-
కేటీపీపీలో లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్లో మరమ్మతుల సందర్భంగా లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రానికే బొగ్గు నిల్వ లక్ష మెట్రిక్ టన్నులకు చేరింది. అధికారుల ప్రణాళిక ప్రకారం రవాణా జరిగితే మరో 20 రోజుల్లో 2.50లక్షల టన్నుల బొగ్గు కేటీపీపీకి చేరుతుంది. -
బొగ్గుయార్డులో లారీ క్లీనర్ సజీవ సమాధి
గణపురం :మండలంలోని చెల్పూరు శివారులోని కేటీపీపీలోని బొగ్గుయార్డ్లో శనివారం జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ దర్శనాల సమ్మోదర్(23) సజీ వ సమాధి అయ్యాడు. భూపాలపల్లిలోని రాంనగర్లో నివాసముం టున్న సింగరేణి కార్మికుడు దర్శనాల వెంకటయ్య, విమల దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వారి లో ఒక కుమారుడైన సమ్మోదర్ బొగ్గు లారీపై క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో భూపాలపల్లి నుంచి లోడుతో కేటీపీపీకి వచ్చిన రెండు లారీలు యార్డ్లో బొగ్గును డంపు చేస్తున్న సమయంలో సమ్మోదర్పై బొగ్గుపడింది. ఈ విషయాన్ని రెండు లారీల డ్రైవర్లు గమనించలేదు. డంపు చేసిన తర్వాత క్లీనర్ కోసం వెతకగా కనిపించలేదు. అతడి కోసం అరగంట సేపు వెతికారు. తర్వా త అనుమానం వచ్చి అక్కడ డంపు చేసిన బొగ్గును ప్రొక్లయిన్తో తోడగా ముక్కలుముక్కలుగా సమ్మోదర్ మృ తదేహం బయటపడింది. తల కనిపిం చలేదు. ప్రమాదానికి కారణమైన లారీలు వేర్వేరు ట్రా¯న్పోర్టులకు సం బంధించినవి. బొగ్గు డంపు చేసే సమయంలో యార్డ్కు సంబంధించిన అధికారులు లేకపోవడంతో సంఘటన సమాచారం కచ్చితంగా తెలి యడం లేదు. పోలీసులు కూడా సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎస్సై ప్రవీన్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య మంజుల, నాలుగు నెలల కూతురు పాప ఉన్నారు. మృతుడి కూతురు పరిస్థితి విషమం సంఘటన స్థలంలో సమ్మోదర్ మృతదేహంపై పడి భార్యతోపాటు తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగి లేలా విలపించారు. సుమారు నాలు గు నెలలు కూడా నిండని అతడి కూతురికి ఫిట్స్ వచ్చాయి. దీంతో గాబరా పడ్డా బంధువులు చేతిలో ఇనుప వస్తువు పెట్టి కాళ్లు చేతులు మర్దన చేశారు. భర్త మరణం, కూతురి పరిస్థితిని చూసి మంజుల బోరున విలపించింది. పాపను స్థానిక అస్పత్రికి తరలించారు. -
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం : గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) 500 మెగావాట్ల ప్లాంట్లో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు మరమ్మతు చేపట్టి తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. బాయిలర్ ట్యూబ్ల్లో తలెత్తిన సమస్యతోనే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. -
కేటీపీపీలో కొనసాగుతున్న మరమ్మతులు
విద్యుత్ ఉత్పత్తికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. శనివారం బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజనీర్ల బృందం జనరేటర్ను పరిశీలించింది. ఈసందర్భంగా జనరేటర్ను రెండు భాగాలుగా వీడదీసి గమనించగా కోర్స్ భాగంలో లోపం బయటపడింది. జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులను పర్యవేక్షించారు. ప్లాంట్లో సంవత్సరం పాటు మరమ్మతులు చేసే బాధ్యత బీహెచ్ఈఎల్ కంపెనీదే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అనుభవం కల్గిన ఇంజనీర్లను రప్పిం చారు. జనరేటర్లో విడిభాగాలు విదేశాల నుంచి, కొన్ని చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నందున మరమ్మతులు పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజులు పట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. -
ఆదినుంచీ అవాంతరాలే
600 మెగావాట్ల ప్లాంట్పై కమ్ముకున్న చీకటి తెరలు ఈ నెలలో ఇప్పటికి మూడుసార్లు ఉత్పత్తికి బ్రేక్ మరమ్మతులకు నెల రోజులు పట్టవచ్చంటున్న అధికారులు గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో గల కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లోని 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లో ఉత్పత్తికి పలుమార్లు అంతరాయం కలుగుతుండటంతో నష్టాల బాట పట్టింది. ప్లాం ట్పై చీకటి తెరలు కమ్ముకున్నాయి. ఆగస్టు నెలలో ఇప్పటికే మూడుసార్లు ఉత్పత్తి నిలిపోయింది. గత ఆరు రోజులుగా ప్లాంట్లో ఉత్పత్తికి బ్రేక్ పడింది. జూలైలోనూ రెండు పర్యాయాలు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి 5న విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. అప్పటి నుంచి ఏకధాటిగా 15 రోజులు ఉత్పత్తి అయిన సందర్భం లేదు. వాస్తవానికి ప్లాంట్ ప్రారంభిం చిన రెండు నెలలకు కానీ సీఓడీ ప్రకటన రాలేదు. సీఓడీ జరిగిన తరువాత ప్లాంట్లో వారం, పది రోజులకోమారు విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం జనరేటర్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేయడానికి నెల రోజులు పట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్లాంట్లో తరుచూ అంతరాయం ఏర్పడుతుండడంతో కేటీపీపీకి భారీ నష్టం వాటిల్లుతోంది. 600 మెగావాట్ల ప్లాంట్ నుంచి ఉత్పత్తి జరిగే విద్యుత్ 24 గంటలకు 14.5 మిలియన్ యూనిట్లు ఉంటుంది. యూనిట్కు రూ.5 చొప్పున విలువ కట్టినా రోజుకు కోట్ల రూపాయల నష్టం ఉంటుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement