-
ప్రాణాలు తీసిన అతివేగం
సారంగాపూర్(జగిత్యాల): అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం శివారులోని గణేశ్పల్లిలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని రేచపల్లి గ్రామం కొత్తపల్లి తండాలో నివాసం ఉంటున్న మంగ శేఖర్(28), మైనవేని వెంకటే ష్(19) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శేఖర్, వెంకటేశ్ సెంట్రింగ్ పనులు నిర్వహిస్తారు. ఇటీవల తుంగూరులో ఓ భవనానికి స్లాబ్ వేశారు. యజమాని వద్ద డబ్బులు రావాల్సి ఉండడంతో ఇద్దరు కలిసి తూంగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన శేఖర్ తమ్ముడు మంగ సుధాకర్, కొత్తపల్లి రాజశేఖర్, దూస గణేశ్ మరో బైక్పై వెళ్లారు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని కొత్తపల్లి తండాకు బయల్దేరారు.ఈ క్రమంలో రెండు వాహనాలను అతివేగంగా నడిపారు. బీర్పూర్ఘాట్ దిగి గణేశ్పల్లి సవిల్సప్లై గోదాం సమీపంలోని మూలమలుపు వద్ద శేఖర్, వెంకటేశ్ వెళ్తున్న బైక్ వేగంగా ఉండడంతో అదుపుతప్పి తాటిచెట్టును ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడ్డారు. తలలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వీరి వాహనాన్ని అనుసరిస్తున్న మరో ద్విచక్రవాహనంపై ఉన్న సుధాకర్, రాజశేఖర్, గణేష్ సైతం ముందున్న బైక్ను, చెట్టును ఢీకొట్టి కిందపడడంతో వీరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఘటనాస్థలాన్ని ఎస్సై రాజ య్య పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతివేగం.. అజాగ్రత్త.. రెండు వాహనాలు బీర్పూర్ నుంచే అతివేగంగా వస్తున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఒకరికన్నా మరొకరు పోటీతో వాహనాలు నడిపినట్లు చెబుతున్నారు.ప్రమాద స్థలానికి 500 మీటర్ల దూరంలో బ్రేక్వేసినా.. టైర్లు నేలకు రాకుతూ.. చెట్టును బలంగా ఢీకొట్టడంతో బెరడు ఊడిపోయిందంటే ప్రమాద స్థితిని అర్థం చేసుకోవచ్చని పోలీసులు అంటున్నారు. ఉపాధికోసం వచ్చి.. మంగ శేఖర్ది కుమురంభీం జిల్లా జిల్లా తిర్యాణి గ్రామం. సెంట్రింగ్ పనుల నేపథ్యంలో ఐదేళ్ల క్రితం భార్యాపిల్లలతో వచ్చి రేచపల్లిలో స్థిరపడ్డారు. ఇటీవలే తన తమ్ముడు సుధాకర్ సైతం పనుల నిమిత్తం వచ్చాడు. శేఖర్కు భార్య రూప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు.. జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటలో అదివారం రాత్రి పెద్దింటి నరేష్(30) బైక్ అదుపుతప్పి దుర్మరణం చెందాడు. దగ్గులమ్మగుడి ప్రాంతనికి చెందిన నరేష్ తన సోదరి రాజేశ్వరిని పట్టణంలోని పురాణిపేటలో దింపేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా... బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు పిల్లలున్నారు. -
ఉగ్గ పట్టుకోవాల్సిందే !
నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువు మహిళలకు తీవ్ర ఇబ్బందులు స్పందించని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువయ్యాయి. 3.5 లక్షల జనాభా గల నగరంలో కేవలం 20 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బిజినెస్ సెంటర్గా వెలుగొందుతున్న నగర ప్రధాన వ్యాపార కూడలి టవర్సర్కిల్కు సమీపంలో కేవలం మూడు టాయిలెట్లు ఉండడం చూస్తుంటే అధికారులకు స్వచ్ఛ కరీంనగర్, ప్రజారోగ్యంపై ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ప్రతి రోజు లక్షకు పైగా జనాభా ప్రధాన వ్యాపార కూడలికి వస్తూ పోతుంటారు. కొనుగోళ్ల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చే వారితో మార్కెట్ అంతా కిటకిటలాడుతుంటుంది. అయితే మహిళలే ఎక్కువగా వస్తుంటారు. అయితే వారి కోసం ప్రత్యేక టాయిలెట్స్ లేకపోవడం దారుణం. కనీసం షాపింగ్మాల్స్ల్లోనూ ఏర్పాటు చేయడం లేదు. ప్రణాళికలు కరువు స్వచ్ఛభారత్లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. అయితే టాయిలెట్ల నిర్మాణంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్ అంటే కేవలం రోడ్లు శుభ్రం చేయడమనే భావనలోనే అధికారులు ఉన్నారు. దీంతో మిగతా విషయాలపై దృష్టి సారించడం లేదు. టాయిలెట్లు ఎంత అవసరమో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. వర్షాకాలంలో మాటిమాటికి టాయిలెట్ రావడం సర్వసాధారణం. పురుషులు ఎక్కడపడితే అక్కడ సమస్య తీర్చుకుంటారు. కానీ స్త్రీల బాధ వర్ణనాతీతం. మూత్రం విసర్జించకుండా ఎక్కువ సేపు ఆగితే మూత్ర సంబంధవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లే వరకు ఆపుకోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతాల్లోనైనా టాయిలెట్లు నిర్మించాలనే ఆలోచన కూడా రావడం లేదు. మహిళలకు ప్రత్యేకం ఎప్పుడు ? ఈనెల 1న నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీల సదస్సులో మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహిళల బాధలను సర్వే ద్వారా తెలుసుకుని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కామన్ టాయిలెట్లకు రావడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలిందని, మహిళల కోసం మున్సిపాలిటీల్లోని ప్రధాన వ్యాపార కూడళ్లలో ‘షీ టాయిలెట్సు’ యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నింటిపై మున్సిపాలిటీలకు సర్వహక్కులు ఉంటాయన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవిపిస్తున్నాయి. తొమ్మిదింటికి ప్రతిపాదనలు – రవీందర్, ఏసీపీ నగరపాలక సంస్థలో ప్రస్తుతం 20 పబ్లిక్ టాయిలెట్లు వినయోగంలో ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్తో మరో తొమ్మిదింటికి ప్రతిపాదనలు తయారు చేశారు. షీ టాయిలెట్లు, పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement