-
రిలీజ్కు ముందే ప్రపంచ రికార్డు కొట్టిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకుడు కె. భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 3.6.9. కేవలం 81 నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సాధించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ మాదవ్ ఈ చిత్ర షూటింగ్ను 24 కెమెరాలతో 81 నిమిషాల్లో పూర్తి చేశారు. నటుడు పీజీఎస్ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో బ్లాక్ శాండీ, అంగయర్ కన్నన్, సుకై ల్ ప్రభు, కార్తీక్, గోవిందరరాజన్, సుభిక్ష, నిఖితా, బబ్లూ సహా 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు విదేశానికి చెందిన వారు సైతం నటించడం విశేషం. మారీశ్వరన్ ఛాయాగ్రహణం, కార్తీక్ హర్ష సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. 600 మంది సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా షూటింగ్ను నాలెడ్జ్ ఇంజినీరింగ్ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్ సమక్షంలో చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. కాగా అమెరికాకు చెందిన వరల్డ్ రికార్డ్ యూనియన్ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు తెలిపారు. సైన్స్ ఇతివృతంగా రూపొందిన ఈ చిత్రం గురించి నటుడు కె.భాగ్యరాజ్ వివరిస్తూ.. 81 నిమిషాల్లో రూపొంది ప్రపంచ రికార్డు సాధించిన 3.6.9 చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు శివ మాధవ్, నిర్మాత పీజీఎస్ను అభినందిస్తున్నానన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని భాగ్యరాజ్ ఆకాంక్షించారు. చదవండి: నాని నీ రేంజ్ ఏంటి..? వీళ్లందరూ గల్లీ హీరోలా..? -
మహిళా సమస్యల నేపథ్యంలో అరియన్
తమిళ సినిమా: ఎంజీపీ మాస్ మీడియా పతాకంపై నవీన్ నిర్మించిన చిత్రం అరియవన్. యారడి నీ మోహిని, తిరుచిట్రంఫలం వంటి విజయవంతమైన చిత్రాలు దర్శకుడు మిత్రన్ ఆర్.జవహర్ తెరకెక్కించిన తాజా చిత్రం ఇది. నవ జంట ఇషాన్, ప్రణాలి జంటగా నటించిన ఇందులో నటుడు డానియల్ బాలాజీ, సత్యన్, కల్కి రాజా, రమ రమేష్ చక్రవర్తి, కావ్య, సూపర్ గుడ్ సుబ్రహ్మణి, రామన్ తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. వీవీ టీమ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ఒక పాటను సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ రూపొందించడం విశేషం. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని సత్యం సినిమాస్ థియేటర్లో నిర్వహించారు. నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కథానాయకుడిగా పరిచయమైన ఇషాన్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నాను. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్ చిత్రాల్లో మంచి సందేశంతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటాయన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ ఎనర్జీతో బయటికి వస్తారన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు కె. భాగ్యరాజ్ మాట్లాడుతూ అరియవన్ చిత్ర ట్రైలర్ బాగుందని.. అందుకు చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు మిత్రన్ ఆర్. జవహార్ ఇంతకు ముందు దర్శకత్వం వహించిన ఉత్తమ పుత్తిరన్ చిత్రంలో తాను నటించానని, ఆయన చాలా శాంత స్వభావుడు అని పేర్కొన్నారు. నూతన జంటతో చిత్రం చేస్తున్నారంటే అది కచ్చితంగా మంచి కథాచిత్రమే అయ్యి ఉంటుందన్నారు. కొత్తవారితో చిత్రాన్ని చేసిన నిర్మాత నవీన్కు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర హీరో కళ్లల్లో జీవం ఉందని, ఈయన మంచి కథను ఎంచుకొని నటించి విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కె భాగ్యరాజ్కు షాక్, నటీనటుల సంఘం నుంచి తొలగింపు
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) వేటు వేసింది. వివరాలు.. 2019లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నటుడు కె.భాగ్యరాజ్ అధ్యక్షతన శంకర్దాస్ పేరుతో ఓ జట్టు, నటుడు నాజర్ అధ్యక్షతన పాండవర్ జట్టు ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటింగ్ నిలిచిపోయింది. దీనిపై నాజర్ జట్టు రీ పిటీషన్ దాఖలు చేసింది. చదవండి: పూజా ఆ బాడీ పార్ట్కి సర్జరీ చేయించుకుందా? ఆమె టీం క్లారిటీ సుదీర్ఘకాలం జరిగిన ఈ కేసు విచారణ అనంతరం న్యాయస్థానం సంఘం ఎన్నికలు సక్రమమేనని తీర్పు నిచ్చింది. దీంతో నాజర్ వర్గం కార్యనిర్వాహక బాధ్యతలను చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కె.భాగ్యరాజ్, నటుడు ఏఎల్ ఉదయ్ను 6 నెలల పాటు బహిష్కరిస్తున్నట్లు సంఘం కార్యవర్గం శనివారం ప్రకటించింది. ఈ సంఘటన కోలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై నటుడు ఏఎల్ ఉదయ్ స్పందిస్తూ మీడియాకు ఒక లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో వివరణ కోరుతూ మొదట నోటీసులు వచ్చినప్పుడే తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అలాంటిది తమిళ చిత్రంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన కె.భాగ్యరాజ్ను సంఘం నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వడానికి తాను సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. తనను, నటుడు బాబీని తొలగించడం కూడా పెద్ద విషయం కాదని, అయితే దర్శకుడు కె.భాగ్యరాజ్ను తొలగించడం చాలా విచారకరమని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగ్యరాజ్ పోటీ చేసినందుకు ఇది ప్రతీకార చర్యగా భావిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్గ్లింప్స్ ఇలా ప్రశ్నించిన వారందరినీ సంఘం నుంచి తొలగించడం అన్నది సరైన విధానం కాదన్నారు. నటుడు శరత్కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు సభ్యులపై ఎప్పుడు చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రస్తుత సంఘం నిర్వాహకులు ఆరంభం నుంచే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంతకుముందు కూడా పలువురు నాటక కళాకారులను, ఇతర సభ్యులను సంఘం నుంచి తొలగించారని గుర్తు చేశారు. నూతన భవనం ఇప్పటికీ పూర్తి కాలేదని ఏఎల్ ఉదయ ఆరోపించారు. -
వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లే: నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోదీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లో భాగ్యారాజ్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని...తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
నటుడు, డైరెక్టర్ భాగ్యరాజ్కు జీవిత సాఫల్య పురస్కారం
సీనియర్ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ను జీవిత సాఫల్య పురస్కారం వరించింది. వివరాలు.. జాతీయ సినిమా చాంబర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్. కె.కృష్ణన్ ముఖ్యఅతిథిగా ఈ అవార్డును అందజేశారు. జాతీయ సినిమా చాంబర్ అధ్యక్షుడు అన్బు చంద్రం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు జ్ఞాన రాజశేఖరన్ అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ఆకాష్కు, ఉత్తమ విలన్ అవార్డును ఆర్యన్కు.. ప్రత్యేక అవార్డులను నటుడు రమేష్ కన్నా, బాబుగణేశ్, రిషీకాంత్, నటి ఇనియ, అనూకృష్ణకు అందించారు. ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థ అవార్డును సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రతినిధి మనోజ్ దాస్, ఉత్తమ కథా చిత్రాల అవార్డును వి.శేఖర్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు దీనా, ఉత్తమ ఎడిటర్ అవార్డు కె.ఎస్.ప్రవీణ్, ఉత్తమ ఛాయాగ్రహకుడి అవార్డు కేఎస్ సెల్వరాజ్కు దక్కింది. సీనియర్ పాత్రికేయుడు, కలైమామణి అవార్డు గ్రహీత నెల్లై సుందరరాజన్ స్వాగతోపన్యాసం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement