-
ఇంటర్నేషనల్ ఫెసిలిటీ తో ఆస్పత్రి నిర్మాణం
-
మీకు రెండే రెండు ప్రశ్నలు.. టీడీపీ మేనిఫెస్టోపై కాసు మహేష్ రెడ్డి ఫైర్
-
పల్నాడు వాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది: ఎమ్మెల్యే కాసు
-
షర్మిలకు కాసు మహేష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్
-
ముఖ్యమంత్రి జగన్ పాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చారు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
-
నీకు ఉరి శిక్ష పడేలా చేస్తా...టీడీపీ నేతకు వార్నింగ్..
-
ఈ హత్యకు కారణం ఆయనే..!
-
రూ.300 కోట్ల సారాయి డబ్బులతో చంద్రబాబు ఇళ్లు కట్టుకున్నారు
-
నారా లోకేష్కు ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్
సాక్షి, పల్నాడు జిల్లా: వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో చర్చ పెట్టినా తాను చర్చకు సిద్ధమని నారా లోకేష్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను అబద్ధాలు చెప్పినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘రూ.83 కోట్లతో నిర్మించిన సీసీరోడ్లు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హాళ్లని రూ.2020 కోట్లతో నిర్మించానని లోకేష్ అబద్ధాలు చెప్పాడు. సారా డబ్బులతో హైదరాబాద్లో చంద్రబాబుకు రూ.300 కోట్ల భవనం. ప్రజల్ని లూటీ చేసి చంద్రబాబు, లోకేష్ సంపాదించారు. టీడీపీ హయాంలో లిప్ట్ ఇరిగేషన్ నుంచి సర్వే అయినా చేయించారా?’’ అంటూ మహేష్రెడ్డి ప్రశ్నించారు. చదవండి: అన్నమయ్య జిల్లా: చంద్రబాబుపై కేసు నమోదు -
గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే కాసు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు చనిపోయారు. గురజాలలో జరగబోయే లోకేష్ సభకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పాలని చనిపోయిన ఇద్దరు బాలురు కుటుంబ సభ్యులపై యరపతినేని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాసు ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా లోకేష్ దగ్గర చెప్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటూ యరపతినేని శ్రీనివాసరావు ప్రలోభాలు పెడుతున్నారని కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
‘వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా’
తాడేపల్లి: ఓటుకు నోటు, బెల్టు షాపులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేవ్రెడ్డి. అసలు రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబని మహేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘2024లో బాబుకు రిటైర్మెంట్ ఖాయం. వృద్దాప్యంలోనైనా గౌరవంగా బతకండి. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అనే సర్వేలతో బాబు వెన్నులో వణుకు. ఆనాడు మద్యపాన నిషేదం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? , మీ బాబు తెచ్చిన మద్యం బ్రాండ్లే నేటికీ ఉన్నాయి..తెలుసుకో యరపతినేని. లోకేశ్ స్టాన్ఫర్డ్ చదువుకు డోనేషన్ కట్టింది ఎవరో లోకానికి తెలియదా..?, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అది చంద్రబాబు ప్రచారమే’ అని విమర్శించారు. కాసు మహేశ్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా..!: యరపతినేని ఒక నీతి జాతి లేని నాయకుడు మాట్లాడినట్లు చిల్లరగా మాట్లాడుతున్నాడు. పేస్ యరపతినేనిది...బ్యాక్గ్రౌండ్ చంద్రబాబుది...ఈ గుంట నక్క రాజకీయాలు ఎన్నిరోజులు..? చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, అమెరికాలో ఉంటున్న మహిళలతో పోస్టులు పెట్టిస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ రాజకీయాలు...ఎందుకింత భయపడుతున్నాడు..? టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేలు వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని చెప్తుంటే ఈయన భయపడిపోయి ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పులన్నీ జగన్ గారికి ఆపాదిస్తూ ఏదంటే అది మాట్లాడిస్తున్నాడు..మాట్లాడుతున్నాడు. ఒకడు లిక్కర్ అంటాడు...ఒకడు సిమెంట్ అంటాడు. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా...? మద్యపాన నిషేదం పెడితే ఎత్తేసింది చంద్రబాబు కాదా..? ఇంటింటికీ లిక్కర్ పథకాన్ని పెట్టింది చంద్రబాబు కాదా..? దేశంలోనే మొట్టమొదటి సారిగా బెల్టు షాపులు పెట్టి వైన్ షాపులకు టార్గెట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబే. మాట్లాడితే లిక్కర్లో జే టాక్స్ అంటారు...250 బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చింది చంద్రబాబే. చంద్రబాబు పెట్టిన డిస్టిలరీలే నేటికీ వ్యాపారం చేస్తున్నాయి. ఆదికేశవులనాయుడిది డిస్టిలరీ లేదా..? ఆయన టీడీపీ కాదా..? తాను డిస్టిలరీని అమ్మేసుకున్నాను అని అయ్యన్నపాత్రుడు మొన్నీ మధ్య చెప్తున్నాడు...ఆయన టీడీపీ నేత కాదా..? యనమల రామకృష్ణుడు వియ్యంకుడు టీడీపీ నేత కాదా..? ఎస్పీవై రెడ్డి వైఎస్సార్సీపీలో గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయకముందే లాగేసుకుని ఆయన చేత డిస్టిలరీ పెట్టించింది చంద్రబాబే. ఈ రోజుకీ చంద్రబాబు పెట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో నడుస్తున్నాయి. వీళ్లు చెప్తున్న భూమ్ భూమ్ బ్రాండు, వివిధ రకాల మెడల్స్ వారి హయాం నుంచి వస్తున్నవే. ఆనాడు ఆ సంస్థల వద్ద లంచాలు తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చింది మీరే కదా. చేసిన తప్పంతా మీరు చేసి మాపై రుద్దాలనుకుంటే ఎలా..?: చేసిన తప్పంతా మీరు చేసి ఆ బురదంతా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి పుయ్యాలంటే ఎలా..? ప్రజలు ఇవన్నీ తెలుసుకోలేని అమాయకులా..? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు అన్నట్లుంది చంద్రబాబు తీరు. సిమెంట్ సంస్థలు ముఖ్యమంత్రి గారికి లంచాలు ఎందుకిస్తారు..? ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతంలో 2014–19 మధ్య ధరలు 10–15శాతం పెరిగాయి... ఈ రోజు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. ఒక్క సిమెంట్ ధరలే కాదు స్టీల్ ధరలు కూడా పెరిగాయి. బహుశా ఆ తప్పులన్నీ వాళ్లే చేశారేమో..? అందుకే ఇవన్నీ మాపై ఆపాదిస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరు...మాట తప్పింది ఎవరు అనేది వారు గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో 99 శాతం మేనిఫెస్టో ను అమలు చేశాం. నువ్వేదో విలువలు కలిగిన నాయకుడి ఫోజులెందుకు చంద్రబాబూ..?: ఎందుకీ కుటిలరాజకీయాలు..ఆలా ఎన్ని రోజులు చేస్తారు..? చంద్రబాబునే నేరుగా వచ్చి మాట్లాడమనండి...ఆ బూతులేవో తానే మాట్లాడమనండి. ఎందుకీ నాటకాలు..? ముందొక మాట..వెనకొక మాట. ఆయనేదో పెద్ద విలువలు కలిగిన నాయకుడిలా ఫోజులెందుకు..? ఈ దేశంలోనే రాజకీయాలను బ్రష్టు పట్టించింది చంద్రబాబే. ఓటుకు నోటును తీసుకొచ్చింది చంద్రబాబు. ఎన్టీఆర్ చనిపోయిన నాడు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఓటుకు యాభై రూపాయలు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబే. ఈ రోజు రాజకీయ వ్యవస్థలో ఓటుకు నోటు ఒక క్యాన్సర్లా మారింది. మీడియాను, వ్యవస్థలను వాడుకోవడం, వారికి ప్రలోభాలు పెట్టడం వల్ల మిమ్మల్ని గత ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇక గెలవలేమనే ఫ్రస్టేషన్తో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. చిన్నవయసులో ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ..కేంద్రంతో మంచి రిలేషన్స్ నడుపుతూ ముందుకు వెళ్తూ నిధులు తీసుకొస్తున్నారు. అది తట్టుకోలేక అక్కసుతో, కుళ్ళుతో చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. సొంత బలంతో నిలబడగలుగుతాడా అంటే అదీ ఆయనకు చేతకాదు. ఆ రోజు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 270 సీట్ల వరకూ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణాలో జీరో...అక్కడ పోటీ చేసే దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో సొంతంగా పోటీ చేయలేని దుస్థితి. పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ కావాలి..కమ్యూనిస్టులు కావాలి... ఇదీ ఈ రోజు టీడీపీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చాడు.. సొంత బలంలో జగన్ గారు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా తన రాజకీయాన్ని మొదలు పెట్టి 151 సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించాడు. 90 శాతం ఎంపీటీసీ, సర్పంచ్లు, జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఎక్కడ చదివామన్నది కాదు..ఎంత సంస్కారం ఉందనేది ముఖ్యం: జగన్ చదువులు గురించి కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ చదివింది బేగంపేటలో కాదా..? పది వరకూ కష్టమైన ఐసీఎస్సీ సిలబస్ చదివారు. ఇంటర్ ఐఎస్సీలో చదివారు. డిగ్రీ చదివారు. ఎంబీఏ చేశారు. మాట్లాడితే నీ డిగ్రీ ఎక్కడ అని అడుగుతున్నారు. లోకేశ్ స్టాన్ఫర్డ్లో చదివాడట...ఆయన టెన్త్ క్లాస్, ఇంటర్ వివరాలు తీయమనండి. చదువు రాక నారాయణతో ట్రైనింగ్ ఇప్పించారు. సత్యం రామలింగరాజు వద్ద లంచంగా తీసుకుని అక్కడ ఫీజు కట్టారు. ఆ సీటు కూడా మెరిట్లో రాలేదు...డొనేషన్ కడితే అక్కడ సీటు వచ్చింది. దానికేదో లోకేశ్కు డాక్టరేట్ వచ్చినంత బిల్డప్లు ఇస్తున్నారు. అయినా ఎక్కడ చదివామనేది కాదు...సంస్కారం, బుద్ధి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. సొంత బలంతో జగన్ గారు 151 సీట్లు గెలుచుకున్నాడు...మా ఖర్మ లోకేశ్ ఆయనతో పోటీ పెట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి కదా..? అదీ మా ఖర్మ ఏం చేస్తాం. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి అడ్డదారిలో లోకేశ్ మంత్రి అయ్యాడు. లోకేశ్ తన ఎమ్మెల్యే సీటు తాను గెలవలేడు..ఆయనకు మాతో పోటీ అట. ఆయన పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారట..నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. ప్రశాంతతకి, ప్రశాంతి అత్తకి తేడా తెలియని వాడికి వైఎస్సార్సీపీ భయపడుతోందట... ఈ రోజు ఏదో సర్కస్లా లోకేశ్ పాదయాత్ర నడుస్తోంది...దాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదనడం హాస్యాస్పదం. ఈ రోజు ధైర్యంగా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు..గడచిన కాలంలో ఏనాడైనా జరిగిందా..? ఇంత ధైర్యంగా మేం జనం వద్దకు వెళ్తున్నామంటే వెనుకున్న జగన్ గారి బొమ్మ వల్ల..ఆయన చేసిన ప్రజారంజక పాలన వల్ల. మేనిఫెస్టో ఇచ్చి అదిరిందా తమ్ముళ్లూ..అంటున్నాడు..ఇదేమన్నా రికార్డింగ్ డాన్సా..?: జగన్ పథకాలు జిరాక్స్ తీసి ప్లస్ వన్ అని యాడ్ చేసుకుని మొన్న చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి ప్రకటిస్తాడు.. మళ్లీ అదిరిందా తమ్ముళ్లూ అంటాడు..అదేమన్నా రికార్డింగ్ డాన్సా అదిరిపోడానికి..? అక్కడున్న టీడీపీ వాళ్లే జగన్ గారే పథకాలే మనం చెప్తుంటే ఇక మనకెవరు ఓట్లు వేస్తారని అనుకున్నారట. అదే స్టేజ్ మీద కూర్చుని లోకేశ్ మాలోకం లెక్కలేస్తున్నాడట..ఇంత డబ్బు ఎలా తెస్తాం అని ఆందోళన చెందుతున్నాడట. ఖర్మ కాలి అధికారంలోకి వస్తే లక్ష కోట్లు ఎక్కడనుంచి తెస్తాం అని చంద్రబాబును అడిగాడట. చంద్రబాబు పిచ్చోడా..ఇచ్చేదైతే కదా లెక్కలు కట్టడానికి అని లోకేశ్కి చెప్పాడట. వీళ్లు జగన్ గారి నిబద్ధతను, ఆయన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. పనీ పాటా లేకుండా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. మా నాయకుడిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు: అనైతికంగా జగన్ గారిని, భారతి రెడ్డి గారిని ఏది నోటికొస్తే అది మాట్లాడతున్నారు. ధైర్యముంటే చెప్పండి...ఈ పథకం ఇవ్వలేదని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడని చెప్పగలరా..? మెరుగైన రాజకీయం కోసం ఒక్క సలహా ఇవ్వలేరు. కేవలం తమ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయంటే ఎలా పడితే అలా మాట్లాడటం, అభూత కల్పనలుచేయడం టీడీపీ వారికి అలవాటుగా మారింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి వాళ్లు కాదు. ఎవరేం చేస్తున్నారో అన్నీ చూస్తున్నారు. ఒక్క తొమ్మిది నెలలు ఆగండి...151 కాదు ఈసారి 175 సీట్లు జగన్ గారు కైవసం చేసుకుంటారు. అప్పుడే వీళ్లకి బుద్ధి వస్తుంది...అప్పటి వరకూ వీళ్ల బతుకులు ఎవరూ మార్చలేరు. జగన్పై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతి కార్యకర్త స్పందిస్తాడు. వయసు పెద్దదైంది..గౌరవంగా బతకండి...రేపు ఎన్నికల తర్వాత ఎలాగూ రిటైర్ అవుతారు. కనీసం రిటైర్మెంట్ అయ్యేటప్పుడైనా గౌరవంగా అవ్వండి అని ఉచిత సలహా ఇస్తున్నా. రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎంత గౌరవంగా వచ్చామో అంతే గౌరవంగా రిటైర్ అవ్వాలి. అలా జరగాలంటే అవతలి వారికి గౌరవం ఇస్తే మీకు గౌరవం దక్కుతుంది. మేం ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..?: రెండేళ్ల నుంచి ముందస్తు అనే చెప్తున్నారు. వాళ్లకి భయం పట్టుకుంది..వాళ్లకి కార్యకర్తలు నిలబడటం లేదు. ఇదిగో ఎన్నికలు వస్తున్నాయంటే ఆఫీసుల్లో జనం కనిపిస్తారని వారి భావన. అందుకే తమ పత్రికల్లో, టీవీల్లో వాళ్లే క్రియేట్ చేసి ముందస్తు రాగం పాడుతుంటారు. జగన్ ప్రధానిని కలవడానికి వెళ్లింది అనేక పథకాల గురించి.. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై వెళ్లారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, ప్రధాని కార్యాలయం కానీ...ఏమైనా చెప్పిందా. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి..ప్రజలు ఐదేళ్లు పూర్తి విశ్వాసం జగన్ గారికి ఇచ్చారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడుస్తోంది...ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న మాకు ముందస్తు ఎందుకు..? వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత మైనస్ అయ్యాడో వాళ్ల పార్టీ వాళ్లనే అడగండి. ఒక రోజు ముఖ్యమంత్రి అంటాడు..ఒక రోజు కాదంటాడు.. ఆ బూతులేంటి..ఒక రోజు పొత్తు అంటాడు..మరో రోజు లేదంటాడు. పవన్ కళ్యాణ్ ఏంటో, ఆయన విధానాలేంటో అర్ధం కాక వారి పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత జనంలో తిరిగితే అంత క్లారిటీ ప్రజలకు వస్తుంది. -
విద్యపై ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయం
దాచేపల్లి: విద్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తోన్న కృషి అభినందనీయమని జర్మనీలోని బ్రాండెన్బర్గ్ మాజీ ఎంపీ, అట్ల్యాండ్స్బగ్ మాజీ మేయర్ డాక్టర్ గుజ్జుల రవీంద్ర అన్నారు. పల్నాడు జిల్లా నడికుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయ్కుమార్రెడ్డి నివాసంలో రవీంద్ర దంపతులను గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆదివారం కలిసి సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడారు. విద్యపై ఎంత ఖర్చు పెట్టినా ఎప్పటికీ వృథా కాదన్నారు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా రానున్న రోజుల్లో వచ్చే ఫలాలను ప్రజలు అనుభవిస్తారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పుట్టిపెరిగిన ఊరితోపాటుగా ఉమ్మడి ఏపీలో తమవంతు సామాజిక సేవ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లోని జూబ్లిహిల్స్లో తమ ట్రస్ట్ ద్వారా అంగన్వాడీ అనే ప్రాజెక్ట్ను చేపట్టామని, ఏపీలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్లు చేపడతామని వెల్లడించారు. రవీంద్ర సతీమణి, అట్ల్యాండ్స్బగ్ డిప్యూటీ మేయర్ గాబ్రియేల్ మాట్లాడుతూ..దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటం అభినందనీయమన్నారు. -
‘బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు’
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. బాబు డైరెక్షన్లోనే బ్రహ్మారెడ్డి మాచర్లలో అలజడి సృష్టించారన్నారు. హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కాసు మహేష్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలో పల్నాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పాలనలో పల్నాడుకి జిల్లా వచ్చిందన్నారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాలను రూ. 4700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని విషయం ప్రజలు గ్రహించాలన్నారు. పులివెందులతో సమానంగా పల్నాడు అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేస్రెడ్డి పేర్కొన్నారు. -
హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారు
-
ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్దమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. కాగా, మహేష్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2019-2022 మధ్య కాలంలో గురజాల అభివృద్ధి కోసం రూ.2,673 కోట్లు ఖర్చు చేశాము. టీడీపీతోపాటు ఏపార్టీ వచ్చినా చర్చకు రెడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గత 40 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పల్నాడులోని గురజాల వెనుకబడ్డ ప్రాంతం. వైఎస్సార్ హయంలోనే ఇక్కడ అభివృద్ధి మొదలైంది. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాము. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు చర్యలు చేపట్టాము. టీడీపీ హయంలో ఒక్క పథకమైనా చేపట్టారా?’ అని ప్రశ్నించారు. -
గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం
-
గురజాల అభివృద్ధిపై ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి బహిరంగ సవాల్
-
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
లోకేష్ నోరు అదుపులో పెట్టుకో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
సాక్షి, గుంటూరు: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ పాలనలో పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది ఓర్చుకోలేక టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి. వార్డు మెంబర్గా కూడా లోకేష్ గెలవలేరు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు' అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పల్నాడు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ల రూపురేఖలు మారుతున్నాయి. రాబోయే కాలంలో పల్నాడు వెనుకబడిన ప్రాంతంగా ఉండదు. అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తోంది. పల్నాడుకు టీడీపీ చేసిందేమీలేదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీకి తెలుసు అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. చదవండి: (‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’) -
‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’
సాక్షి, గుంటూరు: యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు చరుస్తాం అనే మాటలన్నీ టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ సత్తా ఏంటో చూపించాం. ప్రజలే నిర్ణయించారు మగాళ్లు ఎవరు.. మడత గాళ్లు ఎవరు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్రెడ్డి పట్టుబడలేదా, అదేమైనా ప్రతపక్షాల కుట్రా..?. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంపితే మద్యం పంచుతూ ఒకరిద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం..?. దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. దమ్ము, ధైర్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్కి వెళ్లిన వైఎస్సా్ర్సీపీనే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో మా పార్టీ పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈ రోజు యావత్తు రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాల్టీలుగా చేశాం. తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలు ఆపాలని చూశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు' అంటూ కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (అసలు లోకేష్కు ఎయిడెడ్ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు సురేష్) -
అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్రెడ్డి
-
అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్రెడ్డి
సాక్షి, గుంటూరు: గురజాల నియోజకవర్గంలో టీడీపీ చేయలేని అభివృద్ధిని 30 నెలల్లోనే తాము చేసి చూపించామని వైఎస్సార్సీపీ కాసు మహేష్రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికైనా కుళాయి ద్వారా నీళ్లిచ్చారా అంటూ ఆయన ప్రశ్నించారు. గురజాల, దాచేపల్లిని నగర పంచాయతీలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల్లో అలాంటి ఫలితాలే రానున్నాయన్నారు. గురజాల, దాచేపల్లి గ్రామాలను పట్టణాలుగా చేయాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా మహేష్రెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఉన్నతమైన పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేశారో ఆ పార్టీ నేతలు చెప్పాలని ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆయనెవరో నాకు తెలీదు.. చంపితే మాకేం వస్తుంది!
సాక్షి, గుంటూరు : దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్ని ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారని, విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయనను చూడలేదన్నారు. ఆయన్ను చంపితే మాకేం వస్తుందని, ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్ తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ శవ రాజకీయాలు, దేవాలయాలపై దాడులు చేపిస్తోందన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని, అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు. యరపతినేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మర్చిపోయాడా అని నిలదీశారు. కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్కు మహేష్రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
లక్ష్మీనారాయణా.. సమాధానం చెప్పు
సాక్షి, తాడేపల్లి: కరోనాపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబుకు బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలకడం బాధాకరమన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలకు ఎల్లో మీడియా వంత పాడుతుందని ధ్వజమెత్తారు. కరోనా టెస్ట్ కిట్లు కొనుగోలు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కన్నా ఆరోపణలు అర్థ రహితమన్నారు. (కోవిడ్-19 ఎఫెక్ట్పై షాకింగ్ సర్వే) కన్నా సమాధానం చెప్పాలి.. ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుందని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలను కేంద్రం, జాతీయ మీడియా ప్రశంసించాయని చెప్పారు. కిట్ను రాష్ట్రం రూ.730కి కొంటే.. కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందన్నారు. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కన్నా, టీడీపీ నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారని.. వారితో కలిసి కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు వాలంటీర్ల వ్యవస్థ తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోందని తెలిపారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
శ్రీరామానంద స్వామిజీ పాదయాత్ర
కుంభకోణాలకు చట్టబద్ధత కల్పించింది బీజేపీయే
No Headline
‘దేవర’ చిత్ర యూనిట్ను వదలని తేనెటీగలు
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు
మన్యంలో మోసగాడు
పశువుల కోసం వెళ్లి గోదావరిలో పడి విద్యార్థి మృతి
హైరిస్క్ గర్భిణుల గుర్తింపు
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement