-
కేజ్రీవాల్ కరెన్సీ డిమాండ్కు బీజేపీ కౌంటర్
-
గుజరాత్ ఎన్నికల వేళ కేజ్రీవాల్ వింత డిమాండ్
-
ఇండియన్ కరెన్సీ నోట్లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ముద్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెలా కొత్తగా ప్రింట్ చేసే నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఈ దేవుళ్ల ఫోటోలు కూడా ఉండేలా చూడాలని సూచించారు. అయితే ఇలా ఎందుకు చేయాలో కూడా కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి ఫోటో కరెన్సీ నోటుపై ఉంటే దేశప్రజలకు ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందటానికి దోహదపడుతుందని చెప్పారు. కష్టాలను దూరం చేసే దేవుడిగా పేరున్న వినాయకుడి ఫోటోతో ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఇండోనేసియా లాంటి దేశంలోనూ కరెన్సీపై వినాయకుడి ఫోటోను ముద్రిస్తున్నట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. అక్కడ 20వేల నోటుపై గణేషుడి ఫోటో ఉంటుంది. ఢిల్లీలో వర్చువల్గా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్.. రోజురోజుకు పతనమవుతున్న రూపాయి విలువ గురించి మొదట ప్రస్తావించారు. ఆర్థికవ్యవస్థ బలంగా ఉండాలంటే స్కూళ్లు, హాస్పిటళ్లు నిర్మించాలని, మౌలికవసతులు మెరుగుపరచాలని సూచించారు. ఒక్కోసారి ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా సత్ఫలితాలు రావని కేజ్రీవాల్ అన్నారు. దేశంలోని వ్యాపారస్తులంతా రోజూ తమ పని మొదలు పెట్టేముందు లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేస్తారని పేర్కొన్నారు. అందుకే ఆ దేవుళ్ల ఫోటోలు కరెన్సీ నోట్లపై ముద్రిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఆర్థికవ్యవస్థ మెరుగుపడేందుకు దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్రానికి గురువారం లేదా శుక్రవారం లేఖ రాస్తానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖర్గే.. -
అందుకే ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగిస్తారు
దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీమాతకు చాలా ప్రాశస్య్తం ఉంది. దీపావళి పండుగ మూడో రోజున లక్ష్మీదేవి తన భక్తుల ఇంటికి వెళుతుంది. అమ్మవారిని ఇంటిలోకి రమ్మనడానికి ప్రతీకగా భక్తులు తమ ఇంటి గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించి లోనికి ఆహ్వానిస్తారు. దేశంలో భిన్న రూపాలలో, అవతారాలలో కొలువుదీరిన లక్ష్మీమాతకు పూజ చేస్తారు. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లతో కూడా అమ్మవారిని పూజిస్తారు. సంపద, సుఖసంతోషాలు, సతానం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి సందర్భంగా దేశంలోని ప్రసిద్ధమైన లక్ష్మీదేవి ఆలయాలు ఇవి.. 1) లక్ష్మీ నారాయణ మందిరం( బిర్లా మందిరం), న్యూఢిల్లీ ఈ ఆలయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహితంగా మనకు దర్శనమిస్తారు. ప్రసిద్ధ మందిరంగానే కాక, ఢిల్లీలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా పేరొందింది. ఈ మందిరంలో దీపావళితో పాటు శ్రీ కృష్ణుని జన్మష్టామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాక గుడి చుట్టూ శివుడు, రామభక్త హనుమాన్, వినాయకుడు, దుర్గ మాత మందిరాలతో పాటు చిన్న బౌద్ధ మందిరం కూడా ఉంది. 2)శ్రీపురం గోల్డెన్ టెంపుల్, వెల్లూర్ ఈ మందిరం తమిళనాడులోని (వేలూరు) వెల్లూర్లో ఉంది. గర్భగుడికి మూడు వైపులా నీరు , ఒకవైపు ద్వారం వుంటుంది. మలైకుడి ప్రాంతానికి దగ్గర్లోని చిన్న కొండపై లక్ష్మీదేవి కొలువై ఉంది. గర్భగుడి బంగారంతో కప్పబడి, సువర్ణ రంగులో మిళితమై ఉండటం చేత దీనికి బంగారు గుడి అనే మరో పేరుంది. దేశంలోని అతిపెద్ద మందిరాలలో శ్రీపురం ఆలయం ఒకటి. 3)మహలక్ష్మీ మందిరం, కొల్హాపూర్ హిందువుల పవిత్ర 108 శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ ప్రముఖ తీర్ధ స్థలంగా ప్రసిద్ధిగాచింది. నవరాత్రుల సందర్భంగా అంబాదేవిగా కొనియాడబడే ఈ దేవి దర్శనానికి.. భక్తులు కొల్హాపూర్కు తండోపతండాలుగా క్యూ కడతారు. స్వయంగా లక్ష్మీదేవి నడియాడిన నేల కావడంతో... విష్ణుదేవునికి ఈ ఆలయక్షేత్రం అంటే చాలా ఇష్టమని భక్తుల నమ్మిక. చాలుక్యులు నిర్మించిన ఈ మందిరం మహారాష్ట్రలో పూనేకు సమీపంలో ఉంది. 4)అష్టలక్ష్మీ మందిరం, చెన్నె ఈ ఆలయంలో లక్ష్మీమాత ఎనిమిది రూపాలకు పూజ చేస్తారు. అష్టలక్ష్మి - ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అవతారాలలో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మీ ఆలయం చెన్నెలోని ఇలియట్స్ బీచ్\ బీసెంట్ బీచ్కు సమీపంలో ఉంది. సంపద, జ్ఞాన దేవతయిన అష్టలక్ష్మి, భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవతగా పేరొందింది. 5)లక్ష్మీదేవి మందిరం, హసన్ తొలితరం హోయసలుల నిర్మాణ శైలి ఈ ఆలయంలో ఉట్టిపడుతుంది. కర్ణాటకలోని హసన్ దగ్గర ఉన్న ఈ ఆలయంలో ప్రాచీన వాస్తుకళ మనకు కనిపిస్తుంది. 6)మహలక్ష్మీ మందిరం, ముంబై మహారాష్ట్రలో ఉన్న ఈ ఆలయం ముంబైవాసులకు అత్యంత ప్రీతి పాత్రమైంది. ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు దర్శనమిస్తాయి. హార్న్బీ వెల్లార్డ్ నిర్మాణం చేపడుతున్నపుడు, పాథారే ప్రభు అనే ఇంజనీరుకు వర్లి సమీపంలో దేవి విగ్రహం ఉందనే కల వస్తుంది. దీంతో అక్కడి పరిసరాల్లో తవ్వకాలు చేపట్టిన అతనికి లక్ష్మీమాత విగ్రహం దొరుకుతుంది. వెంటనే ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. -
బతికుండగానే చంపేశారు!
కుందుర్పి: వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారనే కక్షతో మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన లక్ష్మీదేవికి చెందిన రేషన్కార్డును రద్దు చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కుందుర్పికి చెందిన లక్ష్మీదేవి, కుమారుడు రమేష్కు తెల్లరేషన్ కార్డు ఉంది. వీరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కావడంతో జన్మభూమి కమిటీ సభ్యులు కక్ష కట్టారు. మూడు నెలల క్రితం లక్ష్మీదేవి మరణించినట్లు రికార్డుల్లో నమోదు చేసి రేషన్కార్డులో పేరు తొలగించేశారు. దీంతో ఆమె పేరిట సరుకులు అందకుండా పోయాయి. ఈ విషయంగా మూడు నెలలుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రమేష్ వాపోతున్నారు. కలెక్టరేట్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు తహసీల్దార్ కార్యాలయంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తన తల్లి పేరిట కార్డును పునరుద్ధురించడంతో పాటు నిత్యావసర సరుకులు అందేలా చేయాలని కోరుతున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement