-
నిబద్ధతకు చిరునామా సీఎం జగన్
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): నిబద్ధతకు నిలువుటద్దంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలుస్తారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఏయూ టీఎల్ఎన్ సభా మందిరంలో డాక్టర్ జీకేడీ ప్రసాద్ వ్యాస సంకలనం ‘జనం కంటిరెప్ప జగన్’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పుస్తక రచయిత జీకేడీని అభినందించారు. అధికార భాషా సంఘం సభ్యుడు, ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ రెండేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలనపై విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనంగా పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్ మాట్లాడుతూ.. వారి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేఘం వర్షాన్ని, విత్తు పంటని, వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ మోహన రెడ్డిని మనకు ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ పరిపాలన అందిస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్ జీకేడీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పరిపాలనపై ప్రత్యేక కవితా సంపుటిని త్వరలో తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలపై కవితలు ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తమ కవితలకు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. సంబంధిత పోస్టర్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్ చైర్మన్ కె.వెస్లీ, ఏయూ హెచ్ఆర్డీసీ సంచాలకులు ఆచార్య ఎన్ఏడీ పాల్, న్యాయ కళాశాల ఆచార్యులు డి.సూర్యప్రకాశ రావు, పుస్తక ప్రచురణకర్త, బీహెచ్.ఎస్.ఆర్ అండ్ వి.ఎల్ డిగ్రీ కళాశాల సెక్రటరీ–కరస్పాండెంట్ డి.సువర్ణరాజు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
ఏలూరు సిటీ : పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు హాజరయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.లక్ష్మీప్రసాద్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తులు స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ .2 లక్షలలోపు కలిగి ఉండాలని, జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వివరాలకు ఏలూరు గవరవరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం 08812–232477, 99667 76077లో సంప్రదించాలని సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement