-
రవితేజ మనసు బంగారం, ఇదే అందుకు నిదర్శనం!
మాస్ మహారాజ రవితేజ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఎంతో సరదాగా ఉంటాడు. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇచ్చాడు. అభిమానులను కూడా తన సొంత ఫ్యామిలీగా భావిస్తాడు. ఇతడు ప్రస్తుతం డైరెక్టర్ హరీశ్ శంకర్తో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కారంపూడిలో జరిగింది. ఆ సమయంలో కారంపూడికి వెకేషన్కు వెళ్లిన 70 ఏళ్లు పైబడ్డ వృద్ధ మహిళలు రవితేజను చూడాలనుందని మిస్టర్ బచ్చన్ టీమ్ను అడిగారట! బామ్మల కోరికకు ఓకే ఈ విషయాన్ని రవితేజకు చేరవేయగా ఆయన వారిని కలిసేందుకు రెడీ అయ్యాడు. షూటింగ్ అయిపోయిన మరుసటి రోజు రాత్రి ఏకంగా వారు ఉంటున్న చోటుకు వెళ్లాడు. అప్పుడు వారు భోజనం చేస్తుండటంతో డిన్నర్ అయిపోయేవరకు డిస్టర్బ్ చేయకుండా ఓపికగా అక్కడే వెయిట్ చేశాడు. తర్వాత వారితో కలిసి ఫోటోలు దిగాడు. తమ భోజనం అయ్యేంతవరకు రవితేజ వెయిట్ చేశాడని తెలిసి బామ్మలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. మర్చిపోలేని జ్ఞాపకంగా.. ఇంతకీ బామ్మల డిన్నర్ అయ్యేంతవరకు ఎందుకు ఎదురుచూడటం? అని టీమ్ అడగ్గా.. వారు సీనియర్ సిటిజన్లు.. వారి కోసం నేను వెయిట్ చేసిన క్షణాలు ఆ వృద్ధుల జీవితంలోనే మరిచిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి అని బదులిచ్చాడట! రవితేజ మనసు బంగారం అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది! 70+ elderly women who came on vacation asked the team whether there would be any chance to meet Ravi Teja. The actor who came to know about it went to their place, after the shoot yesterday. He waited till they completed their dinner and then posed for a photograph with them. pic.twitter.com/K5ZDXEZvQd — Trends Raviteja™ (@trends4raviteja) February 1, 2024 చదవండి: ఎదురుచూపులకు బ్రేక్.. 19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ భర్త ప్రోత్సాహంతోనే ఆ సీన్లో అలా నటించా: శరణ్య -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం
కారంపూడి(మాచర్ల): కారంపూడి ఎస్బీఐ బ్రాంచ్ ఉద్యోగి ఒకరు సుమారు కోటి రూపాయలు బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బ్యాంకులో గోల్డ్ లోన్ అధికారిగా పనిచేస్తున్న సేవ్యానాయక్ ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత నాలుగో తేదీ ఒక ఫేక్ అకౌంట్ ద్వారా నగదు స్వాహా విషయాన్ని గుర్తించిన బ్యాంక్ చీఫ్ మేనేజర్ అప్రమత్తమై పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్బీఐ టీం, రీజినల్ ఆఫీస్ అధికారులు రంగంలోకి దిగి శోధించడంతో నగదు స్వాహా పర్వం వెలుగు చూసింది. గత మూడు నెలలుగా బ్యాంకు ఏటీఎంలలో పెట్టడానికి బ్యాంకు నుంచి తీసుకెళ్లిన నగదులో కొంత స్వాహా చేస్తూ మిగతాది ఏటీఎం మిషన్లలో పెడుతూ సేవ్యానాయక్ నగదు స్వాహాకు పాల్పడ్డాడు. చదవండి: భక్తుడిలా రెక్కీ .. రాత్రికి చోరీ! ఇలా మూడు నెలల కాలంలో సుమారు రూ.కోటికి పైగా దారి మళ్లించాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసగా మారిన సేవ్యానాయక్ బ్యాంకు సొమ్ముతో క్రికెట్ బెట్టింగులు ఆడాడంటున్నారు. అయితే ఇతని స్వాహా పర్వాన్ని అధికారులు గత నాలుగో తేదీనే గుర్తించి, ఖాతాలన్నింటినీ జల్లెడ పట్టి ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారు. సేవ్యానాయక్ను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. -
గుంటూరు జిల్లాలో దారుణం
కారంపుడి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అప్పుతిరిగి చెల్లించలేదని ఓ కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని కారంపుడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పండుగ పూట విషాదం
కారంపూడి : సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి వాగులో పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం వేకువజామున కారంపూడి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గోళ్ళపాటి శ్యాంసన్, లుథియారాణి దంపతులు, మరికొందరు బంధువులు ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం హైదరాబాద్కు వెళ్లారు. హౌసింగ్బోర్డు కాలనీలో నివాసం ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శ్యాంసన్ బావ పల్లెపోగు చిన్నిరామయ్య సంక్రాంతి పండుగ కోసం వీరందరినీ తన కారులో స్వగ్రామానికి తీసుకొస్తున్నాడు. కారంపూడికి మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న మంత్రాలమ్మ కనుమ మూల మలుపు వద్ద బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో కారు అదుపు తప్పింది. రోడ్డు రెయిలింగ్ను ఢీకొని నాగులేరు వాగు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో లూథియారాణి(26) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త శ్యాంసన్, డ్రైవింగ్ చేస్తున్న చిన్నిరామయ్య, గోళ్ళ జర్సీసాలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి కుమారులు ప్రవీణ్, నవీన్, సోదరుడు గంధం యల్లమంద, మరిది గోళ్లపాటి పౌలు గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్యాంసన్ పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని సమాచారం. ఎస్ఐ రమేష్బాబు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గురజాల తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గంటన్నర పాటు మృత్యువుతో పోరాటం.. ప్రమాదం వేకువజామున 4.30 గంటలకు జరిగితే 6 గంటలకు 108 సిబ్బందికి సమాచారం అందింది. మంచు కమ్ముకుని ఉండటం, లోయ అంతా కంప చెట్లతో నిండి ఉండటంతో బయటకు రావడానికి దారి లేదు. దీంతో అటుగా వెళ్లే వారికి సైతం ప్రమాద విషయం తెలియలేదు. ఈ నేపథ్యంలో బాధితులు గంటన్నర పాటు అలాగే ఉండిపోయారు. తెల్లవారాక సమాచారం తెలిసి 108 సిబ్బంది, పోలీసుల సహకారంతో నిచ్చెన వేసుకుని కిందకు దిగి, బాధితులను ఆసుపత్రికి తరలించారు. లుథియారాణి కూడా అర గంటపాటు ప్రాణాలతోనే వుందని, సకాలంలో ఆసుపత్రికి చేరి ఉంటే బతికేదేమోనని బాధితులు తెలిపారు. -
మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త దారుణ హత్య
గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. జిల్లాలోని కారంపూడి మండలం చిన్నగార్లపాడులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గోవిందరెడ్డిపై పచ్చపార్టీ కార్యకర్తలు కత్తులు, గోడ్డళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో గోవిందరెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయి... అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం పచ్చ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ ఘటన గోవిందరెడ్డి ఇంటి ముందే చోటు చేసుకుంది. దాంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గోవిందరెడ్డి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు ఎవ్వరూ అటు వైపునకు రాకపోవడం గమనార్హం. గోవిందరెడ్డి హత్యతో జిల్లాలో టీడీపీ కార్యకర్తలు చేసిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల హత్యల సంఖ్య ఆరుకు చేరుకుంది.
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
ఐదో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement