-
‘లంచం లేనిదే పని కావడం లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : నగర పాలక సంస్థ అధికారులపై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం లేనిదే ఏ పని కావడం లేదని మండిపడ్డారు. ప్రతి పేద వాడి దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అధికార టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు చెప్పినట్టు అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అందరికి ఒకేలా పని చేయాలని.. ఇలా వ్యవహరించటం తప్పని.. హితవు పలికారు. అధికారుల తీరు మారకుంటే చూస్తు ఊరుకునేది లేదని బాషా హెచ్చరించారు. -
కడపలో పోలింగ్ ప్రశాంతం
కడప కార్పొరేషన్, న్యూస్లైన్: కడప నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలో 2,71,532 మంది ఓటర్లుండగా 1,70,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.67గా నమోదైంది. ఈ సారి కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే ఈవీఎంలు మొరాయించడం, ఇతరత్రా సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం, సాయంత్రం బాగా జరిగిన పోలింగ్ మధ్యాహ్నం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాల్లో సందడి కనిపించలేదు. గతంలో ఓటు వేస్తున్న చోట కాకుండా వేరే పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకు కూడా వేర్వేరు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. రెండు ఇళ్లకు ఒకే పోలింగ్ కేంద్రం రాలేదంటే ఎంత గంద రగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటర్లకు సాధ్యమైనంత వరకూ దగ్గరగా ఉండే పోలింగ్ కేంద్రాలను కేటాయించాలి. కానీ చాలా వార్డులలో పరిస్థితి ఇందుకు భిన్నంగా జరిగింది. 3వ డివిజన్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. స్లిప్పులున్నవారైతే దూరమైనా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటే శారు. కానీ స్లిప్పులు లేని వారైతే ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టారు. 32వ వార్డు పరిధిలోని బెల్లంమండి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మిషన్ వద్ద వెలుతురు లేకపోవడంతో గుర్తులు కానరాక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పత్తాలేని బీఎల్ఓలు : స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్ఓలు అందజేస్తారని ఎన్నికల అధికారులు తెలిపినా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓల జాడ కానరాలేదు. ఓటర్లు తమ ఓటరు కార్డు పట్టుకుని స్లిప్పులు లేక, పోలింగ్ ఎక్కడో తెలియక సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తమ్మీద మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
ఎఫ్ఎస్టీపీని పరిశీలించిన ప్రతినిధి
ఈదురుగాలుల బీభత్సం
11న జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు న్యాయం
ఉల్లి క్వింటా రూ.2,400
అధికారం వెంటే నేతలు..!
పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement