-
‘సాగు’తో తొలి అడుగు!
సాక్షి, హైదరాబాద్: రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కె.చంద్రశేఖర్రావు తొలి అధికారిక సమీక్షను సాగునీటి ప్రాజెక్టులతో ఆరంభించనున్నారు. శనివారం ఉదయం ప్రగతిభవన్లో కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలపై సమీక్షించనున్నారు. సమీక్షకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని పనుల పురోగతి, అవాంతరాలు, కోర్టు కేసులు, అవసరమయ్యే బడ్జెట్ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరంపై ఫోకస్.. గోదావరిలో రాష్ట్రానికి ఉన్న నిర్ణీత వాటా నీటిని వినియోగంలోకి తెచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్హౌస్ల పనులు ముగింపుదశకు వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో మొత్తంగా 85 గేట్లు అమర్చాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే 6 గేట్లను అమర్చారు. ఇక్కడి పంప్హౌస్లో 3 మోటా ర్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తయింది. అన్నారం, సుందిళ్ల పంప్హౌస్ల పరిధిలో రెండేసి మోటార్లు అమర్చే ప్రక్రియను పూర్తి చేశారు.ట్రయల్రన్కు అంతా సిద్ధం చేసినా, గ్రావిటీ కెనాల్లో పనులకు ఆటంకం కలుగుతుందని నిలిపివేశారు. దీనిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 8లోని మోటార్లు సిద్ధంగా ఉన్నా, ప్యాకేజీ–7లో టన్నెల్లో లైనింగ్పనులు జరుగుతున్నాయి. ఈ పనుల పూర్తిపై సీఎం లక్ష్యాలను విధించనున్నా రు. వచ్చే మార్చి నాటికి ట్రయల్రన్ పూర్తి చేసి, జూన్లో ఖరీఫ్ మొదలయ్యే నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎల్లంపల్లి దిగువకు తరలించే ప్రణా ళికలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాజెక్టు కోసం అవసరమయ్యే నిధులపై అధికారులు వివరా లు సిద్ధం చేశారు. ప్రాజెక్టుకు రూ.33 వేల కోట్ల మేర రుణాలు అవసరమని లెక్కించగా, ఇందులో ఇప్పటి కే వివిధ బ్యాంకుల నుంచి రూ.27,240 కోట్ల రుణా లు తీసుకున్నారు. వీటిలో ఇప్పటికే రూ.22,790 కోట్లు ఖర్చు పెట్టారు. మరో రూ.5,700 కోట్ల మేర రుణాలకు మాత్రమే అవకాశం ఉంది. మిగతా నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై సీఎం పలు సూచనలు చేసే అవకాశం ఉంది. సీతారామ ఎత్తిపోతల కింద 70.40 టీఎంసీలతో 7 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో పనులు చేపట్టినా అవి ముం దుకు కదల్లేదు. సీతారామ ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రూ.832 కోట్ల మేర నిధుల సేకరణ జరగ్గా, మున్ముందు అవసరమైన నిధులు, ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన అనుమతులపై శనివారం నాటి భేటీలో చర్చించనున్నారు. -
తమిళనాడులో మరో ఘాతుకం
ఆరో తరగతి విద్యార్థిని హత్య మృతదేహాన్ని పూడ్చిపెట్టిన వైనం గొంతు కోసుకుని నిందితుడి ఆత్మహత్యాయత్నం చెన్నై: చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతి హత్య ఘటన మరువక ముందే, ఆరో తరగతి విద్యార్థి ఓ కిరాతకుడి చేతిలో హతమైంది. మంగళవారం ఈ ఘటన మానామధురై సమీపంలో కలకలం రేపింది.శివగంగై జిల్లా మానామధురై సమీపంలోని గణపతి తలవాయి గ్రామానికి చెందిన కరుప్పయ్య, జయ దంపతులకు కాళేశ్వరి(11) అనే కుమార్తె ఉంది. కరుప్పయ్య ఇటీవల మరణించడంతో కుమార్తె కాళేశ్వరితో కలిసి జయ నివసిస్తుంది. మేలనట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో కాళేశ్వరి ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన కాళేశ్వరి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన జయ ఇరుగు పొరుగు వారిని విచారించింది. పాఠశాల పరిసరాల్లో ఆరా తీయగా, కార్తీక్(25) అనే వ్యక్తి కాళేశ్వరిని మోటారు సైకిల్పై ఎక్కించుకు వెళ్లినట్టు తెలిసింది. తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న కార్తీక్ కోసం కుటుంబీకుల వద్ద జయ ఆరా తీసింది. వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. చివరకు అతడి సెల్ఫోన్కు ఫోన్ చేసింది. దీంతో కాళేశ్వరి గొంతు కోసి హత్య చేశానని, ఆమెను పూడ్చి పెట్టి, తాను చచ్చిపోతున్నట్టు సమాధానం ఇచ్చి కార్తీక్ ఫోన్ కట్ చేశాడు. దాంతో తీవ్ర ఆందోళనకు గురైన జయ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మానా మధురై పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మేలనట్టూరు గ్రామానికి సమీపంలోని చెరువు గట్టు వద్ద కార్తీక్ గొంతు కోసుకుని కొన ఊపిరితో ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని చికిత్స నిమిత్తం శివగంగై ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా పోలీసులు కాళేశ్వరిని పూడ్చి పెట్టిన ప్రదేశం కోసం గాలించారు. చివరకు మంగళవారం వేకువ జామున నాలుగున్నర గంటల సమయంలో ఆ స్థలాన్ని గుర్తించారు. ఖననం చేయబడ్డ కాళేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానామధురై ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడు స్పృహలోకి వస్తే గానీ, ఈ ఘాతుకం వెనుక గల కారణాలు తెలియరావని మానా మధురై పోలీసు ఉన్నతాధికారి వనిత వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని జయ బంధువులు భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement