-
ఎమ్మెల్యే వెంకట్రావ్కు తీవ్ర అస్వస్థత
విజయవాడ: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని కాగిత భావించారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయన అనుచరులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆదివారం చంద్రబాబు ప్రమాణస్వీకార సభకు వెళ్లవద్దని పట్టుబట్డారు. ఈ పరిస్థితుల్లో వెంకట్రావ్ ఒత్తిడికి లోనుకావడంతో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. సోమవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు విజయవాడలోని హార్ట్కేర్ సెంటర్కు తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిన్నటి నుంచి వెంకట్రావ్ ఆహారం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన వెంకట్రావ్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'కృష్ణా' నేతలకు కలిసిరాని విప్ పదవి
మచిలీపట్నం: నేతలకు సెంటిమెంట్లు ఉన్నా.. లేకున్నా.. కొన్ని సందర్భాల్లో సెంటిమెంట్లు వెంటాడుతూనే ఉంటాయి. అలా జరగడం యాథృచ్చికమే అయినా వరుసగా ఒకేవిధంగా జరిగితే అదే సెంట్మెంట్గా మారుతోంది. ఇదే తరహాలో జిల్లాకు చెందిన కీలక నేతలకు విప్ పదవి అచ్చి వచ్చినట్టు లేదు. ముగ్గురు నాయకులు విప్ పదవి చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ బలపడింది. తాజాగా ప్రభుత్వ విప్ పదవి నిర్వహించిన బందరు తాజా మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఓటమితో జిల్లాలో దీనిపై చర్చసాగుతోంది. గతంలో టీడీపీ నుంచి కాగిత వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి సామినేని ఉదయభాను విప్లుగా పనిచేసి ఓటమిపాలైన వారే. మొదట ‘కాగిత’... మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన కాగిత వెంకట్రావు చంద్రబాబు హయాంలో విప్గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా కాగిత పనిచేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి కాగిత ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో మల్లేశ్వరం రద్దయి పెడన నియోజకవర్గం ఏర్పడింది. పెడన నుంచి 2009 ఎన్నికల్లో పోటీచేసిన కాగిత రెండోసారి కూడా ఓటమిని చవిచూశారు. ప్రస్తుత ఎన్నికల్లో కాగిత పెడన ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విప్ పదవి నిర్వహించిన కాగితకు పదేళ్ల తర్వాత మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది. ఉదయభాను పరిస్థితి అంతే.. జగ్గయ్యపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సామినేని ఉదయభాను వైఎస్ ప్రభుత్వంలో విప్గా పనిచేశారు. ఆ తర్వాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయభాను ఓటమిని చవిచూశారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే ఉదయభాను మంత్రి అవుతారని ఆయన అభిమానులు, జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ నేతృత్వంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడినా ఉదయభాను మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేదు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ఉదయభాను బలపరిచారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన జిల్లాలో మంచి పట్టు సాధించారు. ఈసారి ఎన్నికల్లో ఆయన జగ్గయ్యపేట నుంచి కచ్చితంగా గెలుస్తారని రాజకీయ పరిశీలకులు ధీమాగా చెప్పారు. టీడీపీకి దీటైన పోటీ ఇచ్చిన ఆయన అనూహ్యంగా ఓటమిని చవిచూశారు. మూడో నాయకుడు ‘పేర్ని’ మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పేర్ని వెంకట్రామయ్య(నాని) 1999 ఎన్నికల్లో మాజీ మంత్రి నడకుదుటి నర్సింహారావు చేతిలో ఓటమిని చవిచూశారు. అనంతరం 2004 ఎన్నికల్లో నడకుదుటిపై, 2009 ఎన్నికల్లో నడకుదుటి అల్లుడు కొల్లు రవీంద్రపై నాని విజయం సాధించారు. దీంతో నానికి ప్రభుత్వ విప్ పదవి లభించింది. వైఎస్ మరణంతో జగన్మోహన్రెడ్డిపై జరుగుతున్న కుమ్మక్కు కుట్రలు సహించలేక, పాలకులు ప్రజా సంక్షేమం, అభివృద్ధిని విస్మరించడాన్ని తట్టుకోలేక నాని తన విప్ పదవికి రాజీనామా ప్రకటించి వైఎస్సార్ సీపీలో చేరారు. పదవే పరమావధిగా భావించే నేతలు ఉన్న ఈ రోజుల్లో నాని కీలకమైన విప్ పదవితోపాటు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. పదవుల కంటే విలువలు, విశ్వసనీయత ముఖ్యమని భావించే నాని నిత్యం ప్రజల్లోనే ఉండేవారు. అటువంటి నాయకుడు ఓటమిని చవిచూడటం బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో ప్రభుత్వ విప్లుగా పనిచేసి విశేష ప్రజాదరణ పొందిన నేతలు సైతం ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement