-
ఐదు ప్రశ్నలడుగుతా.. ఆన్సరివ్వు
సాక్షి, శ్రీకాకుళం: గతం.. గతం.. రజనీకాంత్ స్టైల్గా బీడీ తాగుతూ బాబా ఫోజులో చెబుతున్నాడు టీవీలో. ఈ డైలాగు నాయకుడు సర్వేశ్వరరావుకు తెగ నచ్చేసింది. గత ఎన్నికల హామీల గురించి అడిగినప్పుడు ఈ పద్ధతి ఫాలో అయిపోతే బెటరని ఫిక్సయిపోయాడు. ప్రచారం మొదలైంది. వెనుక పాటలు.. ముందు మాటలు.. మధ్యలో ఆటలు.. ఇలా కోలాహలంగా ఎన్నికల ప్రచా రం సాగుతోంది. రథంపై నుంచి సర్వేశు దుమ్ము రేగుతున్నా పట్టించుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు. జనం ఎవరికీ ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదని, శాపనార్థాల్లాంటివి ఇప్పు డు వినిపిస్తే బాగోదని ముందు జాగ్రత్తగా పాటల సౌండ్ పెంచాలని అప్పటికే ఆదేశాలిచ్చి ఉన్నాడు. ప్రచారం వీధులన్నీ దాటి కూడలికి చేరింది. ఇది ప్రసంగ సమయం.. సర్వేశు రెడీ అయిపోయాడు.. పొద్దున్నే బట్టీ పట్టిన ప్రసంగ పాఠమంతా గుర్తు చేసుకుని మైకందుకున్నాడు. ‘సోదర సోదరీమణులారా..’ అంటూ మొదలుపెట్టేసరికి.. అటు వైపు నుంచి కూడా ‘ప్రియమైన నాయకుడా..’ అని సౌండ్ వినిపించింది. ఒక్క మైకు మాత్రమే తీసుకురావాలని, అది తాను మాత్రమే వాడాలని సర్వేశు చాలా గట్టిగా చెప్పాడు.. మరీ ఈ రెండో మైకు ఎవరిది..? అని అనుమానం వచ్చి చుట్టుపక్కల చూశాడు. జనం మధ్యలో సీతారామారావు చేతి లో ఉన్న మైక్ చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటిది అని అమాయకంగా అడిగాడు సర్వేశు. ‘హామీలిస్తారు.. అమలు చేయరు. మాటలు చెబుతారు.. మర్చిపోతారు. ఇలా ప్రచారం చేస్తారు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. అందుకే నా మైక్ నేనే తెచ్చుకున్నా..’ అని సీతారామారావు ఏ మాత్రం బెరుకు లేకుండా చెప్పేసరికి సర్వేశు గొంతు తడారిపోయింది. గత ఎన్నికల్లో 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు కదా.. ఎన్ని పనులు చేశారు.. మొదటి ప్రశ్న వేశాడు సీతారామారావు. గతం గతం.. ఇప్పుడెందుకు అవి.. ఆ పుస్తకం కూడా ఇప్పుడు దొరకడం లే దు అని సర్వేశు లోగొంతుతో అన్నాడు.. ‘మీరిలా అంటారనే ఓ కాపీ నా దగ్గరే పెట్టుకున్నా..’ అని సీతారామారావు తాను తెచ్చిన కాపీని జనానికి చూపించాడు.. ‘మా ఊరికి కాంప్లెక్స్ కట్టిస్తానని.. ముప్పై ఏళ్లుగా చెబుతున్నారు.. కట్టడానికి ఏమైంది..’ రెండో ప్రశ్న.. ‘కట్టేస్తే వచ్చే ఎన్నికల్లో చెప్పడానికి ఏమీ ఉండదు కదా.. అందుకే కట్టలేదు.. గతం గతం..’ అని సర్వేశు వీరాభిమాని ఒకడు ఆవేశంగా సర్వేశు చేతిలో మైకు లాగేసుకుని చెప్పేశాడు.. అనుచరుడి స్వామిభక్తి చూసి నవ్వాలో, ఏడవాలో తెలీక సర్వేశు కోపంతో ఓ చూపు చూసి జనానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అర్థంకాక తల వంచేశాడు.. ‘సరే.. ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా.. మన ఊరి గురించి అసెంబ్లీలో ఎప్పుడైనా ప్రస్తావించారా..?’ సీతారామారావు సూటిగా, ఇంకాస్త గట్టిగా మూడో ప్రశ్న అడిగాడు.. ‘గతం.. గతం.. ఇప్పుడు ఓటెయ్యండి ప్రతి రోజూ మన ఊరి పేరే అసెంబ్లీలో జపం చేస్తా..’ హమ్మయ్య ఒక్కదానిౖకైనా సమాధానం చెప్పా అని తృప్తిగా తలెత్తాడు సర్వేశు.. ‘ఇప్పుడా చాన్స్ లేదు గానీ.. మీ వెనుక ఉన్నవారికి తప్ప ఊరిలో వారికెవరికైనా మంచి చేశారా..?’ నాలుగోది స్పష్టంగా అడిగాడు సీతారామారావు.. ‘ఎందుకు చెయ్యాలి అందరికీ.. అందరూ ఓట్లేస్తారా.. ఎవరు ఓట్లేస్తే వారికే చెయ్యాలి గానీ..’ అని అదే అభిమాని ఆవేశం ఆపుకోలేక సర్వేశు చేతి నుంచి మళ్లీ మైకు లాగేసుకున్నాడు.. ‘అలా చేస్తే ఎమ్మెల్యే వెనక తిరిగే వారికి మాత్రమే టాక్స్ కట్టమనండి.. మాపై పన్నులు రుద్దకండి.. జనం డబ్బు అందరికీ ఖర్చు చేయాలి.. జనమంతా పన్నులు కడుతుంటే.. కొందరికే ఖర్చు చేయడం ఏమిటి... జనం డబ్బును అనుచరులకు దోచి పెట్టడానికి మీరెవరు..?’ అని సీతారామారావు అడిగే సరికి సర్వేశుకు సమాధానం దొరకలేదు.. ‘సరే.. దేశమంతా రోడ్లు వేస్తే ఇక్కడా వేశారు. దేశమంతా కాలువలు తవ్వితే ఇక్కడా తవ్వారు. అవి కాకుండా ఇన్నేళ్లుగా మిమ్మల్ని గెలిపిస్తున్న జనం కోసం మీరు మాత్రమే ప్రత్యేకించి చేసిన పనేమైనా ఉందా?’ ఐదో ప్రశ్నలను ఘాటుగా అడిగాడు సీతారామారావు.. ప్రత్యేకం అంటేనే.. సర్వేశ్వరరావుకు మాటలు ఆగిపోతాయి. ఈ సారి అభిమాని కూడా ఏమీ చెప్పలేకపోయాడు. మౌనమే సమాధానంగా అంతా స్టేజిపై నిలుచుండిపోయారు. ‘నీకు ఐదు ప్రశ్నలే ఎక్కువ.. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిననాడే జనం ముందుకు రా..’ అంటూ సీతా రామారావు మైకు ఆపేసి వెళ్లిపోయాడు.. అప్పటికి ఊపిరి పీల్చుకున్న సర్వేశు ఐదు కాదు ఐదు వందల సమస్యలకు సమాధానాలిస్తా.. నాకు ఓటెయ్యండి అంటూ సీతారామారావు లేడనే ధైర్యంతో గట్టిగా అనేశాడు. గతం గతం.. మార్పునకు స్వాగతం అంటూ ఓ కొత్త ఓటరు గట్టిగా అనేసరికి జనానికి విషయం అర్థమై సభకు నమస్కారం పెట్టేశారు. -
ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలేవీ?
కడప అగ్రికల్చర్ : రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలకు దూరమయ్యామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నేతలు గురువారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొండూరు మండలం గంగాదేవిపల్లె, ఊడవగండ్లల్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మాట్లాడుతూ కరువు నేపథ్యంలో రాజశేతుసాగర్ ద్వారా నీరు ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కరెంటు బిల్లులు ఎప్పుడు కూడా ఎక్కువ రాలేదని, ఈ ప్రభుత్వంలో తలకుమించిన భారంగా మారాయని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. బీకోడూరు మండలం పెదుళ్లపల్లెలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ప్రజలు మాట్లాడుతూ రెండున్నరేళ్లు అవుతున్నా గ్రామానికి ఒక్క పక్కాగహం మంజూరుకాలేదన్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె పంచాయితీలోని అరేపల్లె, గాంధీనగర్ల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్లను నిర్మించుకుంటే బిల్లులు రాలేదని మహిళలు వాపోయారు. డ్వాక్రా రుణాలు మాఫీకాక పోవడంతో వడ్డీతో సహా కట్టలేకపోతున్నామని ఆవేదనతో తెలిపారు. రోడ్లు నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement