-
ఎకనమిక్ కారిడార్కు భూసేకరణ పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: రాయపూర్–విశాఖ ఎకనమిక్ కారిడార్కు భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎస్ డాక్టర్ సమీర్శర్మను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ కారిడార్తో ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని చెప్పారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల సీఎస్లు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాయపూర్–విశాఖపట్టణం ఎకనమిక్ కారిడార్, కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సమీర్శర్మ మాట్లాడుతూ ఎకనమిక్ కారిడార్ కోసం 798 హెక్టార్లకుగాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు చెప్పారు. రోడ్సైడ్ ఎమినిటీస్కు మరో 50 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణకు అడ్వాన్స్ పొజిషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేస్తున్నట్లు తెలిపారు. సహజవాయువు పైపులైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొదటిదశ పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ తెలిపారు. -
2020లో మెట్రో-3 పరుగు
సాక్షి, ముంబై: కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టనున్న మెట్రో-3 ప్రాజెక్టు పనులు 2016 మార్చి నుంచి ప్రారంభ మవుతాయని ముంబై మెట్రో రైల్వే కార్పొరేషన్ ఎండీ అశ్విని బిడే వెల్లడించారు. రైలు మార్గం అత్యధిక శాతం భూగర్భంలో నుంచి ఉండడం వల్ల స్థల సేకరణకు ఇబ్బంది ఉండదని బిడే అభిప్రాయపడ్డారు. వర్లీ, ప్రభాదేవి, లోయర్ పరేల్, ముంబై సెంట్రల్, చర్చిగేట్ తదితర ప్రాంతాల్లో స్థల సేకరణ ఇబ్బందిగా మారడంతో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తాత్కాలిక, శాశ్వత పునరావాసం కల్పించాల్సిన కుటుంబాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలు బృందం సేకరిస్తుందని చెప్పారు. పునరావసంపై మాడా, బీఎంసీ, ఎస్ఆర్ఏ, బీపీటీ తదితర సంస్థలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి 2016 మార్చి నుంచి పనులు ప్రారంభిస్తామని బిడే తెలిపారు. అందుబాటులో చార్జీలు 2020లో మెట్రో-3 రైళ్లు పరుగులు తీస్తాయని, వాటి చార్జీలు కూడా నిర్ణయించామని బిడే చెప్పారు. ప్రాజెక్టు పనులు స్వయంగా ప్రభుత్వం చేపట్టడంతో చార్జీలు పేదలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మెట్రో-3 చార్జీలు వర్సొవా-అంధేరీ- ఘాట్కోపర్ మధ్య సేవలు అందిస్తున్న మెట్రో-1తో చార్జీలతో సమానంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం మెట్రో-1 కనీస చార్జీలు రూ.10 ఉండగా గరిష్ట చార్జీలు రూ.40 వరకు ఉన్నాయి. కాగా, మెట్రో-3 చార్జీలు రూ.11 నుంచి రూ.37 వరకు ఉంటాయని చెప్పారు. ప్రాజెక్టును 2020 ఆఖరు వరకు పూర్తిచేస్తామన్నారు. రైలు మార్గానికి భూగర్భంలో అడ్డువచ్చే నీటి పైపులు, విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లు, గ్యాస్, డ్రైనేజీ లైన్లను తొలగించేందుకు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని, ఇప్పటికే కొన్ని శాఖల నుంచి తాత్కాలిక అనుమతులు లభించాయని చెప్పారు. శరవేగంగా భూ సేకరణ మెట్రో-3 ప్రాజెక్టు కోసం భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయని బీడే తెలిపారు. ప్రాజెక్టుకు మొత్తం 39.9 హెక్టార్ల స్థలం అవసరముందని, 27.29 హెక్టార్ల స్థలం తాత్కాలికంగా, 11.90 హెక్టార్ల స్థలాన్ని శాశ్వతంగా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి 2,044 చెట్లను నేలమట్టం చేయాల్సి రావడంతో ఇంతే సంఖ్యలో మరోచోట మొక్కలను నాటడానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించామన్నారు. పర్యావరణ, భౌగోళికంగా అధ్యయన పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. రూ.23,136 కోట్లతో చేపట్టనున్న మెట్రో-3 వినియోగంలోకి వస్తే నగరంలో దాదాపు 35 శాతం ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని, ప్రతీరోజు 2,43,390 లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని బీడే అన్నారు. ప్రస్తుతం కఫ్ పరేడ్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా గంటన్నరకుపైగా సమయం పడుతుండగా మెట్రో-3 ద్వారా కేవలం 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. మెట్రో-3 రైలు ద్వారా ప్రతీరోజు 14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. 2030లో ఈ సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement