-
సూర్యనారాయణ శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్లో ఎం.సూర్యనారాయణ, జి.సిద్దయ్య, కె.శ్రీకాంత్ తొలి రౌండ్లో విజయాలను నమోదు చేసుకున్నారు. రాఘవ్ చెస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేశవ మెమోరియల్ కాలేజి సర్దార్ పటేల్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సూర్యనారాయణ (1) రణధీర్(0)పై నెగ్గాడు. ఇతర పోటీల్లో జి.సిద్దయ్య(1) ఎస్.శ్రీరోహిత్(0)పై, శ్రీకాంత్(1) ఫణి కుమార్(0)పై, ఎస్.కె.బ్రహ్మన్ (1) నాగ విజయ కీర్తి(0)పై, పి.అనీష్(1) పి.కాంతి కుమార్(0)పై నెగ్గారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పి.కె.గార్,్గ ఆంధ్రాబ్యాంక్ డీజీఎమ్ వై.అమర్నాథ్, ఏపీసీఏ ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి, రాఘవ చెస్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
సచిన్.. క్రికెట్ దేవుడు: శ్రీకాంత్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్పై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ సచిన్ దేవుడు లాంటి వాడని అభివర్ణించారు. తన 200వ టెస్టు అనంతరం క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్టు మాస్టర్ ప్రకటించిన నేపథ్యంలో శ్రీకాంత్ స్పందించారు. మాస్టర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొట్టడం ఎవరికీ సాధ్యంకాదని శ్రీకాంత్ అన్నారు. సచిన్ తొలి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు నిలకడైన ఆటతీరుతో ఒకేలా ఆడుతున్నాడన్నారు. -
క్వార్టర్స్ లో శ్రీకాంత్
టోక్యో: సంచలన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ కె.శ్రీకాంత్, కేరళ కుర్రాడు హెచ్.ఎస్.ప్రణయ్... జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అన్సీడ్ శ్రీకాంత్ 21-12, 21-16తో కజ్తెర్ కొజాయ్ (జపాన్)పై విజయం సాధించాడు. 30 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీ.. స్మాష్లతో చెలరేగాడు. కీలక సమయంలో నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించాడు. ఆరంభంలో ఇద్దరు ప్లేయర్లు మెరుగ్గా ఆడటంతో స్కోరు 7-7తో సమమైంది. అయితే ఏపీ కుర్రాడు కాస్త దూకుడు పెంచి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గాడు. చివర్లో మరో నాలుగు పాయింట్లతో గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో జపాన్ ఆటగాడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. 5-5, 10-10, 16-16తో స్కోరు సమం చేశాడు. ఈ దశలో శ్రీకాంత్ బలమైన స్మాష్లతో హోరెత్తించాడు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి మ్యాచ్ను వశం చేసుకున్నాడు. మరో మ్యాచ్లో జయరామ్ 21-13, 11-21, 21-18తో యుచి కెదా (జపాన్)పై పోరాడి నెగ్గగా; ఆనంద్ పవార్ 12-21, 16-21తో టాప్సీడ్ లీ చోంగ్వీ (మలేసియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. డబుల్స్లో మను ఆత్రి-సుమీత్ రెడ్డి 17-21, 16-21తో జియోలాంగ్ లీ-జిహాన్ క్యూ (చైనా) చేతిలో కంగుతిన్నారు. ప్రణయ్ సంచలనం మరో ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ప్రపంచ 56వ ర్యాంకర్ హెచ్.ఎస్.ప్రణయ్ సంచలనం సృష్టించాడు. 21-14, 13-21, 21-17తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ జాన్ ఓ జార్గెన్సెన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత ప్లేయర్ పోరాట స్ఫూర్తిని కనబర్చాడు. తొలి గేమ్లో 1-4తో వెనుకబడ్డా 9-9తో స్కోరును సమం చేశాడు. తర్వాత బలమైన స్మాష్లతో విరుచుకుపడి వరుసగా పాయింట్లు సాధించాడు. రెండో గేమ్లో 4-2 ఆధిక్యంలోకి వచ్చిన జార్గెన్సన్ను ఓ దశలో ప్రణయ్ అధిగమించినా.. చివరి వరకు అదే జోరును కనబర్చలేకపోయాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో వ్యూహాత్మకంగా ఆడిన భారత కుర్రాడు 18-17 ఆధిక్యంలో నిలిచాడు. తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచి మ్యాచ్ను నిలబెట్టుకున్నాడు. సింధు ఓటమి మహిళల ప్రిక్వార్టర్స్లో ఏపీ అమ్మాయి పి.వి.సింధు 6-21, 17-21తో అకెని యమగుచి (జపాన్) చేతిలో ఓడింది. 32 నిమిషాల ఈ మ్యాచ్లో సింధు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయింది. స్మాష్లు సంధించడంతో పాటు నెట్ వద్ద పూర్తిగా విఫలమైంది. తొలి గేమ్లో నిరాశపర్చిన సింధు... రెండో గేమ్లో పుంజుకునే ప్రయత్నం చేసింది. అయితే క్వాలిఫయర్ యమగుచి భిన్నమైన షాట్లతో భారత క్రీడాకారిణిని కట్టిపడేసి సంచలనం సృష్టించింది. దిగజారిన సింధు ర్యాంక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో... హైదరాబాద్ ప్లేయర్ పి.వి.సింధు రెండు ర్యాంక్లు దిగజారింది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ఆమె 12వ స్థానంలో నిలిచింది. స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ 14వ, గురుసాయిదత్ 23వ ర్యాంక్ల్లో ఉన్నారు. అజయ్ జయరామ్ ఏడు స్థానాలు కోల్పోయి 30వ ర్యాంక్లో, ఆనంద్ పవార్, సాయి ప్రణీత్, కె.శ్రీకాంత్, సౌరభ్ వర్మలు వరుసగా 37, 38, 39, 46వ ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement