-
కీసరలో దేవాదాయ నిర్మాణాల కూల్చివేతకు యత్నం
కీసర: కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆలయానికి సంబంధించిన పలు నిర్మాణాలను ఓ ప్రైవేటు వ్యక్తి కూల్చివేయడానికి ప్రయత్నించడం గురువారం తీవ్ర చర్చనీయాంశమైంది. సదరు స్థలం ఓ ప్రైవేటు వ్యక్తికి చెందినది కావడంతో సమస్య ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర వాణి సమీపంలోని సర్వే నం: 200/4లో దాదాపు 11 ఎకరాల్లో భూమి ఉంది. ఈ భూమిలో ఏటా కీసరగుట్టలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎగ్జిబిషన్ స్టాల్స్, జిల్లా స్థాయి క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు అక్కడ కళా వేదిక నిర్మాణంతోపాటు, భక్తుల సౌకర్యార్థం మినీ తాగునీటి ట్యాంకులు, మరుగుదొడ్లు తదితర నిర్మాణాలను ప్రభుత్వం నిర్మించింది. అయితే ఈ సర్వే నంబర్లోని ఎనిమిదిన్నర ఎకరాల భూమి బోగారం గ్రామానికి చెందిన చేవూరి రఘునందనరావు పేరిట ఉంది. ఈ స్థలాన్ని వాడుకుంటున్నందుకు పట్టాదారును స్థలదాతలుగా కీసర దేవస్థానం గుర్తిస్తూ వస్తోంది. కూల్చివేతలకు ప్రయత్నించిన పట్టాదారుడు అయితే గురువారం ఈస్థలాన్ని స్వాధీ నం చేసుకునే క్రమంలో పట్టాదారు అక్కడి నిర్మాణాలను కూల్చివేసేందుకు జేసీబీ సాయంతో పనులు చేయిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అప్పటికే ఆ స్థలంలో మోదుగు వృక్షాల చుట్టూ ఉన్న దిమ్మెలను కూల్చివేశారు. ఈ సమాచారాన్ని తహసీల్దార్ రవీందర్రెడ్డికి, కీసరగుట్ట దేవస్థానం వారికి స్థానికులు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తహసీల్దార్ కూల్చివేతలను నిలిపివేయించారు. రికార్డుల ప్రకారం స్థలం ప్రైవేటు వ్యక్తికి చెందినదైనప్పటికి చాలా ఏళ్లుగా ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇక్కడ పలు నిర్మాణాలను చేపట్టిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వీటిని తొలగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదన్నారు. స్థలం మొత్తం సర్వేచేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని, అంతవరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని స్థలయజమానికి స్పష్టం చేశారు. -
కీసర జాతరకు ఏర్పాట్లు ముమ్మరం
కీసర, న్యూస్లైన్: ఈనెల 25 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగనున్న కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పా ట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయ గోపురాలకు, మహా మండపానికి పంచరంగులు వేస్తున్నారు. ఈ పనుల కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా కార్మికులను రప్పించారు. క్యూలైన్ల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. భక్తులు సేద తీరేందుకు చలువపందిళ్లు వేస్తున్నారు. కీసరగుట్ట, ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి దిగువ గుట్ట వరకు విడిది చేసే యాత్రికుల సౌకర్యార్థం గతంలో ఏర్పాటు చేసిన కులాయిలకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మరమ్మతు లు ప్రారంభించారు. గతంలో నిర్మించిన మినీ ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు మరమ్మతులు చేపడుతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటరమణ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల వద్ద విద్యుత్ సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. జాతర సందర్భంగా 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేసేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించే ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. పార్కింగ్, ఆర్టీసీ బస్టాం డ్, క్రీడాప్రాంగణం, ఎగ్జిబిషన్ స్టాల్స్ వద్ద చదును చేసే పనులు, మరుగుదొడ్ల ఏర్పాటు, స్నానఘట్టాల ఏర్పాటు తదితర పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు కలెక్టర్ కార్యాలయం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉందని, ఒకటిరెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన వివిధ కమిటీల పనితీరును ఈనెల 18న జేసీ చంపాలాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈనెల 18 లోపు రంగులు వేసే పనులను పూర్తవుతాయని ఆలయ చైర్మన్ తటాకం రమేష్శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement