-
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా షాకిచ్చారు.ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతిస్తున్న‘సిఖ్స్ ఫర్ జస్టిస్’అనే సంస్థ నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ నిధులు స్వీకరించారనే అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు గవర్నర్ సోమవారం(మే6) సిఫారసు చేశారు.ఆమ్ఆద్మీపార్టీకి సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నుంచి ఆప్కు 16 మిలియన్ డాలర్ల నిధులు వచ్చాయన్న ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ విచారణకు ఆదేశించినట్లు గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును వరల్డ్ హిందూ ఫెడరేషన్ అశూ మోంగియా ఇచ్చినట్లు తెలిపారు. -
ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్?
న్యూఢిల్లీ: కెనడాలో బుధవారం రాత్రి జరిగిన గ్యాంగ్వార్లో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె ప్రత్యర్ధులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఈ హత్యకు పూర్తి బాధ్యత తమదేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మాదే బాధ్యత.. కెనడాలో జరిగిన ముఠా కాల్పుల్లో ఖలిస్థా ఉగ్రావది సుఖ దునెకె హత్యకు గురయ్యాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఈ హత్య తామే చేయించామని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గ్యాంగ్స్టర్లు గుర్లాల్ బ్రార్, విక్కీ ముద్దుకేరా హత్యలతో సుఖ దునెకెకు సంబంధముందని వాడు మాదకద్రవ్యాలకు బానిసాయి ఫేక్ వీసా మీద కెనడా పారిపోయాడని వాడు చేసిన తప్పులకు శిక్ష పడిందని మా శత్రువులు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బ్రతకరని హెచ్చరించారు. లారెన్స్ పాత్రపై అనుమానాలు.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసు ఆరోపణల్లో అహ్మదాబాద్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్య కేసులో కూడా లారెన్స్ బిష్ణోయ్ నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా పోస్టును బట్టి ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు భారత్ కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ హత్య జరగడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అక్కడి వారికి ట్రావెల్ అడ్వైజరీ మార్గదర్శకాలు చేసి వీసా సేవలను నిలిపివేసింది. చిలికి చిలికి.. భారత్ కెనడా మధ్య సంబంధాలు అంతకంతకు బలహీనపడుతున్నాయి. ఖలిస్థాన్ ఉద్యమం పేరిట ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీగా నిర్వహించి వివాదానికి తెరతీశాయి. ఆనాడు భారత దేశం ఆ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసినా తేలిగ్గా తీసుకున్న కెనడా తర్వాత జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లు కారణమంటూ చేసిన వ్యాఖ్యలు తగువుకు ఆజ్యం పోశాయి. ఇంతలోనే మరో ఉగ్రవాది హత్య జరగడంతో కెనడా వీసాలను నిలిపివేసింది. BIG ⚡️Lawrence Bishnoi gang claims responsibility for K-terrorist Sukhdool Singh's killing in Canada pic.twitter.com/6ZN1T30pb4 — Megh Updates 🚨™ (@MeghUpdates) September 21, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు -
అమృత్పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్లో డ్రైవర్గా పని చేసే అమృత్పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్పాల్ను దుబాయ్ నుంచి పంజాబ్కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్పాల్ భారత్కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్ప్రీత్ సింగ్ అమృత్పాల్ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్ప్రీత్ సింగ్ అమృత్సింగ్ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్పాల్ బైక్పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్ప్రీత్గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్ప్రీత్ సింగ్ పంజాబ్లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు కుడిభుజం. పంజాబ్లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్పాల్ సింగ్కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్సింగ్పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్సర్కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్పాల్కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్పాల్కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్పాల్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్పాల్ సింగ్కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్కు తిరిగి వచ్చాడు. అమృత్పాల్ దుబాయ్ నుంచి పంజాబ్కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్దీప్ కౌర్ అమృత్పాల్ సింగ్ భార్య. బ్రిటన్కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్పాల్కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్పాల్పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్పాల్పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్లో కేసు -
అమృత్పాల్కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్పాల్సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్పాల్ దుబాయ్లో ట్రక్ డ్రైవర్గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్లో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
ఖలీస్తానీ మద్ధతుదారుల దుశ్చర్య.. భారత్ కౌంటర్
లండన్లోని భారత హైకమిషనర్ వద్ద ఆదివారం జరిగిన పరిణామాలకు భారత్ తక్షణ కౌంటర్ ఇచ్చింది. పంజాబ్లో ఖలీస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు నిరసనగా.. లండన్ హైకమిషనర్ ఆవరణలో భారత జాతీయ జెండాను ఖలీస్తానీ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగేయాలని యత్నించడం.. ఆ వెంటనే అధికారులు స్పందించడం, తదనంతరం భారీ జాతీయ జెండాను ఎగరేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ అల్డివిచ్ ఇండియా హౌజ్ బయట ఈ భారీ భారతీయ జాతీయ జెండాను ఎగరేయగా.. పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఈ పరిణామంపై ఝండా ఊంచా రహే హమారా అంటూ ట్విటర్లో పోస్ట్ ఉంచారు. భారత జెండాను అవమానించేలా వ్యవహరించిన వాళ్లపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంరక్షణకు, పలు రకాల సేవలు అందించిన ఖ్యాతి పంజాబ్కు, పంజాబీలకు ఉందని పేర్కొన్నారు ఆయన. “Jhanda Ooncha Rahe Hamara”- UK Govt must act against those miscreants who attempted to disrespect Indian Flag at High Commission,London.Punjab & Punjabis have a glorious track record of serving/protecting the Nation.Handful of jumping jacks sitting in UK do not represent Punjab. pic.twitter.com/TJrNAZcdmf — Jaiveer Shergill (@JaiveerShergill) March 20, 2023 ఇదిలా ఉంటే.. జాతీయ జెండాను కిందకు లాగేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో భారత హైకమిషనర్ అధికారులు తక్షణం స్పందించారు. కౌంటర్గా ఖలీస్తానీ జెండాను విసిరేయడంపై.. పలువురు నెటిజన్స్ ప్రశసంలు గుప్పిస్తున్నారు. ఇక ఈ పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆదివారం అర్ధరాత్రి భారత్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టియానా స్కాట్కు ఈ ఘటనపై వివరణ కోరుతూ సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మరోవైపు యూకే మంత్రి తారీఖ్ అహ్మద్ ఈ ఘటనను ఖండిస్తూ ఓ ట్వీట్ చేశారు. Salute to the Brave Indian High Commission Official 🙏🇮🇳 He not only took back the Indian flag but stopped the extremist from installing the K-Flag.#UK #London pic.twitter.com/4X0DJQo9hV — Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2023 ఇదీ చదవండి: ఒకేసారి.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం -
భింద్రన్వాలే 2.0: అమృత్పాల్ సింగ్
‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’ ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ – ఇవీ... తనను తాను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...? అమృత్పాల్ సింగ్ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్ బ్లూ స్టార్లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్పాల్ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవరీ అమృత్పాల్ 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ గతేడాది దాకా దుబాయ్లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్పాల్ అచ్చం పాకిస్తాన్ ఐఎస్ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న ఆందోళనలున్నాయి. ఏమిటీ ఖలిస్తాన్ ఉద్యమం? ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్లో పంజాబ్ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్ పాల్ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్ షా తమ టార్గెట్ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు! కెనడా కనెక్షన్ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖలీస్తాన్ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఖలీస్తాన్ ఉద్యమ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (సీఎఫ్జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్ నుంచి పంజాబ్ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్ మద్దతు çసంఘాలు యూఎన్ను సంప్రదించనున్నాయి! ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ? తన అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ను ఓ కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్సర్లో అమృత్ పాల్ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్ ఆప్ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి! ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్పాల్ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది. ఆప్ పాత్రపై అనుమానాలు పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు! ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి ఖలీస్తాన్ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్లో మిలిటెంట్ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. -
హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫారమ్ కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది. -
భారతదేశ ద్రోహికి అమెరికాలో శిక్ష
రెనో: భారతీయుడై ఉండి అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందిన ఓ సిక్కు వ్యక్తి అమెరికాలో కటకటాల పాలయ్యాడు. అతడు భారత్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు సహాయపడ్డాడని అక్కడి జిల్లా కోర్టు నిర్ధారించడంతో దాదాపు 15 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నాడు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డాడు. ఇతడిది వాస్తవానికి పంజాబ్. ఖలిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పంజాబ్లో పేలుళ్లకు పాల్పడే కుట్రతోపాటు భారత అధికారులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచించాడు. అందుకు కావాల్సిన సామాగ్రిని కూడా అతడే పంపిణీ చేశాడు. తమ ప్రణాళిక అమలుకు సంబంధించి ఫోన్ ద్వారా మాట్లాడాడు. అయితే, కొన్నాళ్లుగా అతడి చర్యలను గమనించిన అమెరికా అధికారులు.. 2013 డిసెంబర్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. దానికి సంబంధించి చివరి వాదోపవాదాలు మంగళవారం కోర్టు ముందుకు రాగా అతడు నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ‘భారత్ వంటి విదేశాల్లో ఉగ్రవాద దాడులతో హింసకు పాల్పడేందుకు, జన జీవితాన్ని చెదరగొట్టేందుకు బల్వీందర్ సింగ్ సహాయపడ్డాడు’ అని ఈ సందర్భంగా జడ్జీ స్పష్టం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement