వాతి ఎన్నికల సమయంలో అది పెద్ద విషయమే కాకుండా పోయిందనీ, ఎందుకంటే దాదాపుగా అన్ని పార్టీలు అలాగే వ్యవహరిస్తూ వాగ్దానాలను నెరవేర్చకపోవడానికి కుంటిసాకులను చెప్పుకొంటున్నాయని ఆయన అన్నారు. -
మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..
⇒ జడ్జీల నియామకాల విధివిధానాల మార్పునకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత ⇒ మా సిఫారసును జాతీయ భద్రతా కారణంతో తిరస్కరించలేరు ⇒ ఆధారాలిస్తే మేమే ఆ పని చేస్తాం.. మీకు వీటో అధికారం ఇవ్వలేం ⇒ అలా ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది ⇒ ఎంఓపీపై కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని విధివిధానాల్ని మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన పలు సూచనలను, ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని కొలీజియం తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా న్యాయ మూర్తుల పోస్టుకు సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరి పేరునైనా జాతీయ భద్రత కారణంతో తిరస్కరించే వెసులుబాటు తమకు కల్పించా లన్న కేంద్ర సూచనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. అలాగే న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లపై పరిశీలన జరిపేందుకు శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలన్న సూచననూ తిరస్కరిం చింది. న్యాయమూర్తుల మీద వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కొలీజియంలో సభ్యులు కాని ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ తోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారి వయోపరిమితి విషయంలో మాత్రం కేంద్రం సిఫారసులను ఆమోదించింది. ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి లేఖద్వారా తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలికే దిశగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్జేఏసీ)ను కేంద్రం తీసుకురావడం, దీనిపై పిటిషన్ దాఖలవగా.. ఎన్జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం విదితమే. కొలీజియమే న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధివిధానాల తాలూకు మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్రం ఎంఓపీని తయారుచేసి సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచింది. ఈ ఎంఓపీపై కేంద్రానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో న్యాయమూర్తుల నియామకాల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఎంఓపీపై జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీజే జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై కేంద్రం చేసిన పలు సూచనలు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించింది. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి తీరాల్సిందే.. న్యాయమూర్తుల పోస్టుకు తాము సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తి నియామకం జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని కేంద్రం భావిస్తే, అందుకు ఆధారాలను తమ ముందుంచితే కొలీజియం వాటిని ఎన్నటికీ పక్కనపెట్టదని తెలిపింది. కానీ జాతీయ భద్రతా కారణంతో కేంద్రం తమ సిఫారసులను వీటో చెప్పడానికి వీల్లేదని కొలీజియం తేల్చిచెప్పింది. ఇందుకు అనుమతినిస్తే న్యాయ నియామక ప్రక్రియ మొత్తం రాజకీయజోక్యంతో నిండిపోతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి స్పష్టంచేసింది. అలాగే న్యాయమూర్తుల పేర్లపై విచారణ జరిపేందుకు ఎన్నో ఏళ్లనుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం సక్రమంగానే ఉందని, అందువల్ల శాశ్వత సెక్రటేరియట్ ఏర్పాటు ఎంతమాత్రం అవసరం లేదంది. కొలీజియం తన సిఫారసులను మరోసారి కేంద్రానికి పంపినప్పుడు వాటిని కేంద్రం తప్పనిసరిగా ఆమోదించి తీరాల్సిందేనని కూడా స్పష్టంచేసింది. వయోపరిమితికి పచ్చజెండా.. న్యాయమూర్తుల నియామకాలకు పరిగణనలోకి తీసుకునే న్యాయవాదుల కనీస, గరిష్ట వయస్సుల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు కొలీజియం పచ్చజెండా ఊపింది. కనీసం 45 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉన్న న్యాయవాదినే న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. జల్లా జడ్జీల కోటా నుంచి న్యాయమూర్తిగా నియమించే వ్యక్తి గరిష్ట వయస్సు 58 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదననూ కొలీజియం ఆమోదిం చింది. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement