-
పాతబస్తీ: 70 కోట్లు చేసే భూమిపై ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడ కాళికామాత దేవాలయంకు సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని రూ. 70 కోట్ల విలువ చేసే 7 ఎకరాల 13 గుంటల స్థలం ఘర్షణకు దారితీసింది. దేవాదయశాఖకు చెందిన స్థలాన్ని.. ఓ వ్యక్తి ఆ స్థలం నాదంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అర్డర్లు తీసుకోవడం, ఘటనా స్థలంలో పోలీసుల సమక్షంలో నిర్మాణాలు చేపడుతుండడంతో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకుల్ని, మహిళల్ని, వృద్ధుల్ని ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాగా, 1951లో ఈ స్థలాన్ని దేవాదయశాఖ అధీనంలోకి తీసుకొని ఇప్పటివరకు 11 సార్లు వేలం పాట వేస్తున్నట్లు ప్రకటనలు చేశారు. ఒకసారి వేలం పాట కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో వేలం పాటలో ధర తక్కువగా వచ్చిందని సీపీఐ నాయకులు దేవాదయ శాఖ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించడంతో వేలం పాట రద్దు చేశారు. అప్పటి నుంచి రాని వ్యక్తి తాజాగా ఆ స్థలం ఆలయ ట్రస్టీ తనకు అమ్మిందని ఆలయ భూముల్లో చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మిస్తుండగా బీజేపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు. నా భూముల్లో నేను నిర్మాణాలు చేసుకుంటుంటే స్థానికులు అడ్డు పడుతున్నారంటూ ఆ వ్యక్తి సిటీ సివిల్ కోర్టు నుంచి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అర్డర్లు తీసుకొచ్చారు. దీంతో బుధవారం పోలీసులు పెద్ద ఎత్తున ఆలయస్థలం వద్దకు చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి అక్కడకు చేరుకొని అడ్డుకోవడంతో ఘర్షణకు దారితీసింది. చదవండి: (నిజాంపేట్లో అపార్ట్మెంట్లకు ఏమైంది!) -
తల్లీకూతుళ్లపై హత్యాయత్నం, చిన్నారి మృతి
నల్లగొండ: చిన్నారి సహా తల్లిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ కాళికామాత గుడి వద్ద ఓ ఇంట్లో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి మృతిచెందగా, తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయితే భర్తపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement