-
పాలమూరు కాంగ్రెస్లో టికెట్ ప్రకంపనలు..
సాక్షి, మహబూబ్నగర్ : పాలమూరు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టిక్కెట్లు ఆశించి భంగపడినవారు హస్తం గూటిని వీడుతున్నారు. రాత్రికి రాత్రే కొందరు అసమ్మతి నేతలు కండువాలు మార్చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు షాక్లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ వచ్చిన సమయంలోనే నాగం జనార్థనరెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదే సమయంలో కారు పార్టీలో జోష్ పెంచుతోంది. పాలమూరు రాజకీయాలు వస్తున్న మార్పులు ఏంటి ? ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసంతృప్త నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీకి గుడ్బై చెప్పి కారెక్కుతున్నారు. ఈ పరిణామాలు వేగంగా సాగుతుండటంతో జిల్లా రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన తనయుడు రాజేష్రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత కాంగ్రేస్ పార్టీలో చేరటంతో గులాబీ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కాంగ్రేస్లో చేరిపోయారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులకు సంబంధించి మొదటి జాబితాలో నాగర్కర్నూల్, కొల్లాపూర్, గద్వాల సీట్లు ఆశించిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి దక్కడంతో నాగం జనార్థనరెడ్డి, జగదీశ్వరరావులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నాగం ఇప్పటికే కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా తమ అనుచరుతలతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. తనకు సీటు రాకపోవటంతో ఆగ్రహంగా ఉన్న నాగంకు అధికార పార్టీ నేతలు గాలం వేశారు. మత్రులు కేటీఆర్..హరీష్ రావులు నాగంను కలిసి మంతనాలు జరపడం.. పార్టీలోకి ఆహ్వానించటం అందుకు ఆయన సమ్మతించటం ...వెంటనే నాగం ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలవటం చకచకా సాగిపోయాయి. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కూడా టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించారు. ఎర్ర శేఖర్కు జడ్చర్ల కాకుండా చివర్లో నారాయణపేట నుంచి పోటీచేయాల్సిందిగా పార్టీ పెద్దలు సూచించారు. ఎర్ర శేఖర్ అందుకు నిరాకరించారు. చివరికి ఎర్ర శేఖర్ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి సంప్రదించి..కేటీయార్ సమక్షంలో పార్టీలో చేర్చుకున్నారు. వనపర్తిలో సీటు ఆశించి భంగబడ్డ మెగారెడ్డికి మద్దతుగా వనపర్తిలో కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని మెగారెడ్డికి ఆయన అభిమానులు సూచించారు. మీ అభిష్టం మేరకే నడుచుకుంటానని మెగారెడ్డి ప్రకటించారు. దేవరకద్ర నుంచి సీటు ఆశించిన కొండా ప్రశాంత్రెడ్డి సైతం తన అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళం నిర్వహించారు. కాంగ్రేస్ అభ్యర్ది మధుసూధన్రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. మరోవైపు సోమవారం నాడు దేవరకద్ర అభ్యర్థిని మార్చాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో విధ్వంసం సృష్టించారు. మక్తల్ సీటు ఆశించిన నేత కూడా అనుచరులతో మాట్లాడి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. ఇలా ఎక్కడికక్కడ అసంతృప్త నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇలా అన్ని చోట్లా రెబల్స్ బరిలో దిగితే కాంగ్రేస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంటుందని పార్ఠీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్న వేళ తాజా ఘటనలు నేతల్ని కలవరపెడుతున్నాయి. స్వంత జిల్లాలో అధిక స్దానాలు గెలవాలని భావించిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి నేతలు పార్టీని వీడటం తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాస్త వెనకబడిందనుకున్న అధికార పార్టీకి ఒకేరోజున పెద్దస్థాయిలో కలిసి వచ్చింది. బీజేపీ నేత పి.చంద్రశేఖర్..కాంగ్రెస్ నేతలు నాగం జనార్థనరెడ్డి, ఎర్ర శేఖర్లు గులాబీ పార్టీలో చేరడం వారికి సముచిత స్థానం ఉంటుందన్న సంకేతాలు పార్టీ పెద్దలు ఇస్తుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతోంది. ఇటీవలే..వనపర్తికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు..మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడ బీఆర్ఎస్ పార్టీలో చేరటం బీయారెస్కు కలిసివచ్చే అంశాలుగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ సీనియర్ నేతల్ని బీఆర్ఎస్ నాయకత్వం వెంటనే సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీల్లోకి నాయకుల రాకపోకలతో కింది స్థాయి వరకు మార్పులు జరుగుతాయా? లేక అక్కడితో ఆగిపోతాయా? అనేది చూడాలి. -
కిరణ్కు మిగిలేది బెర్లిన్ గోడ ముక్కేనా?
దొంగలు పడ్డ ఆరు నెలలకు.. ఏదో అయినట్లు హడావుడి చేసిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడంలేదు. నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఆయనతో పాటు పలు సందర్భాల్లో ఆయన చూపిస్తున్న బెర్లిన్ గోడ ముక్క కూడా ఉండేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అనుంగు అనుచరులుగా భావిస్తున్నవాళ్లంతా ఒక్కొక్కరుగా ఆయన పెట్టిన పార్టీకి దూరం అయిపోతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారం ఊపందుకోక ముందే జేఎస్పీకి నాయకులు దండం పెట్టేస్తున్నారు. మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ పక్కచూపులు చూస్తున్నారు. అందరికంటే ముందుగా మేల్కొన్న వ్యక్తి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్. టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమైపోయినట్లు సమాచారం. మరో సీనియర్ నేత సాయిప్రతాప్ కూడా కిరణ్ పార్టీలో ఉంటే పరువు దక్కదని డిసైడైపోయారట. అందరికంటే ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెంట కుడిభుజంగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా నేత పితాని సత్యనారాయణ కూడా.. ఇప్పుడు జేఎస్పీలో ఉంటే కష్టమని నిర్ణయించుకుని టాటా చెప్పేద్దామనుకుంటున్నట్లు వినికిడి. ఇదంతా చూస్తుంటే చివరాఖరుకు పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరు, ఆయనతో పాటు ఆయన వెంట ఉన్న బెర్లిన్ గోడముక్క మాత్రమే మిగిలినా ఆశ్యర్యపోనవసరం లేదని జేఎస్సీ వర్గాలే గుసగుస లాడుతున్నాయట.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement