-
నా వెంటే... ఓరుగల్లు నీతి, నిజాయితీ
జస్టిస్ నర్సింహారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా సాహిత్య, సాంసృ్కతిక, కళలకు నిలయమని.. రామప్ప దేవాలయ నిర్మాణ కళకు ప్రపంచంలోనే సరితూగే మరో నిర్మాణం లేదని జస్టిస్ నర్సింహారెడ్డి అన్నారు. ఇక్కడి సామాజిక సంబంధాలు, ప్రతిస్పందన లు, మానవత్వం పునాదిగా ఉంటాయని, బమ్మెర పోతన రచనల నుంచి నేర్చుకున్న నిబ ద్ధత, నిజాయితీ ఎల్లప్పుడూ తన వెంటే ఉం టాయని ఆయన పేర్కొన్నారు. పాట్నా హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తు న్న నర్సింహారెడ్డిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో సోమవా రం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల నడుమ బార్ అసోసియేషన్ బాధ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు నర్సింహారెడ్డిని సభా ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ అధ్యక్షతన సన్మాన సభ జరిగింది. సేవా కార్యక్రమాలు చేపట్టాలి న్యాయవాదులు, న్యాయమూర్తులు.. సమస్య ల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. గ్రామీణ జీవన నేపథ్యం ఉన్న వ్యక్తులు సామాజిక సేవ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. సన్మార్గంలో సంపాదించిన సొమ్ముతోనే సంతృప్తి లభిస్తుందని, అక్రమ మార్గంలో ప్రయాణం మొదలుపెడితే పతనం ఖాయమని తెలిపారు. అవసరానికి మించి ఆస్తులు ఉన్న వారు ఆకారపు, కొమురవెళ్లి వంశస్తులను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. కాగా, తాను ఎక్కడికి వెళ్లినా వరంగల్ జిల్లా ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించే లా పనిచేస్తానని, జిల్లా న్యాయవాదులకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన గుడిమల్ల రవికుమార్, బార్ కౌన్సిల్ సభ్యుడు సహోదర్రెడ్డి తదితరులు మాట్లాడుతూ పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్తున్న నర్సింహారెడ్డి త్వరలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావాల ని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా ప్రధాన జడ్జి మఠం వెంకటరమణ, అదనపు జిల్లా జడ్జిలు నర్సింహులు, కృష్ణయ్య, సాల్మన్రాజ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సూరం నర్సింహస్వామి, ఓరుగంటి కోటేశ్వర్రావు, సందసాని రాజేంద్రప్రసాద్, కొలునూరి సుశీల, సుదర్శన్, ఎం.మంజుల, సురేష్, ఆశీర్వాదం, దామోదర్, వివి.గిరి, వివిధ ప్రాం తాల న్యాయవాదులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 6 తేదిన మెగా లోక్ అదాలత్!
హైదరాబాద్: లోక్ అదాలత్ లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహరెడ్డి అన్నారు. మెగా లోక్ అదాలత్ పై జస్టిస్ నరసింహరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6 తేదిన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సివిల్ కేసులను కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు. కేసుల సంఖ్యను బట్టి అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ ఉంటుందని ఆయన తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లోక్ అదాలత్ లో 1.11 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని జస్టిస్ నర్సింహరెడ్డి తెలిపారు. ఎఫ్ఐఆర్ దశలో ఉన్న కేసులను మెగా లోక్ అదాలత్ లో పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఏపీలో 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని జస్టిస్ నర్సింహరెడ్డి వెల్లడించారు. -
చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుంది
నిజామాబాద్, న్యూస్లైన్: సమాజంలో నేర ప్రవృత్తిని అరికట్టడానికి చట్టాలు చేయలేని పని సంస్కారం చేస్తుందని, ప్రతి ఒక్కరిలో వ్యక్తిత్వ వికాసం జరగాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. మన సంస్కృతి చాలా గొప్పదని, స్త్రీ జాతిని గౌరవిస్తుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టంపై జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్లలపై లైంగిక దాడులకు నైతిక విలువల పతనమే కారణమని తెలిపారు. ప్రభుత్వ విధానాల కారణంగా మద్యం అమ్మకాలు పెరిగి మత్తులో అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాలు, సీరియళ్లు మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
టిష్యూ బ్రెడ్..అచ్చం రుమాలి రోటీ లా..!
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్ రిచెస్ట్ యూట్యూబర్...
ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
స్టేషన్ మాస్టర్కు నిద్రొచ్చింది.. లోకో పైలెట్ హారన్ మోగించినా..
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement