-
విశ్వేశ్వరయ్య విజన్ కావాలి!
* రాజధానికి వరద ముప్పు తప్పాలంటే ఇదే మార్గమంటున్న నిపుణులు * కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల అమలు తక్షణావసరం సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబరు 28... రాజధాని మూసీ వరదల ధాటికి కొట్టుకుపోయింది. దీనికి పరిష్కారం కోసం విఖ్యాత ఇంజనీరు, దార్శనికుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను అప్పటి నిజాం ప్రభుత్వం నగరానికి ఆహ్వానించింది. ఆయన కృషి, ముందుచూపుతో మూసీ వరదల నిరోధానికి పటిష్ట ప్రణాళిక సిద్ధమైంది. తొలిసారిగా మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా ఏర్పాటైంది. ...సరిగ్గా 108 ఏళ్ల తరువాత నేడు మహానగరంలో అదే పరిస్థితి. ఎడతెగని కుంభవృష్టితో నగరం నీట మునిగింది. సెప్టెంబరులో కనీవినీ ఎరుగని రీతిలో 462 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మాసంలో సాధారణం (84 మి.మీ.) కంటే 448% అధిక వర్షపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. శతాబ్దం తరువాత నగరం మహావిపత్తును ఎదుర్కొంటోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొనుంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదనేది నిపుణులు అంటున్నారు. నగరాన్ని వరద ముంపు నుంచి కాపాడుకోవాలంటే నేడు విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ విజన్ అవసరమంటున్నారు. అలాగే... 16 ఏళ్ల క్రితం కిర్లోస్కర్ కమిటీ చేసిన విలువైన సిఫారసులు అమలు చేస్తేనే నగరానికి ముంపు నుంచి మోక్షం లభిస్తుందంటున్నారు. సుమారు రూ.12 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ సిఫారసుల అమలుతోపాటు నాలాలను, చెరువులను కబ్జాచేసి నిర్మించిన సుమారు 28వేల అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కిర్లోస్కర్ కమిటీ ఏం చెప్పింది... భారీ వర్షాలు కురిసినపుడు వరద ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు 2000లో కిర్లోస్కర్ కమిటీ విలువైన ప్రతిపాదనలు చేసింది. * ప్రధాన నగరంలో 173 ప్రధాన నాలాలు 390 కి.మీ. మేర ప్రవహిస్తున్నాయి. వీటిలో వరద ప్రవాహం 25 నుంచి 50 శాతం మాత్రమే వెళుతోంది. మిగతా ప్రవాహం సమీప కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. * నాలాలు, చెరువుల్లో ఉన్న సుమారు 28 వేల అక్రమ నిర్మాణాలను తొలగించాలి * శరవేగంగా పట్టణీకరణతో కాంక్రీట్ జంగిల్గా మారి, వర్షపునీటి ప్రవాహం ఒకేసారి పెరగడం, నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురవడం నగరం నీట మునగడానికి కారణాలుగా చెప్పింది. నాలాల విస్తరణకు చేసిన సిఫారసులివే.. * డబీర్పురా మురికి నాలాను 10 మీటర్ల నుంచి 23 మీటర్ల వరకు విస్తరించాలి * వారాసీగూడకి ఆనుకొని ప్రవహిస్తున్న నాలాను 3 మీటర్ల నుంచి 7 మీటర్ల మేర విస్తరించాలి * ఎల్.ఎన్.దర్గా వద్ద నాలాలను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరించాలి * కళాసిగూడ నల్లగుట్ట జంక్షన్ మీదుగా వెళుతున్న నాలాను 2.85 మీటర్ల నుంచి 4.3 మీటర్లకు విస్తరించాలి * మహాత్మాగాంధీరోడ్లో ఉన్న నాలాను 3 నుంచి 5.5 మీటర్లకు విస్తరించాలి * వారాసీగూడ బ్రిడ్జికి ఆనుకొని ప్రవహిస్తున్న నాలాను 3.5 మీటర్ల నుంచి 7 మీటర్లకు విస్తరించాలి డ్రైనేజీ మాస్టర్ప్లాన్... చారిత్రక హైదరాబాద్ నగర జనాభా 1925 నాటికి 4.47 లక్షలు మాత్రమే. ఇళ్లు, కుటీర పరిశ్రమల నుంచి వెలువడేమురుగు నీటిని మూసీలో కలిపేందుకు 1931లో మాస్టర్ ప్లాన్ను విశ్వేశ్వరయ్య సిద్ధం చేశారు. నాటి అవసరాల మేరకు నగరంలో సుమారు 700 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ సదుపాయం సమకూరింది. డ్రైనేజీ వ్యవస్థను రూ.14,03,500 ఖర్చుతో పూర్తి చేశారు. చరిత్రలోకి ఒకసారి.. 1908లో మూసీ వరద పోటెత్తింది. విశ్వేశ్వరయ్య 1910, 1912 ప్రాంతంలో మూసీ ఎగువ ప్రాంతంలో పర్యటించారు. భారీ వర్షాలు కురిసినపుడు 4,25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం మూసీలో చేరుతుందని లెక్కగట్టారు. ఉస్మాన్సాగర్(గండిపేట్), దాని పక్కనే హిమాయత్సాగర్ జలాశయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో 1920లో గండిపేట్(మూసీ), 1927లో హిమాయత్సాగర్ (ఈసీ) జంట జలాశయాల నిర్మాణం జరిగింది. ఈ జలాశయాల్లో నిల్వచేసిన మంచి నీటిని హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు వీలుగా డి జైన్, డ్రాయింగ్ సిద్ధం చేశారు. నీటిని శుద్ధి చేసేందుకు మీరాలం ఫిల్టర్ బెడ్కు రూపకల్పన చేశారు. జంట జలాశయాలకు ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేశారు. రాజధానికి వరద తాకిడి నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించారు. -
ఏదీ ప్రక్షాళన
► ముంచుకొస్తున్న వర్షాకాలం ► పూడుకుపోయిన డ్రైనేజీలు ► చినుకుపడితే రహదారులు గోదారే పట్టించుకోని అధికారులు సాక్షి,సిటీబ్యూరో: వర్షాకాలం సమీపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే రహదారులు గోదారులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగగా, మూతలు లేని మ్యాన్హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. గ్రేటర్లో మురుగు నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఆందుకు కారణం. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాల మధ్య సమన్వయ లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు ఉన్నాయి. నిలువెల్లా నిర్లక్ష్యం..! వేసవి పూడికతీత పనులు చేపట్టేందుకు కాగితాలపై ప్రణాళికలు సిద్ధంచేసిన జలమండలి అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. గ్రేటర్ పరిధిలో 5000 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థకు చెందిన పైపు లైన్లున్నాయి. ఇందులో 1500 కిలోమీటర్ల మేర పైప్లైన్లలో పూడిక పేరుకుపోయింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన ఎయిర్టెక్ యంత్రాలతో శుద్ధిచేస్తేనే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఉండదు. అయితే జలమండలి దీనిపై దృష్టి సారించకపోవడంతో నిత్యం డ్రైనేజీ లైన్లు పొంగి పొర్లుతున్నాయి. జలమండలి మెట్రో కస్టమర్ కేర్ సెంటర్కు రోజూ 200కు పైగా ఫిర్యాదులు అందుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ఒపెన్ నాలాలు, డ్రైనేజిలున్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్ఎంసీ చూస్తోంది. వీటిలో ఇప్పటివరకు సగం మేర మాత్రమే పూడిక తీశారు. మిగతా చోట్ల చెత్తా చెదారం పేరుకుపోవడంతో వరదనీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతుండడంతో సమీప బస్తీలు, కాలనీలు జలమయమవుతున్నాయి. పలు నాలాలకు ఫెన్సింగ్ లేదు. నాలుగేళ్ల క్రితం పెద్ద నాలాలకు అరకొర రక్షణ ఏర్పాట్లు చేసి మహానగరపాలక సంస్థ చేతులు దులుపుకోవడం గమనార్హం. ఎక్కడి చెత్త అక్కడే.. ఏటా వేసవిలో డ్రైనేజి పైపు లైన్లలో పూడికతీత తొలగించడం ఆనవాయితీ. ఈసారి పనులు పూర్తిచేయడంలో జలమండలి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ముంపు భయంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జలమండలి క్షేత్రస్థాయి అధికారులు,అత్యవసర కాల్సెంటర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. మత్యు బిలాలదీ అదే పరిస్థితి..... గ్రేటర్లో అడుగడుగునా నోళ్లు తెరచుకున్న మ్యాన్హోళ్లకు మూతలు లేక పోవడం నగర దుస్థితికి అద్ధంపడుతుంది. పగిలిపోయి శిథిలా వస్థలో ఉన్న మత్యుబిళాలపై మూతలు ఏర్పాటుచేయడంలో ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలు విఫలమౌతున్నాయి. నగరంలో 1.50 లక్షల మ్యాన్హోళ్లుండగా ఇందులో 25 వేల వరకు మూతలు లేకపోవడం గమనార్హం. కిర్లోస్కర్ కమిటీ సిఫారసులు బుట్టదాఖలు.. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాల్వల ఆధునికీకరణకు కి ర్లోస్కర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఏడేళ్ల క్రితం విలువైన సిఫారసులు చేసింది. వీటిని గ్రేటర్ పరిధిలో అమలు చేయాలంటే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొంటున్నా.. నిధులను కేటాయించడంలో నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో పరిస్థితి నానాటికి ప్రమాదకరంగా మారుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement