-
ప్రభుత్వ భూముల్లో.. పెద్దల పాగా !
- ఖాళీ స్థలాలను ఆక్రమించేస్తున్న అక్రమార్కులు - రిజిస్ట్రేషన్ అధికారులూ కుమ్మక్కు ! - అమ్మకాలు చేస్తున్నా పట్టించుకోని అధికారులు ఇక్కడ కనిపిస్తున్న వెంచర్ కురుగుంట పొలం సర్వేనంబర్ 94లోని 42 ఎకరాల 9 సెంట్ల స్థలంలో వెలిసింది. ఈ స్థలాన్ని ముగ్గురు ముస్లీం మెనార్టీ నేతలు ఆక్రమించుకొని వెంచర్ వేసి ఒక్కొక్క సెంట్ను రూ.20 వేల చొప్పున 90 శాతం మేర ఇప్పటికే అమ్మకాలు జరిపేశారు. తప్పుడు ఎన్ఓసీ (నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్) సృష్టించి రిజిస్ట్రేషన్ అధికారులతో కలిసి ఈ వంక స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులకు రిజిస్ట్రేషన్ సైతం చేయించి రూ. కోట్లు కొల్లగొట్టారు. అయితే వాస్తవానికి రెవెన్యూ రికార్డులలోని డైక్లాట్ ప్రకారం ఈ స్థలం తడకలేరు వంక స్థలంగా ఉంది. రెవెన్యూ చట్టం మేరకు వంక పోరంబోకు స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలను మంజూరు చేయరు. అయితే ఈ సర్వే నంబర్ను 94–1, 2, 3 విభజించించారు. అడంగల్ను పరిశీలిస్తే 94–1 కె.సాలమ్మకు 2.97 ఎకరాలు, 94–2లో 24.68 ఎకరాల స్థలం వంక, 94–3 ప్రమీళమ్మకు 5 ఎకరాలు, వసుంధరమ్మ పేరిట 4.32 ఎకరాల స్థలం ఉన్నట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. అయితే ఆన్లైన్లోకి ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయో ఆ లోగుట్టు మాత్రం రెవెన్యూ అధికారులకే తెలియాలి. అనంతపురం రూరల్: ప్రభుత్వ జాగా కనిపిస్తేచాలు కులసంఘాల పేరిట పాగ వేస్తున్నారు. నగర శివారులోని ప్రభుత్వ భూములు మొత్తం పేదల మాటున పెద్దలు హస్తగతం చేసుకున్నారు. అత్యంత విలువైన స్థలాలను కళ్లేదుటే ఆక్రమించుకొని దర్జాగా అమ్మేసుకుంటున్నారు. ఒక్క కురుగుంట గ్రామంలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగకుండా వంక పోరంబోకు స్థలాలను సైతం ఆక్రమించుకొని అమ్మేసుకుంటున్నారు. ఒక్కోరికి ఒక్కో న్యాయం చెరువు, వంక పోరంబోకు స్థలాలకు పట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మంజూరు చేయరు. అందులో నిర్మించుకున్న ఇళ్లను తొలగిస్తామని అధికారులు చెబుతూనే నెల క్రితం బుక్కరాయసముద్రం చెరువులో విజయనగరకాలనీ వాసులు నిర్మించుకున్న 200 ఇళ్లను అకాలంగా కూల్చివేశారు. అయితే కురుగుంటలోని వంకపొరంబోకు స్థలంలో నిర్మించుకున్న ఆక్రమణలు అధికారులకు కనిపించడం లేదా? అని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలి అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అమ్మేసుకుంటున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేదల మాటున పెద్దలు తన్నుకుపోతున్న ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉందని అంటున్నారు. కేసులు నమోదు చేస్తాం - అన్వర్హుస్సేన్, తహసీల్దార్, అనంతపురం ప్రభుత్వ, వంక పోరంబోకు స్థలాలను ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కురుగుంట గ్రామంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైన మాట వాస్తవమే. విచారణ జరిపి ప్రభుత్వ భూములకు హద్దులను ఏర్పాటు చేస్తాం. -
వ్యక్తి దారుణహత్య
భార్య, కుమారుడే నిందితులు.. తాగి విసిగిస్తున్నాడని కడతేర్చారు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం పోలీసుల విచారణతో బయటపడ్డ వాస్తవాలు అర్ధరాత్రి పూట నడిరోడ్డుపై శవం. ఆ మార్గంలో వెళ్లేవారు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించగా తలపై బలమైన గాయమైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని, ఆ ఇంటికెళ్లారు. భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగచూశాయి. ప్రతి రోజూ తాగి ఇంటికొచ్చి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో తామే కడతేర్చామని వారు ఒప్పుకున్నారు. అనంతపురం సెంట్రల్ : అనంతపురం మండలం కురుగుంట పంచాయతీలోని మల్లయ్య కొట్టాలకు చెందిన సుబ్బయ్య (48) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. సుబ్బయ్య కుటుంబం తోలుబొమ్మలాటలతో జీవనం సాగించేది. ఇటీవల కాలంలో సుబ్బయ్య తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో పాటు వీధిలోని వారితో కూడా గొడవకు దిగేవాడు. అడ్డొచ్చిన భార్య సునందమ్మ, కుమారుడు నరేష్లపైనా చేయి చేసుకునేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో తాగి గొడవపడ్డాడు. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య సునందమ్మ, కుమారుడు సరేష్లు కట్టెతో తలపై బలంగా కొట్టడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని సమీపంలోని అనంతపురం – కళ్యాణదుర్గం రహదారిపై పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. రహదారిపై మృతదేహం పడిందన్న సమాచారం అందుకున్న రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ జగదీష్లు అర్ధరాత్రే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించారు. తలపై తప్ప మృతదేహంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చింది. మృతుని వివరాలు కొనుగొన్న పోలీసులు నేరుగా వారి ఇంటికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మరకలు ఆరకపోవడం, హత్యకు ఉపయోగించిన కట్టె లభ్యం కావడంతో భార్య, కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. హతుడి అన్న రామదాసు ఫిర్యాదు మేరకు భార్య సునందమ్మ, కుమారుడు సురేష్లపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
Advertisement