-
తహసీల్దార్ సస్పెన్షన్.. కుందుర్పి దాటి వెళ్లొద్దు
సాక్షి, అనంతపురం అర్బన్: ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలను జగన్ సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ నాగలక్ష్మి చర్యలు చేపట్టారు. అవకతవకలు, అక్రమాలపై విచారణ చేయించడమే కాక, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం కూడేరు తహసీల్దారు శ్రీనివాసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా కుందుర్పి విడిచి వెళ్లకూడదని ఆదేశాలిచ్చారు. ఇక కుందుర్పి తహసీల్దారుగా అదనపు బాధ్యతలను బ్రహ్మసముద్రం తహసీల్దారు బాలకిషన్కు అప్పగించారు. అత్మకూరులో ఉండగా అవినీతి కుందుర్పి తహసీల్దారు తిప్పేస్వామి గతంలో ఆత్మకూరు తహసీల్దారుగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో గొరిదిండ్ల, సనప, ఆత్మకూరు, మదిగుబ్బ, పి.యాలేరు. బి.యాలేరు రెవెన్యూ గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత ఆర్డీఓ ద్వారా విచారణ జరిపించారు. వెబ్ల్యాండ్లో అవకతవకలకు పాల్పడి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. అవకతవకలు నిర్ధారిస్తూ ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ►గొరిదిండ్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 5–6లో 5.17 ఎకరాలు అన్సెటిల్డ్ భూమికి (ఖాతా నెంబరు 1000010) వెబ్ల్యాండ్లో రేనాటి వరలక్ష్మి పేరును పట్టాదారుగా మార్చారు. 788–3 సర్వే నెంబరులో 4.90 ఎకరాలు అన్సెటిల్డ్ భూమి (ఖాతా నెంబరు 1000010) డి.భీమానాయక్ పేరును పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 604–3లో నాగలక్ష్మికి చెందిన 2.85 ఎకరాలు భూమిని కొలిమి సల్మా అనే మహిళను పట్టాదారుగా మార్చారు. సర్వే నెంబరు 1122–1లో ఎలమకూరి తనుజాకు చెందిన 4.98 ఎకరాలను డి.గీంతాజలి పేరున మార్చారు. ►సనప రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 282–11లో చిన్నప్పకు చెందిన 4.15 ఎకరాల భూమిని పి.వై.ఎల్లప్ప పేరున మార్చారు. ►ఆత్మకూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు 373లో హరిజన మంత్రి ముత్యాలప్పకు చెందిన 0.50 ఎకరాల భూమిని వై.సుందరమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 261–1లో ఎస్.నల్లమ్మకు చెందిన 3.42 ఎకరాల భూమిని లలితమ్మ పేరున పట్టా చేశారు. సర్వే నెంబరు 502–3లో అంకంపల్లి ఓబుళపతికి చెందిన 2.10 ఎకరాల భూమిని ఎ.సోమశేఖర్ పేరున మార్చారు. సర్వే నెంబరు 2–1లో బోడిపాటి నరసమ్మకు చెందిన ఐదు ఎకరాల భూమిని వెంటేసులు, బి.హరికుమార్ పేరున మార్చారు. సర్వే నెంబరు 122–బి1ఎ3లో ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన ఐదు ఎకరాలను ఎస్.నాగరత్నమ్మ పేరున మార్చారు. ►మదిగుబ్బలో సర్వే నెంబరు 136–6లో 1.25 ఎకరాల మిగులు భూమిని సద్దల పెద్ద నారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 35–5లో బండి అపర్ణమ్మకు చెందిన 3.85 ఎకరాలను బండి ముత్యాలమ్మ పేరున మార్చారు. సర్వే నెంబరు 143–5బిలో 0.80 ఎకరాలు (లేని భూమి) తలారి నరసింహులు పేరున మార్చారు. ►పి.యాలేరులో సర్వే నెంబరు 403–1ఎలో మండల బొమ్మయ్యకు చెందిన ఐదు ఎకరాలను ఎం.మంజుల పేరున మార్చారు. సర్వే నెంబరు 181–1లో 2.50 ఎకరాల మిగులు భూమిని వై.సౌభాగ్య పేరున మార్చారు. సర్వే నెంబరు 58–1, 2లో ఎస్.దుబ్బరామయ్యకు చెందిన 0.98 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి బాబు పేరున మార్చారు. అదే సర్వే నెంబర్లలో దుబ్బరామయ్యకు చెందిన 0.97 ఎకరాలు, 0.96 ఎకరాల భూమిని సుగాలి లక్ష్మీనారాయణ పేరున మార్చారు. సర్వే నెంబరు 7–3లో జి.లక్ష్మన్నకు చెందిన 2.09 ఎకరాలను జి.శివారెడ్డి పేరున మార్చారు. సర్వే నెంబరు 453–6లో 4 ఎకరాల మిగులు భూమిని జె.మమత పేరున మార్చారు. ►బి.యాలేరులో సర్వే నెంబరు 85–1లో అన్సెటిల్డ్ భూమిని ఎనుముల అఖిల పేరున మార్చారు. సర్వే నెంబరు 224–1ఎలోని 2.20 ఎకరాలను (లేని భూమి) టి.లక్ష్మిదేవి పేరున మార్చారు. -
రాజులదేవర మూలవిరాట్ కోసం ఘర్షణ
కుందుర్పి : రాజుల దేవర స్వామి మూలవిరాట్ తమదంటే తమదని మలయనూరు, వడ్డెపాళ్యం గ్రామస్తులు శనివారం తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. వివరాలు..వందేళ్ల క్రితం వడ్డెపాళ్యంలో రాజులదేవర స్వామిని ప్రతిష్టించి ఆలయం నిర్మించారు. అయితే ప్రతి ఏటా ఉగాది పర్వదినాల్లో స్వామివారిని మలయనూరుకు తీసుకువెళ్లి అక్కడున్న ఓబుళదేవర స్వామి, మల్లయ్య దేవరస్వామిని కలిపి మలయనూరు, వడ్డెపాళ్యంలో గ్రామోత్సవం నిర్వహించేవారు. ఇటీవల మలయనూరు గ్రామంలో ఆయా దేవుళ్లకు సంబంధించి ఓపెద్ద ఆలయం నిర్మించారు. వడ్డెపాళ్యం రాజులదేవర స్వామిని మలయనూరుకు తీసుకువచ్చి గ్రామోత్సవం నిర్వహించారు. అయితే జాతర ముగిసిన తరువాత స్వామివారి మూలవిరాట్ను అక్కడే ఉంచుకున్నారని వడ్డెపాళ్యం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్వామివారి మూలవిరాట్ను మలయనూరు ప్రజలు ఇవ్వకపోవడంతో పక్షం రోజుల క్రితం వడ్డెపాళ్యం గ్రామపెద్దలు కేసు పెట్టారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు, తహసీల్దార్ రమేషన్తో పాటు డీఎస్పీ వెంకటరమణ రంగంలోకి దిగి మూలవిరాట్ను వడ్డెపాళ్యం ప్రజలకు ఇవ్వాలని సూచించినా మలయనూరు ప్రజలు ససేమిరా అనడంతో శనివారం రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
వైభవంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం
కుందుర్పి: శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బ్రహ్మరథోత్సవం బుధవారం కుందుర్పిలో అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి ఆలయ ధర్మకర్త సత్యనారాయణశాస్త్రి, తహశీల్దార్ రమేషన్ సర్పంచ్ పెద్దనరశింహప్ప తదితరులు రథాన్ని కొంతదూరం లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషాశ్రీ చరణ్ తదితరులు స్వామి వారిని దర్శించుకొని హోమంలో పాల్గొన్నారు. రథోత్సవానికి నియోజక వర్గం నుంచేగాక కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
కుందుర్పి ఎస్ఐ వేణుగోపాల్ సస్పెన్షన్
అనంతపురం సెంట్రల్ : కుందుర్పి ఎస్ఐ వేణుగోపాల్ను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజశేఖరబాబు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్రికలకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపారు. కుందుర్పి స్టేషన్ పరిధిలో ఓ కేసులో విచారణ చేయకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, కౌంటర్ కేసులు పెట్టించడం, ప్రాపర్టీస్ సరిగా చూపకపోవడం, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అవినీతి ఆరోపణలపై ఎస్పీ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో విచారణ అనంతరం నివేదిక ఆధారంగా అతన్ని సస్పెండ్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. -
విషజ్వరంతో విద్యార్థిని మృతి
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన ఏడోతరగతి విద్యార్థిని పుష్ప (12) సోమవారం విషజ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్యసిబ్బంది తెలిపారు. నెలరోజులుగా జ్వరంతో బాధపడుతున్న పుష్పకు అనంతపురం, బెంగళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించామని, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement