-
రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపండి!
న్యూఢిల్లీ: కశ్మీర్లో అల్లరిమూకను రెచ్చగొడుతూ.. హింసకు ప్రేరేపిస్తున్న తెరవెనుక సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలని భద్రతా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఆదేశాలు ఇచ్చారు. వారంలోగా కశ్మీర్లో శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని, వచ్చేవారం నుంచి విద్యార్థులు నిర్భయంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పరిస్థితులు కల్పించాలని ఆయన నిర్దేశించారు. కశ్మీర్లో నానాటికీ పరిస్థితులు దిగజారుతుండటం, ఆందోళనలతో అట్టుడుకుతున్న నేపథ్యంలో రాజ్నాథ్ అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నిఘా, భద్రతా సంస్థల అధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో కశ్మీర్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. నిన్నమొన్నటివరకు అల్లర్లతో అట్టుడికిన కశ్మీర్.. బక్రీద్ నేపథ్యంలో వరుస ఉగ్రవాద దాడులతో ఉద్రిక్తంగా మారింది. అనంత్నాగ్ జిల్లాలోని నౌగామ్లో, పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు, ఓ పోలీసు అధికారి మృతిచెందారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లోని ఉద్రిక్తతను, హింసను ఇంకేంతమాత్రం ఉపేక్షించకుండా.. శాంతియుత పరిస్థితులు నెలకొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాజ్నాథ్ భద్రతా దళాలకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
కశ్మీర్ పరిస్థితిపై రాజ్ నాథ్ సమీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ లో గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ గంటకు పైగా చర్చించారు. మంత్రులకు అధికారలు కశ్మీర్ పరిస్థితులపై నివేదికను సమర్పించారు. గతేడాది నవంబర్ నెలలో కశ్మీరుకు కేటాయించిన రూ.80 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుపై సమావేశంలో చర్చించారు. ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత 40 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన అల్లర్లలో 64 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. -
సోనియాతో ఫోన్లో మాట్లాడిన రాజ్నాథ్
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై సమీక్ష జరిపారు. అలాగే అమర్నాథ్ యాత్రికుల తరలింపుపై ఏర్పాట్లుకు ఆదేశాలు ఇచ్చారు. కాగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో రాజీ పడొద్దని, ఉగ్రవాదాన్ని కఠినంగా అణిచివేయాలని ఆమె సూచించారు. సామాన్య పౌరుల మరణాలు, భద్రతా బలగాలపై దాడులు బాధాకరమని ఆమె అన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement