-
బాణసంచా దుకాణాల లెసైన్స్లు రద్దు
విశాఖపట్నం: ఈ ఏడాది విశాఖలో బాణసంచా విక్రయూల దుకాణాలకు లెసైన్స్లు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. హుదూద్ తుఫాన్ కారణంగా నగరంలో ఎక్కడికక్కడ ఎండిన చెట్లు పేరుకుపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నం దున ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నగరంలో మందుగుండు సామగ్రి నిల్వ ఉన్న గోదాములను కూడా సీజ్ చేయనున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో తుఫాన్ తరువాత శాంతి భద్రతల నిర్వహణపై సంబంధిత ఎస్హెచ్వోలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు, ఒడిశాకు చెందిన బృందాలు సుమారు రెండు వేల మంది పోలీసులు తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్టు వివరించారు. ప్రస్తుతం నగరంలో పరిస్థితులు మెరుగు పడటంతో శాంతిభద్రతలపై దృష్టి సారిస్తున్నామన్నారు. గత వారం రోజులుగా నగరం అంధకారంలో ఉండటంతో పలు ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు వస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో పికెటింగ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భాదితులు తమ సమస్యలను 100 నంబరుకు లేదా పోలీస్ స్టేషన్లకు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలో సీపీ నియూమకం నగర పోలీస్ కమిషనర్ను త్వరలో నియమించనున్నట్టు డీజీపీ రాముడు తెలిపారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన శివధరరెడ్డి తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజీగా బదిలీపై వెళ్లినప్పటి నుంచి ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్గా అతుల్సింగ్ ఉన్నారని చెప్పారు. ఆయన అంగీకరిస్తే ఆయన్నే పూర్తిస్థారుు పోలీస్ కమిషనర్గా నియమిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు సాంబశివరావు, పూర్ణచంద్రరావు, గౌతమ్శావంత్, అనురాధ, సురేంద్రబాబులతో పాటు డీఐజీ పి.ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. -
స్పీడెక్కువైతే...లెసైన్స్ రద్దు
పాడేరు రూరల్ : మన్యంలో ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పాడేరు డివిజన్ పోలీసులు నడుం బిగించారు. డ్రైవర్లకు, వాహన యజమానులకు కౌన్సెలింగ్ చేపట్టారు. తప్పతాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లను గుర్తించడానికి ప్రత్యేకంగా మౌత్ అలార్ట్ మిషన్ను తెప్పించారు. గురువారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్కార్యాలయంలో పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి. మాడుగుల మార్గాలో జీపులు, ఆటో సర్వీసులు చేస్తున్న డ్రైవర్లు, వాహన యజమానులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వీలుగా ముద్రించిన గోడ పత్రికలను అవిష్కరించారు. ఈ సందర్భంగా పాడేరు ఏఎస్పీ బాబూజీ మాట్లాడుతూ జీపులు, ఆటోల్లో పరిమితి మేరకే ప్రయాణికులను ఎక్కించాలని, వేగాన్ని తగ్గించాలని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని హెచ్చరించారు. ఎవరైనా ప్రమాదాలకు కారణమైతే అటువంటి వారి లెసైన్స్లను రద్దు చేసి, వాహనాలను సీజ్ చేసి, హత్య కేసు నమోదు చేస్తామన్నారు. సక్రమంగా వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉన్న లెసైన్స్లు లేని డ్రైవర్లను గుర్తించి రవాణ శాఖ ద్వారా పోలీసు శాఖ లెసైన్స్లను ఇప్పించే ఏర్పాట్లు చేస్తుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్టీవో శివరామకష్ణ, పాడేరు డిపో మేనేజర్ వి. ప్రవీణ, పాడేరు సీఐ ఎన్. సాయి, పాడేరు హుకుంపేట ఎస్ఐలు ధనుంజయ్, భరత్కుమార్ పాల్గొన్నారు. -
కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సం ఖ్యను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన కొత్త పట్టణాల్లో బార్ల ఏర్పాటు కు లెసైన్స్లు జారీ చేస్తారు. జూలై 1 నుంచి మొదలు కాబోతున్న 2014- 15 ఎక్సైజ్ పాలసీని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ప్రస్తు త బార్లను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా జీవోలు జారీ చేశారు. కాగా,బార్ల లెసైన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబుల్లో ఈ ఫీజులు ఉంటాయి. అయితే ప్రివిలేజ్ ఫీజు 5 రెట్లకు కుదించారు. అంటే లెసైన్స్ ఫీజు కన్నా ఐదు రెట్ల అమ్మకాలు దాటితే, తరువాత కొనుగోలు చేసే బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ 14.5 శాతం ఫీజు వసూలు చేస్తుంది. పెరగనున్న బార్లు: తెలంగాణలోని 10 జిల్లాల్లో బార్ లెసైన్స్లు 726 ఉన్నప్పటికీ ప్రస్తుతం 704 మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటివరకు బార్లులేని కొత్త మునిసిపాలిటీల్లో వాటిని ఏర్పాటుకు ఎక్సైజ్ కమిషనర్ అనుమతిస్తారు. రాష్ట్రంలో మొత్తం 38 మునిసిపాలిటీలు ఉండగా వీటిలో 8 కొత్తవే. బార్ల లెసైన్స్ ఫీజు ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రివిలేజ్ ఫీజును 5 రెట్లకు తగ్గించడం వల్ల ఒక్కో బార్ నుంచి కనీసం రూ. 5లక్షల వరకు సర్కార్కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. -
భలే కిక్కు
మద్యం దుకాణాల టెండర్లకు ముగిసిన గడువు చివరి రోజు పోటెత్తిన వైనం దరఖాస్తుల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం నేడు లాటరీ ద్వారా లెసైన్సుల మంజూరు 100కు పైగా షాపులకు దరఖాస్తులు నిల్ చిత్తూరు (అర్బన్): మద్యం దుకాణాల నిర్వహణ లెసైన్స్ల జారీకి దరఖాస్తులు వెల్లువెత్తారుు. రెండు రోజులుగా అంతంతమాత్రంగా పడిన దరఖాస్తులు చివరి రోజైన శుక్రవారం సుమారు వెయ్యికి పైగా వచ్చాయి. మహిళలు, వృద్ధులు, పిల్లల నుంచీ దరఖాస్తులు అందడం గమనార్హం. జిల్లాలోని 458 మద్యం దుకాణాల నిర్వహణకు ఎక్సైజ్ అధికారులు ఈనెల 23న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించడానికి పెద్ద సంఖ్యలో పోటీదారులు బారులుతీరారు. రూ.2 కోట్ల ఆదాయం చిత్తూరులో 214, తిరుపతి ఎక్సైజ్ జిల్లాలో 244 మద్యం దుకాణాలకు మొత్తం రెండు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి దరఖాస్తుకూ రూ.25 వేలు (నాన్ రీఫండబుల్) డీడీ రూపంలో దరఖాస్తుదారులు చెల్లించాలి. ఈ లెక్కన ఇంకా ఒక్క దుకాణం కేటాయింపు జరగకుండానే ప్రభుత్వానికి దాదాపు రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. 2014-15 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ పెట్టుకున్న రూ.117 కోట్ల లక్ష్యాన్ని సులువుగా చేరుకోనుంది. నేడు లాటరీ ద్వారా ఎంపిక లెసైన్సుల ఖరారు కోసం శనివారం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పేర్కొన్నారు. పలు దుకాణాలకు దరఖాస్తులు నిల్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి లెసైన్సుల జారీ రుసుములను భారీగా పెంచేయడం, దుకాణాల ధరలూ పెరగడంతో పలు మద్యం దుకాణాలకు దరఖాస్తులు పడలేదు. వీటి సంఖ్య జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు చివరి రోజున ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంతమంది టెండర్లు వేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఏయే దుకాణాలకు టెండర్లు పడలేదనే విషయాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. మేము సైతం మద్యం దుకాణాల లెసైన్సుల కోసం ఈసారి మహిళామణులు టెండర్లు వేశారు. దుకాణాల కేటాయింపులో ఎలాంటి రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కొందరు మహిళలు ఒక్కరే నేరుగా పాల్గొని లెసైన్సుల కోసం దరఖాస్తులు వేశారు. మరికొన్ని దుకాణాలను భర్తలు సెంటిమెంట్ కోసం వారి భార్యలు, కుమార్తెల వద్ద టెండర్లు వేయించారు. మరికొందరు వారి తల్లులను సైతం తీసుకువచ్చి టెండర్లు వేయించారు. పలుచోట్ల వాగ్వివాదం మద్యం టెండర్లు వేయడానికి వచ్చిన దరఖాస్తుదారులు పలు చోట్ల వాగ్వివాదాలకు దిగారు. శ్రీకాళహస్తి మండలంలో ఒకే షాపునకు 23 మంది దరఖాస్తులు వేయగా, ఎక్సైజ్ అధికారుల ముందే నువ్వు వేయకూడదంటే... నువ్వు వేయకూడదని దుర్భాషలాడుకున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల లోపు దరఖాస్తులను అందజేయాల్సి ఉంది. తిరుపతి - చిత్తూరు మార్గంలో రైల్వేగేటు పడిపోవడంతో 20 మంది దరఖాస్తులు వేయలేకపోయారు. సమయం సమీపిస్తుండడంతో దరఖాస్తులు వేయడానికి పలువురు పరుగులు తీసి టెండర్లను దాఖలు చేశారు. -
ముగియనున్న లెసైన్స్ గడువు
భీమవరం క్రైం : ఎక్సైజ్ కొత్త పాలసీని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఎక్సైజ్ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. మద్యంషాపుల లెసైన్స్ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత షాపుల మంజూరుకు అనుసరించాల్సిన విధి విధివిధానాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగిసేలోగా చేయాల్సిన పనులను ఏవిధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం 389 వైన్ షాపులు, 39 బార్లకు సంబంధించి లెసైన్స్లను పాత విధానంతోనే అమలు చేస్తారా? లేక కొత్త విధానం రూపొం దిస్తారా? అనేది మద్యం వ్యాపారులకు ఉత్కంఠగా మారింది. ప్రైవేట్ వ్యక్తులు మద్యం వ్యాపారం చేసుకునేలా ఎక్సైజ్ పాలసీని రూపొందిస్తారా? లేక ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతుందా? అనేవి ప్రశ్నలుగా మారాయి. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల నేపధ్యంలో మద్యం దుకాణాల యజమానులకు నష్టం వాటిల్లిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని పాలసీని రూపొందిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని ప్రకటించకపోతే ప్రస్తుతం ఉన్న లెసైన్స్లనే కొన్ని నెలలు పొడిగిస్తారని పలువురు భావిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement