-
'నన్ను మ్యాచ్ ఫిక్స్ చేయమన్నారు'
కౌలాలాంపూర్ : ఇప్పటివరకూ పలు క్రీడలకే పరిమితమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు బ్యాడ్మింటన్ కూడా సోకినట్లు కనబడుతోంది. తాజాగా బ్యాడ్మింటన్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. గతంలో ఒక మ్యాచ్ను ఫిక్స్ చేయాల్సిందిగా బుకీలు సంప్రదించిన విషయాన్ని మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వి వెల్లడించాడు. అయితే దానిని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. దీనిలో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సహచర క్రీడాకారులను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని లీ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ గౌరవమే తనకు ముఖ్యమని చెప్పాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు మలేసియా ప్లేయర్లను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఈ నెల చివర్లో విచారించనుంది. -
క్వార్టర్స్లో సైనా, సింధు
► లీ చోంగ్ వీ, లిన్ డాన్ ఓటమి ► ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న సైనా... కెరీర్లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న పీవీ సింధు... ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సైనా 21-19, 21-14తో నిచావోన్ జిందాపోల్ (థాయ్లాండ్)పై గెలుపొందగా... సింధు 17-21, 21-19, 21-16తో బుసానన్ ఒంగ్బుమ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)ను ఓడించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో బే యోన్ జు (దక్షిణ కొరియా)తో సింధు; సుంగ్ జి హున్ (దక్షిణ కొరియా)తో సైనా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులందరూ తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా... పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో భారత జోడీలన్నీ ప్రిక్వార్టర్ ఫైనల్ను దాటలేకపోయాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మొహిత సహదేవ్-సంజన సంతోష్ జంట 21-16, 21-7తో సీహెచ్ పూర్ణిమ-రచిత సహదేవ్ జోడీని ఓడించింది. పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంట 19-21, 12-21తో చెన్ హంగ్ లింగ్-చీ లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో... జిష్ణు సాన్యాల్-శివమ్ శర్మ ద్వయం 17-21, 15-21తో లీ షెంగ్ ము-సై చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో... ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ జోడీ 18-21, 15-21తో కిమ్ జీ జంగ్-కిమ్ సా రంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. మిక్స్డ్ డబుల్స్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహీ దేవాంగన్; ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి; మనూ అత్రి-అశ్విని పొన్నప్ప జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశాయి. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) 19-21, 19-21తో వీ నాన్ (హాంకాంగ్) చేతిలో, నాలుగో సీడ్ లిన్ డాన్ (చైనా) 13-21, 20-22తో సన్ వాన్ హో (కొరియా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయి ఇంటిదారి పట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement