-
లక్ష్మీపేటలో వ్యక్తి తుపాకీతో హల్చల్
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా పెద్దబయిలు మండలం లక్ష్మీపేటలో ఓ వ్యక్తి సోమవారం తుపాకీతో హల్చల్ చేశాడు. దాంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. గ్రామస్థులంతా సదరు వ్యక్తిని బంధించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లక్ష్మీపేటకు చేరుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తుండగా.... అక్కడి నుంచి పరారైయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు, గ్రామస్థులు ప్రయత్నించారు. కానీ అతడు అప్పటికే పరారైయ్యాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
దళితుల ముంగిట న్యాయ దేవత
లక్ష్మీపేట(వంగర), న్యూస్లైన్:లక్ష్మీపేట దళితుల చిరకాల కోరిక నెరవేరింది. తమపై జరిగిన అమానుష దాడి ఘటనపై తమ సమక్షంలోనే విచారణ జరపాలన్న వారి డిమాండ్ను మన్నించి సాక్షాత్తు న్యాయదేవతే వారి ముంగిటికి వచ్చింది. ఇక న్యాయ ప్రక్రియ వేగం పుంజుకుంటుందన్న భరోసా కల్పించింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన 2012 జూన్ 12నాటి లక్ష్మీపేట దళితుల ఊచకోత కేసు విచారణకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు శనివారం వంగర మండలం లక్ష్మీపేటలో ప్రారంభమైంది. హైకోర్టు పోర్టుఫోలియో జడ్జి ఏవీ శేషసాయి దీన్ని ప్రారంభించారు. కోర్టును ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం కోర్టు లోపలి భాగాన్ని పరిశీలించారు. కోర్టు లోపల విచారణను కూడా పర్యవేక్షించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయం ప్రజల ముంగిటికే వస్తోందని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం అందరికీ సహజ, సమాన న్యాయం అందజేయడమే న్యాయవ్యవస్థ లక్ష్యమని అన్నారు. చట్ట ప్రకారం లక్ష్మీపేట కేసు విచారణ జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు మంచివారని కితాబిస్తూ.. జిల్లాలో కోర్టుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి డి.ఎస్.భానుమతి మాట్లాడుతూ లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. బాధితులకు ఈ కోర్టు ద్వారా న్యాయం జరుగుతందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు సకల సౌకర్యాలు:ఏజేసీ లక్ష్మీపేట ఘటనను జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్ఎస్ రాజ్కుమార్ అన్నారు. బాధితులైన దళితులను ఆదుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఘటనలో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు రూ.18.75 లక్షలు, 19 మంది క్షతగాత్రులకు రూ. 22.08 లక్షల నష్టపరిహారం అందించామని చెప్పారు. ఐదు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 88 కుటుంబాలకు అంత్యోదయ అన్నయోజన కార్డులు, మిల్క్మిషన్ పథకం కింద పాడిగేదెలు మంజూరు చేశామన్నారు. బాధితులకు పునరావాసం, ఉపాధి హామీ పనుల కల్పన తదితర చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి సతీమణి దుర్గాంబ, లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు ఇన్చార్జి జడ్జి బి.వెంకటేశ్వరరావు, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎన్.మలయాద్రి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు వి.వెంకటరమణ, జిల్లా ఏఎస్పీ బీడీవీ సాగర్, పాలకొండ ఆర్డీవో తేజ్భరత్, జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జిలు, బార్ అసోషియేషన్ల ప్రతినిధులు, న్యాయవాదులు. డీఎస్పీ దేవానంద్శాంతో, సోషల్ వెల్ఫేర్ డీడీ అచ్చుతానందగుప్త, ఎస్సీ కార్పొరేషన్ ఈఈ జగ్గారావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, లక్ష్మీపేట బాధితులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement