-
వివాహిత అనుమానాస్పద మృతి
- భర్తే చంపాడంటూ మృతురాలి బంధువుల ఆరోపణ - నిందితుని ఇంటి ముందు ఆందోళన గుంతకల్లు : గుంతకల్లు సత్యనారాయణపేటలో నివాసముంటున్న ట్రక్కు డ్రైవర్ నారాయణ భార్య లింగమ్మ(36) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు కసాపురం పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం కుందనకుర్తికి చెందిన లింగమ్మ వివాహం గుంతకల్లుఓని బర్మశాలలో నివాసముంటున్న నారాయణతో కొన్నేళ్ల కిందట అయింది. తమ తాహతుకు తగ్గట్టు కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని లింగమ్మ సోదరుడు రాజేశకర్ తెలిపారు. కొన్నాళ్ల పాటు వారి సంసారం సాఫీ గానే సాగింది. వీరికి కొడుకు, కుమార్తె కూడా కలిగారు. ఆ తరువాత తాగుడు, జూదానికి అలవాటుపడిన నారాయణ, తన సోదరుడు శ్రీరాములు, ఆడపడుచులు శకుంతల, రత్నతో కలసి పుట్టింటికి వెళ్లి డబ్బు తేవాలంటూ లింగమ్మను వేధిస్తుండేవారని ఆరోపించారు. దీంతో రెండేళ్ల కిందట అప్పు చేసి అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చామన్నారు. రెండు నెలల కిందట ఇంకో రూ.20 వేలు ముట్టజెప్పానని రాజశేఖర్ తెలిపారు. అయినా తమ చెల్లి లింగమ్మను నిత్యం కొడుతుండేవాడని ఆరోపించారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా.. నారాయణ వేధింపులు తాళలేక కసాపురం పోలీసులను మంగళవారం ఆశ్రయించినట్లు రాజశేఖర్ తెలిపారు. పోలీసులు అతన్ని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారన్నారు. అయితే బుధవారం లింగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందంటూ తమకు ఫోన్ వచ్చిందని రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యారు. తన చెల్లిని భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులే కొట్టి చంపారని ఆయన ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే కొట్టి చంపారని ఆయన వాపోయారు. ఆ తరువాత ఆత్మహత్యగా చిత్రీకరించే క్రమంలో లింగమ్మ నోట్లో పురుగుల మదు పోసారని నాటకాలాడుతున్నట్లు ఆరోపించారు. బంధువుల ఆందోళన లింగమ్మను హతమార్చిన ఆమ భర్త నారాయణ, అతని కుటుంబ సభ్యులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ఎవరూ ముందుకు రాలేదు. ఆస్పత్రి ఎదుటే తమ ఆందోళనను కొనసాగించారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
భర్తకు అంత్యక్రియలు నిర్వహించిన భార్య
కుమారులు లేకపోవడంతో భర్త అంత్యక్రియలను భార్య నిర్వహించిన సంఘటన మెదక్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దశంకరంపేటకు చెందిన కుమ్మరి లక్ష్మయ్య (65) మాజీ వార్డు సభ్యుడు, గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో భార్య లింగమ్మ భర్తకు అంత్యక్రియలను నిర్వహించింది. లక్ష్మయ్యకు ఐదుగురు కుమార్తెలున్నారు. వీరిలో నలుగురికి వివాహం జరిపించాడు. మరో కూతురు వివాహం చేయాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అచ్చంపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్పై గంగమ్మపల్లి తిరునాళకు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్త లింగమ్మ(45), అల్లుడు గోపి(24) మృతిచెందగా.. గోపి భార్య అనూషకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అనూషను సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా బెల్లంకొండ మండలం వన్నాయిపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
కుటుంబ కలహాలతో ఓ వివాహిత మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లింగమ్మ(25) ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. 90 శాతం కాలిన గాయాలతో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ముగ్గురు రైతుల బలవన్మరణం
వరంగల్: అప్పుల బాధతో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో మంగళవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా కాటారానికి చెందిన గోగుల రాజబాబు(26) గతేడాది మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతానికి వెళ్లి నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. పెట్టుబడికి రూ.2 లక్షలు అప్పు చేశాడు. కానీ, పంట పండలేదు. ఈ ఏడాది కాటారంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మళ్లీ పత్తి వేశాడు. పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. మెుత్తం అప్పు రూ.3.50 లక్షలకు చేరింది. ఆశించిన మేర రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని మనోవేదన చెందాడు. రాజబాబు మంగళవారం సమీప అటవీ ప్రాంతంలో ఉరేసుకున్నాడు. అతడికి భార్య శారద, కుమారుడు ఉన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన ముక్కాంల లింగమ్మ (48), భర్త లింగయ్యతో కలిసి వ్యవసాయం చే స్తోంది. తమకున్న 5 ఎకరాలతోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరిని సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. మంగళవారం ఇంట్లోనే పురుగులమందు తాగింది. అలాగే, వరంగల్ జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన రేగుల ఊర్మిళ(35), సదయ్య దంపతులు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. భర్త సదయ్య కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఊర్మిళ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రబీలో నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షంతో పంట నేలవాలింది. దీంతో మనస్తాపానికి గురైన ఊర్మిళ సోమవారం రాత్రి వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement