-
ఐపీఓకు కల్యాణ్ జువెలర్స్
కేరళ ఆధారిత ఆభరాణాల రిటైల్ దిగ్గజం కల్యాణ్ జువెలర్స్ ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఐపీఓ ఇష్యూకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్లో ఐపీఓ అనుమతుల కోసం సెబీకి ముసాయిదా ప్రణాళిక పత్రాలను సమర్పించనుంది. కోవిడ్-19 వ్యాధి తగ్గుముఖం పట్టిన తర్వాత దేశవ్యాప్తంగా క్రమంగా ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చనే అంచనాలతో ఐపీఓ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. కల్యాణ్ జువెలరీస్ ప్రాథమిక, సెంకడరీ మార్కెట్లలో షేర్ల ఇష్యూ జారీ ద్వారా రూ.1,600-రూ.1,800కోట్ల నిధులను సమీకరించాలని చూస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీకి గణనీయమైన వినియోగదారులు ఉన్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగం నెమ్మదిగా పుంజుకోవడం కంపెనీకి విశ్వాసాన్ని ఇచ్చింది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. వాస్తవానికి కంపెనీ 2018లోనే ఐపీఓకు రావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఐపీఓ వాయిదాపడింది. యాక్సిస్ క్యాపిటల్, సిటి, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సెబీ క్యాపిటల్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఐపీఓ కోసం పనిచేస్తున్నాయి. ఐపీఓ ద్వారా వార్బర్గ్ పిన్కస్ కొంతవాటాను తగ్గించుకోనుంది. కంపెనీకి కూడా రుణభారాన్ని తగ్గనుంది. కల్యాణ్ జువెలరీస్లో వార్బర్గ్ పిన్కస్కు 2019 సెప్టెంబర్ నాటికి 30శాతం వాటాను కలిగి ఉన్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గణాంకాలు చెబుతున్నాయి.సెబీ, స్టాక్ ఎక్చ్సేంజ్ల క్లియరెన్స్ లాంటి అవసరమైన ఆమోదాలను పొందిన తర్వాత వచ్చే ఏడాది జనవరి-మార్చి ఐపీఐ ప్రారంభం కావచ్చు. కల్యాణ్ జువెలర్స్కు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 135 షోరూమ్లు, 328 విక్రయశాలున్నాయి. అలాగే 5దేశాల్లో బ్రాంచులున్నాయి. -
20 లక్షల కస్టమర్లకు చేరువయ్యాం..
కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్ వీరిలో 90 శాతం మంది పాతవారే - మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నాం - 2015-16లో రూ.13,000 కోట్ల టర్నోవర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కేరళలోని త్రిస్సూర్లో 23 ఏళ్ల క్రితం ఒక స్టోర్తో ప్రారంభమైన కల్యాణ్ జువెల్లర్స్ ప్రస్థానం ఇప్పుడు దేశ సరిహద్దులను చెరిపేసింది. విదేశీ కస్టమర్లకూ పుత్తడి వెలుగులను విజయవంతంగా పంచుతోంది. ఈ వెలుగులు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ను సైతం ఆకట్టుకునేలా చేశాయి. వార్బర్గ్ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టిందంటే సంస్థ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 20 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకుందీ ఆభరణాల సంస్థ. ఇదే ఊపుతో ఇతర రాష్ట్రాలతోపాటు మరిన్ని దేశాల్లో అడుగు పెట్టబోతున్నామని అంటున్నారు కల్యాణ్ జువెల్లర్స్ సీఎండీ టి.ఎస్.కల్యాణరామన్. సంస్థ భవిష్యత్ ప్రణాళిక, చేపట్టిన కార్యక్రమాలు, పరిశ్రమ తీరుతెన్నులను సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కల్యాణ్ జువెల్లర్స్ గురించి వివరిస్తారా? భారత్లో 72 స్టోర్లను నిర్వహిస్తున్నాం. యూఏఈలో 10, కువైట్లో 3 ఔట్లెట్లు ఉన్నాయి. బంగారు ఆభరణాలకు బీఐఎస్ ధ్రువీకరణ పరిచయం చేసింది తొలుత మేమే. పారదర్శకత కోసం ఆభరణం పూర్తి వివరాలతో ప్రైస్ ట్యాగ్ను తీసుకొచ్చాం. ధ్రువీకరణ కలిగిన వజ్రాలను అందుబాటు ధరలో విక్రయిస్తున్నాం. క్యాష్ బ్యాక్, బై బ్యాక్ ఆఫర్లనూ నిర్వహిస్తున్నాం. మహిళలు అత్యధిక కస్టమర్లుగా ఉన్న ఆభరణాల రంగంలో పురుషులను ప్రచారకర్తలుగా నియమించాం. 20 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం. వీరిలో 90 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. కల్యాణ్ పారదర్శక వ్యాపారానికి ఇది నిదర్శనం. కొత్తగా ఏఏ దేశాలకు విస్తరిస్తున్నారు? ఆభరణాల తయారీ, పంపిణీ రంగంలో భారత్లో అగ్రశ్రేణి సంస్థగా నిలిచాం. మార్చికల్లా మరో 15 స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో స్టోర్ల సంఖ్య 100 కానుంది. ఖతార్లో అడుగు పెట్టనున్నాం. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లో ప్రవేశించనున్నాం. వచ్చే ఏడాది సింగపూర్, మలేషియాల్లో దుకాణాలను తెరుస్తాం. విస్తరణకుగాను 2015-16లో రూ.800 కోట్లు వ్యయం చేస్తాం. ఇ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించే ఆలోచన ఉంది. మై కల్యాణ్ స్టోర్ల విస్తరణ ఏమైనా ఉందా? కస్టమర్ సర్వీస్ ఔట్లెట్లను తొలిసారిగా ప్రారంభించిన ఘనత మాదే. మై కల్యాణ్ పేరుతో 600 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఆభరణాల కొనుగోలు, పథకాలు, బీమా, వేడుకలకు ముందస్తు కొనుగోలు ప్రణాళిక, గిఫ్ట్ వోచర్లు, ఆభరణాల కొనుగోలు చిట్కాలను ఇక్కడ కస్టమర్లకు వివరిస్తాం. ఈ కేంద్రాలను మినీ డైమండ్ స్టోర్లుగా మార్చనున్నాం. రూ.5-25 వేల ధరలో లభించే వజ్రాభరణాలను విక్రయిస్తాం. ఈ విభాగంలో దేశంలో అపార అవకాశాలు ఉన్నాయి. మై కల్యాణ్ స్టోర్ల ద్వారా మార్చికల్లా రూ.100 కోట్ల వ్యాపారం ఆశిస్తున్నాం. ఆభరణాల విక్రయాలు తగ్గాయి కదా.. మీరేమంటారు? తొలి త్రైమాసికంలో అమ్మకాలు అంతగా సాగలేదు. అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని రెండవ త్రైమాసికం గణాంకాలనుబట్టి అవగతమైంది. వివాహాలు, పండుగల సీజన్ మరింత కలసి రానుంది. సంస్థ వృద్ధిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే రెండేళ్లుగా పెద్ద ఎత్తున విస్తరణ దిశగా అడుగులు పడ్డాయి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నాం. బంగారు ఆభరణాల పట్ల వినియోగదార్లలో ఉత్సాహం ఎన్నటికీ తరగదని మా విశ్వాసం. తరతరాలుగా ప్రీతిపాత్రమైన పుత్తడిపై ముఖ్యంగా భారతీయులకు మక్కువ ఎక్కువే. పుత్తడి ధర మరింత తగ్గే అవకాశం ఉందా? పసిడి ధర హేతుబద్ధ స్థాయి వద్ద క్రమంగా స్థిరపడుతోంది. పుత్తడి కొనుగోలుకు ఇదే సరైన సమయం. ప్రస్తుత ధర వద్ద బంగారం కొనుగోలు చేయడం ద్వారా అధిక విలువను పొందవచ్చు. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం ఆశిస్తున్నారు? 2014-15లో కల్యాణ్ జువెల్లర్స్ సుమారు రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లు అధిక వృద్ధికి ఆస్కారం ఉన్నవి. ఈ రెండు రాష్ట్రాల నుంచి ఆదాయం ప్రముఖంగానే సమకూరుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
Advertisement