-
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా
కళ్యాణదుర్గం (అనంతపురం): అందంగా లేదని కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటన కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో నివాసముంటున్న కుళ్లాయప్ప బేల్దారి పని చేసుకునేవాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి చెందిన అపర్ణ (27)ను ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలంగా కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవపడేవాడు. అందంగా లేవని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపి విడాకులు తీసుకునేందుకు అపర్ణ సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కుళ్లాయప్ప మద్యం మత్తులో ఇంటికి చేరుకుని రోజువారీగానే భార్యతో గొడవ పెట్టుకుని కత్తితో అపర్ణ పొట్టలో బలంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అపర్ణను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. హతురాలి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
అప్పులబాధతో ఆగిన రైతు గుండె
– మూడేళ్లుగా చేతికందని పంటలు – రూ.మూడు లక్షలకు చేరిన అప్పులు – అరకొరగా పంటనష్ట పరిహారం అప్పుల వ్యధతో ఓ రైతు గుండె ఆగింది. వర్షాభావంతో మూడేళ్లుగా పంటలు చేతికందకపోగా.. పంటల సాగు కోసం చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటడంతో అర ఎకరం తరి భూమి కూడా బీడుగా మారింది. వీటికి తోడు ప్రభుత్వం మంజూరు చేసిన పంటనష్ట పరిహారం అరకొర మొత్తం జమకావడంతో అప్పులు ఎలా చెల్లించాలన్న మనోవేదన ఆ రైతును కుంగదీసింది. ఫలితంగా గుండె ఆగింది. - నల్లమాడ నల్లమాడ మండలంలోని నల్లసింగయ్యగారిపల్లికి చెందిన బోడెద్దుల కుళ్లాయప్ప (65) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. బోరుబావి కింద ఉన్న అర ఎకరం పొలంలో సత్తువ కోసం గొర్రెలు తోలించేందుకు శనివారం ఉదయం కాపరుల చేత తడికెలు నాటిస్తున్నాడు. ఉన్నఫళంగా గుండెపోటు రావడంతో అక్కడే అతడు కుప్పకూలాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడు. అతడికి భార్య అక్కులమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అప్పులబాధ తాళలేక గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి భార్య బోరున విలపించింది. వరుస కురువుతో.. అతడికి 3.53 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల నుంచి వేరుశనగ సాగు చేస్తున్నాడు. వానలు లేక, పంటలు పండక పైసా కూడా చేతికందలేదు. గత ఏడాది కూడా పంట ఎండిపోవడంతో గొర్రెలకు వదిలేశాడు. బోరుబావి కింద అర ఎకరంలో పొద్దుతిరుగుడు పంట వేస్తే నీళ్లు లేక ఎండిపోయింది. పంట పెట్టేందుకు, బోరు కోసం చేసిన అప్పులు రూ.3 లక్షలకు పైనే ఉన్నాయి. పంట నష్ట పరిహారం కూడా తక్కువగా పడింది. అప్పులు ఎలా చెల్లించాంటూ రోజూ మధనపడుతుండేవాడని భార్య వాపోయింది. పంట నష్ట పరిహారం వస్తే అప్పులోళ్లకు వడ్డీలైనా కట్టాలనుకున్నాం. అదికూడా అరకొరగా జమకావడంతో ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి, భార్య పరిస్థితి విషమం తాడిపత్రి : కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో భర్త మృతి చెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన కుళ్లాయప్ప (55), దస్తగిరమ్మ దంపతులు. రెండు రోజుల కిందట భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన కుళ్లాయప్ప మంగళవారం విషపుగుళికలు మింగాడు. దీంతో భార్య కూడా ఆ గుళికలను మింగింది. ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేసి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కుళ్లాయప్ప మృతి చెందాడు. దస్తగిరమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఎఐ ఆంజనేయులు కేసు దర్యాప్తుచే స్తున్నారు. -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ముదిగుబ్బ (ధర్మవరం) : మండల పరిధిలోని ఈదులపల్లికి చెందిన రైతు కుళ్లాయప్ప(62) ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, బంధువుల కథనం మేరకు.. ఆయన తనకున్న ఆరు ఎకరాల పొలంలో బోరు వేసుకుని రెండు మూడేళ్ల క్రితం నుంచీ అరటి, టమాట లాంటి పంటలు సాగు చేసి నష్టాలు చవిచూశారు. అప్పులయ్యాయి. ఇప్పుడు సాగులో ఉన్న టమాట, వేరుశనగ పంటలు కూడా ఆశాజనకంగా లేవు. దీనికితోడు కుటుంబ సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతుండేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పొలంలోనే పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను గుర్తించిన కుటుంబీకులు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. కానీ కోలుకోలేని ఆయన బుధవారం సాయంత్రం మృతి చెందారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. కుళ్లాయప్పకు భార్య నరసమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పిల్లలందరికీ పెళ్లిళ్లయిపోయాయి. -
'చార్ధామ్' బాధలో వ్యక్తి మృతి
జోసెఫ్ నగర్: అనంతపురం నగరంలో విషాదం చోటుచేసుకుంది. తన కుటుంబ సభ్యులు ఛార్ధామ్ యాత్ర వరదల్లో చిక్కుకున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం పట్టణం లోని జోసెఫ్ నగర్లో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన కుళ్లాయప్ప (68) కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఈ నెల 15న ఛార్ ధామ్ యాత్రకు వెళ్లారు. రెండు రోజుల నుంచి ఉత్తరాఖండ్లో భారీగా వరదలు పోటెత్తడంతో తాము అందులో చిక్కుకున్నామని.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తండ్రి కుళ్లాయప్పకు తెలియజేశారు. దీంతో.. ఆవేదన చెందిన కుళ్లాయప్ప గుండె ఆగి చనిపోయాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement