-
నేత్రపర్వం భీమేశ్వరుని పరిణయం
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన శ్రీకుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామికి, బాల త్రిపుర సుందరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ విగ్రహాలకు నంది వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. రాత్రి విగ్రహాలకు ధ్వజారోహణ అనంతరం ఆలయం తోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై స్వామి, అమ్మవారి విగ్రహాలను ఉంచి వేద పండితులు కల్యాణం జరిపిం చారు. అన్నవరం ఆలయ ఈఓ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆ ఆలయ వేదపండితులు, స్థానిక ఆలయ వేదపండితులు కల్యాణం నిర్వహించారు. కంచికామకోటి పీఠం ఆస్థాన పండితుడు చంద్రాభట్ల చింతామణిగణపతిశాస్త్రి, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్మోహన్, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, బి.త్రిమూర్తులు, చుండ్రు సూర్యభాను, గొల్లపల్లి కామరాజు, దూది రాజు, బలుసు శ్రీనివాసు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, ఆలయ భక్త సంఘం నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పారిశ్రామిక వేత్తలు కర్రి సత్యనారాయణ, పసల పద్మరాఘవ రావు, డాక్టరు పసల సత్యానందరావు, మట్టపల్లి రమేష్, గంజి, బూరయ్య, సీసీఎస్ రాజు ఆర్వీ సుబ్బరాజు, ఆర్ వీరభద్రరావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 27న స్వామి శ్రీపుష్పయాగోత్సవం జరుగుతుంది. కమనీయం కుక్కుటేశ్వరుని కల్యాణం పిఠాపురం : ‘దక్షిణ కాశీ’గా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి కల్యాణం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. భక్త జనసందోహం నడుమ స్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్ల పరిణయం ఆద్యంతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మ వార్లను పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజవాహనంపై గ్రామోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్రా్తలు, నగలతో అలంకరించి, ఊరేగింపుగా తీసుకు రంగు రంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపచేశారు. వేదపండితులు చెరుకుపల్లి విశ్వనాథశర్మ, ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మల ఆధ్వర్యంలో అర్చకులు విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. రాత్రి 8.32 గంటలకు స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. పుణ్యాహవచనం, కంకణధారణ, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్రధారణ, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణల మధ్య జరిగిన కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దంపతులు, ఈవో చందక దారబాబు, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా వరుణ యాగం
వాన కురవాలి.. సిరులు పొంగాలి పాదగయ జలంలో కుక్కుటేశ్వరునికి అభిషేకం వెయ్యి కలశాల నీటితో గర్భగుడి దిగ్బంధం పిఠాపురం : రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వరునికి సహస్రఘటాభిషేకం నిర్వహించారు. వేయి కలశాల నీటితో స్వామివారి గర్భాలయాన్ని నింపివేసి స్వామిని జలదిగ్బంధం చేశారు. కుక్కుటేశ్వరస్వామి ఆలయంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, విశ్వేశ్వరస్వామి ఆలయాలలో సహస్రఘటాభిషేకాలు నిర్వహించారు. తొలుత వేదపండితులు మట్టికలశాలకు శాస్త్రయుక్తంగా పూజలు నిర్వహించారు. పాదగయ పుష్కరిణి చుట్టూ వేదమంత్రాలతో పూజలు నిర్వహించి కుక్కుటేశ్వరస్వామికి పాలాభిషేకం, అనంతరం జలాభిషేకం నిర్వహించారు. గర్భగుడిని పాదగయ జలంతో నింపివేసి శివలింగం పూర్తిగా మునిగేలా జలదిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ఈఓ చందక దారబాబు పర్యవేక్షించారు. కాగా సామర్లకోట, ద్రాక్షారామ, అయినవిల్లి, తలుపులమ్మలోవ వంటి పుణ్యక్షేత్రాల్లోను వరుణయాగాలు జరిగాయి. పంపాలో ఋష్యశృంగుని విగ్రహం నిమజ్జనం అన్నవరం: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి గత మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు ఆదివారం ముగిశాయి. ఉదయం 8 గంటలకు సత్యదేవుడు, అమ్మవారు, ఋష్యశృంగమహర్షికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు వరుణ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య దేవస్థానం పండితులు, ఈఓ నాగేశ్వరరావు హోమద్రవ్యాలను సమర్పించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవార్లు, ఋష్యశృంగమహర్షికి పండితులు వేదాశీస్సులందచేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మూడు రోజులు పూజలందుకున్న ఋష్యశృంగమహర్షి విగ్రహాన్ని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య కొండదిగువన పంపా నదిలో నిమజ్జనం చేశారు. తొలుత రత్నగిరిపై పండితులు ఆ విగ్రహాన్ని శిరసున ధరించి ఆలయ ప్రాకారం చుట్టూ ప్రదక్షణ నిర్వహించారు. ప్రధాన వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు గాడేపల్లి వేంకట్రావు తదితరులు కార్యక్రమాలను నిర్వహించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి అన్నవరంలో వాతావరణం మేఘావృతమై వర్షం కురిసింది. ఇదంతా వరుణ యాగ మహిమేనని పండితులు చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement